
అక్రమాలకు తావులేకుండా పంపిణీ
చింతూరు: అక్రమాలకు తావులేకుండా సజావుగా రేషన్ సరకులు పంపిణీ చేయాలని ఐటీడీఏ పీవో అపూర్వభరత్ ఆదేశించారు. మండలంలోని చట్టిలో జీసీసీ దుకాణం వద్ద వద్ద రేషన్ పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ నిబంధనల ప్రకారం అన్ని జీసీసీ, ప్రైవేటు కేంద్రాల్లో ఒకటో తేదీ నుంచి 15 వరకు తప్పనిసరిగా రేషన్ సరకులు పంపిణీ చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు వారి ఇళ్లవద్దకు వెళ్లి సరకులు అందచేయాలని సిబ్బందికి సూచించారు. రేషన్ పంపిణీకి సంబంధించి అన్ని డిపోల సమాచారంతో పాటు ఇళ్లవద్ద పంపిణీ చేసిన రేషన్ వివరాలను ఫొటోలతో సహా ప్రతిరోజూ తనకు వివరాలు అందజేయాలని ఆదేశించారు. వివరాలు అందజేస్తే రేషన్ దుకాణాల మరమ్మతులకు చర్యలు తీసుకుంటామన్నారు. సర్పంచ్ రవ్వ భద్రమ్మ, తహసీల్దార్ చిరంజీవి, జీసీసీ మేనేజర్ సుబ్రమణ్యం పాల్గొన్నారు.
చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్