అవినీతి నిర్మూలనకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

అవినీతి నిర్మూలనకు సహకరించాలి

Oct 28 2025 7:46 AM | Updated on Oct 28 2025 8:06 AM

మోతుగూడెం సీఈ కార్యాలయం వద్ద ర్యాలీ చేస్తున్న అధికారులు, సిబ్బంది

మోతుగూడెం: సర్దార్‌ వల్లబాయి పటేల్‌ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే విజిలెన్స్‌ అవగాహన వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నవంబరు 2వ తేదీ వరకు సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ , రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఏపీ జెన్‌కో యాజమాన్యం ద్వారా లోయర్‌ సీలేరు సీఈ కార్యాలయంలో సెక్యూరిటీ అండ్‌ విజిలెన్స్‌ ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఈ కేవీ రాజారావు మాట్లాడుతూ అవినీతి నిర్మూలించడానికి అందరూ కలిసి నిజాయితీగా, పారదర్శకంగా నిబద్దతో పనిచేయాలని, ఉద్యోగం బాధ్యతయుతగా చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఎస్‌ఈ చిన కామేశ్వరరావు, ఈఈలు బాలకృష్ణ, నాగ శ్రీనివాస్‌,వరప్రసాద్‌ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement