‘ఉపాధి’ సమస్యలు పరిష్కరించాలి
కై లాస్నగర్: ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. పనిప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాల ని, ప్రభుత్వం నిర్ణయించిన కూలీ రూ.307లో కోత పెట్టకుండా పూర్తిగా చెల్లించాలనే డిమాండ్తో కలెక్టరేట్ ఎదుట ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ వేతనాలు చెల్లించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ వంటి వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు ఎన్.స్వామి, కె.ఆశన్న, గంగారాం తదితరులు పాల్గొన్నారు.


