రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కొయ్యూరు: పెదమాకవరం పంచాయతీ రామరాజుపాలెం వంతెన వద్ద బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కంపరేగులకు చెందిన పనసలరాజు, సత్తిబాబు, రామరాజుపాలెనికి చెందిన లోతా రాజుబాబు బైక్పై నడింపాలెం వెళ్తున్నారు. ఆ సమయంలో రామరాజుపాలెం వంతెన వద్ద వాహనం అదుపుతప్పడంతో డివైడర్ను బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు కు బలమైన గాయాలయ్యా యి. అతడిని కొయ్యూరు ఎస్ ఐ కిశోర్వర్మ 108లో కృష్ణదేవిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో సత్తిబాబు, రాజుబాబుకు స్వల్పగాయాలయ్యాయి. వారిని కృష్ణాదేవిపేట ఆస్పత్రి లో వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ కిశోర్వర్మ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు


