కైలాస్నగర్: బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో సోమవారం నిర్వహించనున్న సీఎం బహిరంగసభను విజయవంతం చేయాలని ప్రభుత్వవిప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. పట్టణంలోని పట్టణంలోని ప్రజాసేవభవన్లో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఆదివారం సభ సన్నాహక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, ఆత్మ చైర్మన్ సంతోష్రావు, కౌన్సిలర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
విప్ ‘ఆది’ని కలిసిన ‘కంది’
పిప్రిలో సీఎం పర్యటన ఏర్పాట్లను సమీక్షించేందుకు వచ్చిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కంది శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. అనంతరం సభ ఏర్పాట్లపై చర్చించారు.


