చలి గుప్పెట్లో మన్యం
నమోదు అవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క చలి తీవ్రత పెరుగుతోంది. పొగమంచు ఉదయం 8 గంటల వరకు దట్టంగా కురుస్తోంది. పాడేరు డివిజన్ పరిధిలోని జి.మాడుగులలో గురువారం 14.2 డిగ్రీలు, అరకువ్యాలీలో 14.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ఏడీఆర్/వాతావరణ విభాగం నోడల్ అదికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. డుంబ్రిగుడలో 15.5 డిగ్రీలు, ముంచంగిపుట్టులో 15.7, హుకుంపేటలో 16.0, పెదబయలులో 16.3 డిగ్రీలు, పాడేరులో 16.7 డిగ్రీలు, చింతపల్లిలో 17.0 డిగ్రీలు, కొయ్యూరులో 21.6 డిగ్రీలు నమోదు అయినట్టు ఆయన పేర్కొన్నారు. – సాక్షి, పాడేరు, చింతపల్లి
చలి గుప్పెట్లో మన్యం


