
బుచ్చింపేటలో పశువుల పాక దగ్ధం
కాలిపోయిన పశువుల పాకను ఆర్పుతున్న రైతులు
రోలుగుంట : మండలంలోని బుచ్చింపేట గ్రామంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన పాటూరి శ్రీరాముకు చెందిన పశువుల పాక దగ్ధమైంది. వివరాలివి. పశువుల పాక యజమాని సోమవారం మధ్యాహ్నం పొలం పాకల వద్ద పనులు ముగించుకొని భోజనానికి ఇంటికి వచ్చేశాడు. గంట తరువాత ఇతని పొలం పాకల నుంచి మంటలు వ్యాపించడంతో కుటుంబీకులతో కలసి పాక వద్దకు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చుకున్నారు. ఇక్కడ ఏ విధమైన ప్రాణ నష్టం జరగలేదు, అయితే ఈ పాక సమీపంలో గల మేకల దొడ్డు కూడా కాలిపోయింది. సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి వచ్చి నష్టాన్ని అంచనా వేసి పరిహారం ఇప్పించాలని బాధితుడు కోరారు.