గుర్రాయి జలపాతం అభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

గుర్రాయి జలపాతం అభివృద్ధికి కృషి

Oct 20 2025 7:46 AM | Updated on Oct 20 2025 7:46 AM

గుర్రాయి జలపాతం అభివృద్ధికి కృషి

గుర్రాయి జలపాతం అభివృద్ధికి కృషి

జి.మాడుగుల: మండలంలో కుంబిడిసింగి–పెదలోచలి పంచాయతీల మధ్యలో ప్రకృతి అందాలతో కొండల నడుమ ప్రవహిస్తున్న గుర్రాయి జలపాతాన్ని ఆదివారం ఏపీ టూరిజం డైరెక్టర్‌ కిల్లు వెంకట రమేష్‌ నాయుడు సందర్శించారు. జలపాత ప్రాంతాలను పరిశీలించారు. స్థానికులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జలపాతం పరిసరాలు చాపరాయి కంటే అందంగా ఉన్నాయని, పర్యాటకులను బాగా ఆకర్షిస్తుందన్నారు. జి.మాడుగుల మండల కేంద్రానికి 3 కిలోమీటర్లు దూరంలో గల ఈ జలపాత ప్రాంతాన్ని అబివృద్ధి దిశగా ముందుకు తీసుకుకెళ్తామని ఆయన తెలిపారు. జలపాతాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. గుర్రాయి జలపాతం అభివృద్ధి అంశాన్ని కలెక్టర్‌, ఐటిడిఏ పీవో దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement