కోడి పందాల శిబిరాలపై దాడి
కోడి పందాలరాయుళ్లతో రావికమతం ఎస్ఐ రఘువర్మ, పోలీసు సిబ్బంది
రావికమతం: మండలంలో దిడ్డి గ్రామంలో కోడి పందాలు శిబిరంపై ఆదివారం ఎస్ఐ రఘువర్మ పోలీసు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 కోళ్లు , రూ.1680 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసామని ఎస్ఐ తెలిపారు. పండగలు, తీర్థాలు సందర్భంగా కోడి పందాలు, జూదం, అశ్లీల నృత్యాలు వంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు.


