
దోమల నివారణకు సహకరించాలి
● కలెక్టర్ దినేష్కుమార్
సాక్షి,పాడేరు: దోమల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, దోమల నివారణ మందు పిచికారీ సకాలంలో పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ తెలిపారు. మలేరియా మాసోత్సవాల ప్రచార వాల్పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 30వతేదీ వరకు నిర్వహించే మలేరియా మాసోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.ప్రతి ఇంటి లోపల, బయట కూడా దోమల నివారణ మందును తప్పనిసరిగా పిచికారీ చేయాలన్నారు. క్షయవ్యాధి నివారణ కార్యక్రమాలను విస్తృతం చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో జమాల్ బాషా,జిల్లా మలేరియాశాఖ అధికారి తులసీ,ఎస్డీసీ లోకేశ్వరరావు,టీబీ కంట్రోల్ యూనిట్ వైద్యురాలు సూర్యనారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
పీఎం జన్మన్ గృహాల్లో జాప్యం తగదు
పీఎం జన్మన్ గృహాల గ్రౌండింగ్లో జాప్యం తగదని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.కలెక్టరేట్ నుంచి పలుశాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి,అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాలు వేగవంతమవ్వాలని,ఈనెల 12వతేదీన 11,470 ఇళ్ల లో గృహ ప్రవేశాలు జరపాలన్నారు. హర్ ఘర్ జల్ పథకం,జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీటి పథకాల పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.జిల్లాలో 120 ఎంస్ఎంఈ యూనిట్లు నెలకొల్పాలని తెలిపారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తామన్నారు.దివ్యాంగులకు నైపుణ్యశిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.ఈ సమావేశంలో పాడేరు,రంపచోడవరం ఐటీడీఏ పీవోలు అభిషేక్గౌడ,సింహాచలం,హౌసింగ్ ఈఈ బాబునాయక్,డీఎల్పీవో కుమార్,జిల్లా పరిశ్రమల అధికారి రవిశంకర్,పలుశాఖల అఽధికారులు పాల్గొన్నారు.
రెండు లక్షల మొక్కలు నాటాలి
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 5వతేదీన రెండు లక్షల మొక్కలు నాటాలని డీఎఫ్వో సందీప్రెడ్డిని కలెక్టర్ దినేష్కుమార్ ఆదేశించారు. వనం–మనం కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ లక్ష మొక్కలు,అటవీ అభివృద్ధి సంస్థ 50 వేల మొక్కలు,ఐటీడీఏ పీవోలు,సబ్కలెక్టర్లు,డ్వామా ఆధ్వర్యంలో 50వేల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.