ఘాట్‌లో వాహనం బోల్తా | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌లో వాహనం బోల్తా

Oct 13 2025 7:22 AM | Updated on Oct 13 2025 7:22 AM

ఘాట్‌లో వాహనం బోల్తా

ఘాట్‌లో వాహనం బోల్తా

పర్యాటకుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు

చింతూరు: మారేడుమిల్లి, చింతూరు ఘాట్‌రోడ్‌లో ఆదివారం ట్రావెల్స్‌ వాహనం బోల్తాపడిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాకినాడలోని ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన 15 మంది విహారయాత్రకు చింతూరు వైపు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘాట్‌రోడ్‌లోని కనకదుర్గ గుడి సమీపంలో వారు ప్రయాణిస్తున్న ట్రావెల్స్‌ వాహనం అదుపుతప్పి పక్కనేఉన్న కల్వర్టులో పడిపోయింది. ఈ ఘటనలో దువ్వా మనోజ్‌, అయినూరి శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు కాగా అటుగా వెళ్తున్న ప్రయాణికులు వీరిని గమనించి చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మిగతా వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. కాగా మనోజ్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement