
ఉరేసుకుని యువకుడి మృతి
ఎస్.రాయవరం:ఽ కుటుంబ కలహాలతో చెట్టుకు ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ధర్మవరం అగ్రహారంలో ఆదివారం చోటు చేసుకుంది. ఏఎస్ఐ వెంకటేశ్వర్లు అందించిన వివరాల ప్రకారం.. కోటవురట్ల మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన మంచాల రాము(35) గత రాత్రి ధర్మవరం అగ్రహారం సమీపంలో జాతీయ రహదారికి ఆనుకున్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని జేబులో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు మద్యానికి బానిసై కుటుంబ సభ్యులతో నిత్యం గొడవలు పడేవాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.