
ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష
అల్లిపురం: పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోలీస్ కానిస్టేబుల్(సివిల్, ఏపీఎస్పీ) మెయిన్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నగరంలో మొత్తం 27 పరీక్ష కేంద్రాల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. మెయిన్స్కు 12,491 మంది అర్హత సాధించగా, 11,338 మంది మాత్రమే హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి, కేంద్రాల లోపలకు అనుమతించారు. నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, డీసీపీ–1(లా అండ్ ఆర్డర్) అజితా వేజెండ్ల, డీసీపీ–2 (లా అండ్ ఆర్డర్) డి.మేరి ప్రశాంతి, డీసీపీ (అడ్మిన్) శ్రీ కృష్ణకాంత్ పటేల్లపు పలు కేంద్రాలను తనిఖీలు చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.

ప్రశాంతంగా కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష