
వన మహోత్సవం విజయవంతం చేయాలి
● డీఆర్డీవో రాథోడ్ రవీందర్
కై లాస్నగర్: పచ్చదనం పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఆర్డీవో రాథోడ్ రవీందర్ అన్నారు. జిల్లాలోని ఏపీవోలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అ సిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లతో శుక్రవారం స్థా నిక టీటీడీసీ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా నిర్దేశించి న లక్ష్యాల మేరకు మొక్కలు నాటేలా శ్రద్ధ వహించా లన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు హాజరయ్యే కూలీలకు ప్రధానమంత్రి సు రక్ష బీమా యోజన పథకం కింద బీమా సౌకర్యం క ల్పిస్తున్నట్లు తెలిపారు. దీనిపై కూలీలకు అవగాహ న కల్పించాలన్నారు. ఇందులో ఏపీడీలు కుటుంబరావు, కృష్ణారావు, విజిలెన్స్ అధికారి కృష్ణారావు, ఏవో అందె గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.