ఖరీదైన సేవ.. ఇక ఉచితం | - | Sakshi
Sakshi News home page

ఖరీదైన సేవ.. ఇక ఉచితం

Apr 12 2024 12:35 AM | Updated on Apr 12 2024 12:35 AM

అనంతపురం మెడికల్‌: వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకొస్తోంది. పేదలకు కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే సర్వజనాస్పత్రిలో ‘అఫేరిసిస్‌’ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది.

ఉపయోగమిదే...

డెంగీ, మలేరియా, హై బీపీ తదితర సమస్యలున్న వారిలో ఒక్కోసారి ప్లేట్‌లెట్స్‌ అమాంతంగా పడిపోతాయి. అలాంటి వారికి సాధారణ ప్లేట్‌ లెట్స్‌ నాలుగు యూనిట్లు ఎక్కిస్తే 40 వేల నుంచి 50 వేల ప్లేట్‌లెట్స్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అదే సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌ ఒక్క యూనిట్‌ ద్వారానే అదే స్థాయిలో ప్లేట్‌లెట్స్‌ పెంచవచ్చు. అయితే, అఫేరిసిస్‌ పరికరం ద్వారా ఈ సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌ అందించాల్సి ఉంటుంది. గతంలో ఈ పరికరం లేక రోగులు ప్రైవేటుగా సేవలు పొందాల్సి వచ్చేది. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇందుకు రూ.8 వేలు ఖర్చవుతుండగా, ప్రైవేటు బ్లడ్‌ బ్యాంకుల్లో అయితే రూ.15 వేల వరకూ సమర్పించుకోవాల్సి వచ్చేది. అయితే, పేదలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. పెద్దాస్పత్రిలో రూ.24 లక్షల విలువ చేసే అఫేరిసిస్‌ పరికరం అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగులపై భారం పడకుండా సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌ ఉచితంగా అందించనుంది. సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్‌ వెంకటేశ్వర రావు సూచించారు.

పెద్దాస్పత్రిలో అందుబాటులోకి ‘అఫేరిసిస్‌’

ప్రైవేటుగా ఈ సేవ పొందాలంటే

రూ.11 వేల నుంచి రూ.14 వేల ఖర్చు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement