ఈ గ్రామాల్లో బోరుబావులు నిషేధం | - | Sakshi
Sakshi News home page

ఈ గ్రామాల్లో బోరుబావులు నిషేధం

Mar 26 2025 12:34 AM | Updated on Mar 26 2025 12:34 AM

ఈ గ్రామాల్లో బోరుబావులు నిషేధం

ఈ గ్రామాల్లో బోరుబావులు నిషేధం

అనంతపురం అగ్రికల్చర్‌: ఆంధ్రప్రదేశ్‌ నీరు, భూమి, వృక్షముల చట్టం–వాల్టా (ఏపీ వాటర్‌, ల్యాండ్‌ అండ్‌ ట్రీ యాక్ట్‌–2002) ప్రకారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 64 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బోరుబావుల తవ్వకాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా గ్రామాల్లో అత్యధిక నీటి వినియోగం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితోనే తాగునీటి అవసరాల కోసం బోరుబావుల తవ్వకం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

నిషేధిత జాబితాలోని గ్రామాలిలా...

● పుట్లూరు మండలం కోమటికుంట్ల, మడుగుపల్లి, తాడిపత్రి మండలం బోడాయిపల్లి, బొందలదిన్నె, హుస్సేనాపురం, సజ్జలదిన్నె, తాడిపత్రి రూరల్‌ పంచాయతీ, యల్లనూరు మండలం అరవేడు, బొప్పేపల్లి, మేడికుర్తి, పెద్దమల్లేపల్లి, తిరుమలాపురం, వేములపల్లె గ్రామ పంచాయతీ.

● శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో అత్యధికంగా 51 గ్రామాలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అగళి మండలం హుళ్లికెరదేవరహళ్లి, ఇనగలూరు, మధూడి, నరసంబూడి, పి.బ్యాడిగేరె, రావుడి, అమడగూరు మండలం కరిణిరెడ్డిపల్లి, లోకోజిపల్లి, అమరాపురం మండలం తమ్మిడేహళ్లి, చిలమత్తూరు మండలం ధేమకేతేపల్లి, హుస్సేనా పురం, గాండ్లపెంట మండలం చామచాయన బైలు, చామలగొంది, గాండ్లపెంట, జీనుగులకుంట, కురుమామిడి, మడుగువానిగొంది, సోమయాజుపల్లి, గుడిబండ మండలం జి.మోరుబాగల్‌, కేకాతి, ఎస్‌.రాయాపురం హిందూపురం మండలం దేవరపల్లె, గోళ్లాపురం, కిరికెర, కొటిపి, కొట్నూరు, మలుగూరు, మణేసముద్రం, శ్రీకంఠాపురం రూరల్‌, లేపాక్షి మండలం చోళసముద్రం, ఎన్‌పీ కుంట మండలం ఎదురుదొన, గూటిబయలు, గౌకనపల్లి, ముడుపలజూవి, రొద్దం మండలం చెరకూరు, రొళ్ల మండలం బొమ్మగుండనహళ్లి, దొడ్డేరి, కాకి, ఎం.రాయాపురం, రొళ్ల, తాడిమర్రి మండలం దాడితోట, తలుపుల మండలం పులిగుండ్లపల్లె, తనకల్లు మండలం అగ్రహారంపల్లె, బాలసముద్రం, బొంతలపల్లె, చీకటిమానిపల్లి,దిగువమందల పల్లి, గుర్రంబయలు, కోటపల్లె, మద్దినాయనిపాలెం, టి.సదుంలు ఉన్నాయి.

రాష్ట్రంలో 300 పంచాయతీలు

రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల పరిధిలో 300 గ్రామ పంచాయతీలను ‘వాల్టా’ పరిధిలోకి తీసుకొచ్చారు. అందులో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 94 గ్రామాలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీకాకుళం– 76, శ్రీ సత్యసాయి–51, వైఎస్సార్‌ కడప– 32, చిత్తూరు– 18, పల్నాడు– 16, అనంతపురం –13, అన్నమయ్య జిల్లాలో ఒక గ్రామం... ఇలా మొత్తం 300 గ్రామాల్లో ‘వాల్టా’ అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు భూగర్భజలశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ కె.తిప్పేస్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement