ముమ్మరంగా పోలీసు తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా పోలీసు తనిఖీలు

May 1 2025 2:02 AM | Updated on May 1 2025 2:02 AM

ముమ్మరంగా పోలీసు తనిఖీలు

ముమ్మరంగా పోలీసు తనిఖీలు

ముంచంగిపుట్టు: ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ముంచంగిపుట్టులో బుధవారం స్థానిక ఎస్‌ఐ జె.రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో కాకులమామిడి,కాంటవరం అటవీ ప్రాంతంలో రెండు స్లారు మావోయిస్టులకు,పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడంతో సరిహద్దులో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఆంధ్ర,ఒడిశా సరిహద్దులో ఉన్న గిరిజన గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.ప్రయాణికుల బ్యాగులు,లగేజీలను క్షణ్ణంగా పరిశీలించారు. మండల కేంద్రంలో సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు బలగాలు గస్తీ నిర్వహించాయి.ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన మాచ్‌ఖండ్‌,ఒనకఢిల్లీ గ్రామాల్లో బీఎస్‌ఎఫ్‌ బలగాలు సైతం సరిహద్దు రాకపోకలపై నిఘాను పెంచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement