
యలమంచిలి రూరల్: పట్టణంలోని రాంనగర్కు చెందిన యాదగిరి లక్ష్మణరావు భార్య సాయిలక్ష్మి, ఆరేళ్ల కుమారుడు రిషివర్థన్ బుధవారం నుంచి కనిపించడం లేదని పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదైంది. తాను డ్యూటీకి వెళ్లి, ఇంటికి వచ్చేసరికి తన భార్య, కుమారుడు కనిపించలేదని, చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 28న తాను విధులకు వెళ్లిన తర్వాత ఉదయం తొమ్మిదిన్నర గంటలకు బ్యాగు పట్టుకుని కుమారుడితో సహా వెళ్లిపోయినట్టు చుట్టుపక్కల వారు చెప్పారని భర్త పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్సై కె.సావిత్రి మీడియాకు తెలిపారు.