
విధుల్లో అప్రమత్తంగా ఉండాలి●
తలమడుగు: మహారాష్ట్ర సరిహద్దు మండలాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు మండలంలోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ను మంగళవారం తనిఖీ చేశారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలోకి పశువుల అక్రమ రవాణా కాకుండా వివిధ శాఖల సమన్వయంతో చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తించాలన్నారు. స్టేషన్లో కేసులు పెండింగ్ లేకుండా చొరవ చూపాలన్నారు. అనంతరం కోసాయి రైల్వేస్టేషన్కు చేరుకుని అక్రమ రవాణాపై ఆరా తీసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎస్సై రాధిక, ఏఎస్సై లక్ష్మణ్, సిబ్బంది ఉన్నారు.