జీవీఎంసీకి స్వచ్ఛ పురస్కార్‌ | - | Sakshi
Sakshi News home page

జీవీఎంసీకి స్వచ్ఛ పురస్కార్‌

Jul 18 2025 5:08 AM | Updated on Jul 18 2025 5:08 AM

జీవీఎంసీకి స్వచ్ఛ పురస్కార్‌

జీవీఎంసీకి స్వచ్ఛ పురస్కార్‌

సఫాయి మిత్ర సురక్షిత్‌ షెహర్‌ ప్రత్యేక కేటగిరీలో ప్రథమ స్థానం

డాబాగార్డెన్స్‌: స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2.0లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2024కు గానూ జీవీఎంసీ జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కారాన్ని దక్కించుకుంది. సఫాయి మిత్ర సురక్షిత్‌ షెహర్‌ ప్రత్యేక కేటగిరీలో ప్రథమ స్థానం కై వసం చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్‌–2024 అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ చేతుల మీదుగా మేయర్‌ పీలా శ్రీనివాసరావు, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్‌తో కలిసి ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ ప్రత్యేక కేటగిరీలో జీవీఎంసీ ప్రథమ స్థానం సాధించడం విశాఖ నగరానికి ఎంతో గౌరవమన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్‌–2025లో కూడా జీవీఎంసీ ఉత్తమ పరిశుభ్ర నగరంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement