దేశరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
యువకులు దేశ సైన్యంలో చేరి దేశ రక్షణకు పాటుపడాలి. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అగ్నివీర్లో భాగస్వాములు కావాలి. ఈ మధ్య కాలంలో ప్రవేశపెట్టనున్న 20 యూనిట్ల టెరిటోరియల్ ఆర్మీలో పాల్గొని దేశం కోసం శ్రమించాలి. ఎంపికై న వారికి 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరంలో కనీసం రెండు నెలల వ్యవధి ఆర్మీలో శిక్షణ అవ్వాలి. అలా చేసినట్టయితే పదవీ విరమణ అనంతరం వారికి పెన్షన్ అందుతుంది. దీనికి 45 సంవత్సరాల వయస్సు గల ప్రతి ఒక్క బారతీయుడు అర్హతగా ఆర్మీలో చేర్చుకుంటారు.
– కూండ్రపు వెంకునాయుడు, మాజీ సైనికుడు, అచ్యుతాపురం


