భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

Jun 8 2025 12:52 AM | Updated on Jun 8 2025 12:54 AM

అనకాపల్లి టౌన్‌: ముస్లిం సోదరులు శనివారం జిల్లా అంతటా భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ పండగను నిర్వహించారు. మసీదు వీధిలో ఉన్న జామియా మసీదు, శారదానది ఒడ్డున ఉన్న దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సందర్భంగా జామియా మసీదు అధ్యక్షుడు హుస్సేన్‌ మాట్లాడుతూ ఈ పండగ దయ, దాతృత్వం ప్రాముఖ్యత తెలియజేస్తుందన్నారు. సమాజంలో ఐక్యత, సోదర భావం మరిమళించేలా ఈ పర్వదినాన్ని జరుపుకొంటామన్నారు. కశింకోటలోని జామియా, నూరి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నూరి మసీదు కమిటీ నూతన అధ్యక్షుడు షేక్‌ కరీముల్లా రెహమాన్‌ (బాబర్‌) మాట్లాడుతూ నిస్వార్థమైన ఆత్మీయత, అనుబంధాలను వ్యాపింపజేయడమే బక్రీద్‌ పండగ ఉద్దేశమన్నారు.

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ 1
1/1

భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement