
తారీఖు
అమ్మో...
అవ్వాతాతల్లో పెన్షన్ టెన్షన్
వ
1
పాడేరు : గత ఏడాది ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు అండ్ కో ఫిర్యాదుతో గ్రామ వలంటీర్ల సేవలు దూరం కావడంతో వృద్ధులు, ఇతర పింఛన్దారులకు ప్రారంభమైన కష్టాలు నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో 12,1994 మంది పింఛన్దారులు ఉండగా వీరికి నెలకు రూ.51.39కోట్లు అందజేస్తున్నారు.
ఒకటో తేదీ సాయంత్రమైనా కొన్ని ప్రాంతాల్లో పింఛను సొమ్ము చేతికి అందక అవ్వాతాతలకు చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో ఒకటో తేదీ వస్తే పింఛనుదారుల్లో ఒక్కటే ఆనందం కనిపించేది. కానీ ఇప్పుడు పండుటాకులకు బాధలు ప్రారంభమయ్యాయి.
వై.ఎస్.జగన్ పాలనలో ఇలా..
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఒకటో తేదీ ఉదయాన్నే వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి తలుపు తట్టిమరీ పింఛన్లుఅందజేశారు. ఐదేళ్ల పాటు అవ్వాతాతాలు, దివ్యాంగులు,వ్యాధిగ్రస్తులు.. ఇలా ప్రతి లబ్ధిదారుడికీ ఎలాంటి కష్టం రాకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటూ పింఛను అందజేసింది. వారి ముఖాల్లోని సంతోషమే ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది.
టీడీపీ పాలనలో..
2014–2019లో టీడీపీ ప్రభుత్వ పాలనలో పింఛన్దారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ప్రతి నెలాఒకటో తేదీన పింఛన్ సొమ్ము అందడం చాలా అరుదు. ఆ సొమ్ము కోసం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఇతర పింఛన్దారులు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి కిలోమీటర్ల దూరం నడిచి ప్రభుత్వ కార్యాలయాలకు చేరుకుని బారులు తీరేవారు. వేసవి కాలంలో అయితే క్యూలైన్లో నిలబడలేక సొమ్మసిల్లి పడిపోయేవారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం అవ్వాతాతలకు ఇంటి వద్దే పింఛన్ అందజేసి, వారి కష్టాలు తీర్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గ్రామ వలంటీర్ వ్యవస్థ రద్దు చేయడంతో పాత రోజులు పునరావృతమయ్యాయి.
పింఛన్ పేరుతో ఏడిపిస్తున్న కూటమి
తలుపుతట్టి ఇస్తామని చెప్పి.. సచివాలయాల్లో పంపిణీ
అవస్థలు పడుతున్న వృద్ధులు,
దివ్యాంగులు
పింఛన్ల కోతపైనే కూటమి దృష్టి
అస్తవ్యస్తంగా పంపిణీ
గ్రామ సచివాలయ సిబ్బందితో గడప వద్దే పింఛన్ అందజేస్తున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ జిల్లాలో ఎక్కడా అలా జరగడం లేదు. గ్రామానికో తీరున అస్తవ్యస్తంగా సాగుతోంది. గ్రామంలో అందరినీ ఒక చోటుకు పిలిచి అక్కడ పింఛన్ పంపిణీ చేస్తున్నా రు. కొన్ని గ్రామాల్లో గ్రామ సచివాలయాల వద్ద పింఛన్ అందజేస్తున్నారు. దీంతో చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. శరీరం సహకరించకపోవడం వల్ల అంతదూరం వెళ్లలేకపోతున్నామని, ఇంటి వద్దే పింఛన్ అందించాలని వారు వేడుకొంటున్నారు.
2,784 పింఛన్ల రద్దు
ఎన్నికల ముందు వరకు జిల్లాలోని 22 మండలాల్లో అన్ని రకాల పింఛన్దారులు కలిపి సుమారు 1,24,778 మంది ఉండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 1,21,994కు చేరుకుంది. మే నెలఖరు వరకు 2,784 మంది పింఛన్లను తొలగించారు. అకారణంగా తమ పింఛన్ నిలిపివేశారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అర్హతే కొలమానంగా కుల,మత, ప్రాంత, వర్గ, పార్టీ భేదాలు లేకుండా పింఛన్లను మంజూరు చేశారు. కూటమి ప్రభుత్వంలో సెప్టెంబర్ నెల నుంచి వివిధ కారణాలతో ప్రతి నెలా క్రమేపీ పింఛన్లను తగ్గుస్తూ వస్తున్నారు. రీ వెరిఫికేషన్ పేరుతో చాలా వరకు దివ్యాంగ పింఛన్లు తొలగించారు. మృతి చెందిన వారి పేర్లను జాబితా నుంచి తప్పిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ.. కారణం తెలియకుండానే కొంత మంది లబ్ధిదారులపై వేటు పడుతోంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా లేరన్న అక్కసుతో స్థానిక నేతల ఒత్తిళ్లతో కొంత మంది పేర్లు తప్పించారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

తారీఖు

తారీఖు

తారీఖు

తారీఖు