పేగుబంధం మరువలేక తండ్రి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

పేగుబంధం మరువలేక తండ్రి బలవన్మరణం

Sep 17 2023 6:26 AM | Updated on Sep 17 2023 10:43 AM

- - Sakshi

అనంతపురం సిటీ: చిన్నారి మృతితో మనస్తాపం చెందిన తండ్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్పీ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ తెలిపిన మేరకు... కూడేరు మండం జయపురం నివాసి కె.మల్లికార్జున(20), మధులత దంపతుల మూడు నెలల చిన్నారి ఇటీవల మృతి చెందింది. అప్పటి నుంచి మల్లికార్జున తీవ్ర మనో వేదనలకు లోనై ఎవరితోనూ సరిగా మాట్లాడక ముభావంగా ఉంటూ వచ్చాడు.

రోజూ బిడ్డను తలచుకుంటూ ఏడ్చేవాడు. నా బిడ్డ లేని లోకంలో నేనూ ఉండలేనంటూ కుటుంబసభ్యులతో, సన్నిహితులతో అనేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అనంతపురం–తాడిచెర్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మధులత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement