breaking news
Yantra Lakshmi scheme
-
గు‘లాబీ’లకే యంత్ర లక్ష్మి!
* అధికార పార్టీ కార్యకర్తలకే రాయితీ * పక్కదారి పట్టిన సబ్సిడీ ట్రాక్టర్లు... * అర్హులైన రైతులకు మళ్లీ మొండిచేయి * దుర్వినియోగమైన రూ.10 కోట్లు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘బంగారు తెలంగాణ నిర్మాణంలో రైతుల శ్రేయస్సే మా ప్రభుత్వం లక్ష్యం... వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తాం... ఆధునిక వ్యవసాయ విధానాలైన హరిత పందిళ్లు, యాంత్రీకరణను రైతులకు పరిచయం చేసి బంగారు పంటలు పండేలా వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తాం’ అని ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఈ మేరకు నిధులు, యూనిట్లు కూడా మంజూరు చేస్తోంది. అయితే కొందరు అ ధికారులు, అధికార పార్టీ నేతల వైఖరి కారణంగా ఆ పథకా లు పక్కదారి పడుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వం మాట లు నీటి మూటలే అవుతున్నాయి. రైతులు ఆరుగాలం శ్రమిం చి పండించిన పంటను ప్రకృతి వైపరీత్యాలు, దళారులు దెబ్బతీస్తుంటే.. మరోవైపున వారికి రాయితీపై అందే సౌకర్యాలను అధికార పార్టీ కార్యకర్తలు లాగేసుకుంటున్నారు. వ్యవసాయంలో ఆధునిక విధానాలైన యంత్ర పరికరాల వి నియోగం ద్వారా పంటల దిగుబడి పెంచాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన యూంత్రీకరణ పథకంలో అక్రమాలు, అవినీతి రాజ్యమేలుతున్నారుు. రాష్ట వ్యవసాయశాఖ మంత్రి సొంత జిల్లాలో అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు కలిసి యంత్రలక్ష్మి పథకం ద్వారా రైతులకు అందవలసిన రాయితీ ట్రాక్టర్లను అధికార పార్టీ కార్యకర్తలకు ధారాదత్తం చేశారు. ఈ వ్యవహారంపై ఆలస్యంగా సమాచారం తెలుసుకున్న మంత్రి.. సదరు నాయకులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. దీనికి తార్కాణమే జిల్లాలో అమలవుతున్న యంత్రలక్ష్మి పథకం. జిల్లా సహరక్షణ వేదిక సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేయగా వారిచ్చిన సమాచారంతో ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా అనేక అక్రమ రాయితీలు బయటకు వచ్చాయి. మండల కమిటీల సిఫారసు జాబితా చెత్తబుట్టలోకి.. వ్యవసాయంలో కూలీల కొరతను అధిగమించేందుకు యూంత్రీకరణ విధానాలను అమలులోకి తేవాలనే ఉద్దేశంతో ప్రారంభించిన యంత్రలక్ష్మి పథకం ప్రస్తుతం అభాసుపాలవుతోంది. జిల్లాలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకే ప్రాధాన్యతనిచ్చిన అధికారులు మండల కమిటీల ద్వారా పంపిన అర్హులైన రైతుల జాబితాను చెత్తబుట్టలో వేసి అనర్హులైన అధికార పార్టీ కార్యకర్తలకు దర్జాగా అప్పగించారు. 50 శాతం రాయితీతో రొటవేటర్లు, కల్టివేటర్లు, నాగళ్లు, చాప్కట్టర్స్, ట్రాక్టర్లు ఈ పథకం ద్వారా రైతులకు అందించాలి. కానీ జిల్లాలో అధికార పార్టీ ‘కష్ట జీవులకు’ అప్పగించారు. 2014-15 సంవత్సరంలో జిల్లాలో ఈ పథకం కింద రూ. 22.86 కోట్లు విడుదల కాగా 202 మందికి 50 శాతం రాయితీపై ట్రాక్టర్లు మంజూరు చేశారు. దీనిపై లబ్ధిదారులకు రూ.15.15 కోట్లు రాయితీ ఇచ్చారు. ఇందులో అనేక అక్రమాలు జరిగాయి. మండల స్థాయిలో ఎంపీడీఓ, వ్యవసాయ అధికారి, మండల పరిషత్ అధ్యక్షుడు, ఆదర్శ రైతులు సభ్యులుగా యంత్రలక్ష్మి పథకం అమలు కోసం కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల ద్వారానే అర్హులైన రైతులను యంత్ర పరికరాలు, రాయితీ ట్రాక్టర్ల కోసం ఎంపిక చేయాలి. కానీ అధికార పార్టీ నాయకుల సిఫారసు లేఖలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని రైతులకు కాని వారికి.. అంటే వ్యాపారస్తులు, వైద్యులు, పార్టీ కోసం పనిచేసిన వారికి లబ్ధి చేకూర్చారు. రాయితీ ట్రాక్టర్లలో 80 శాతం అనర్హులకే చేరడం గమనార్హం. ఇలా జిల్లాలో దాదాపు రూ. 610 కోట్ల మేర అవినీతి జరిగింది. అక్రమాలకు ఉదాహరణలివే.... మోర్తాడ్లో మండల కమిటీ ద్వారా 25 మంది అర్హులైన రైతుల జాబితా పంపగా, తొమ్మిది మందికి మాత్రమే లబ్ధి చేకూర్చారు. అయితే కమిటీ పంపిన జాబితా నుంచి ఐదుగురుని మాత్రమే ఎంపిక చేసి, మిగితా నలుగురి పేర్లు జాబితాలో లేకున్నా స్థానిక నాయకుల సిఫారస్ లేఖల ద్వారా ఎంపిక చేయడం విశేషం. * రెంజల్ మండలంలో ఒక వైద్యుడికి, నిజాంసాగర్లో ఇద్దరు వ్యాపారులకు రాయితీ ట్రాక్టర్లను అందజేశారు. * వేల్పూర్ మండలంలో 11 మందికి రాయితీ ట్రాక్టర్లు అందించగా, అందులో నలుగురు అధికార పార్టీ కార్యకర్తలు, ఉపసర్పంచులు ఉన్నారు. వారిలో ఒకరు రాష్ట్ర విత్తనోత్పత్తి కేంద్రం డెరైక్టర్గా పనిచేస్తున్నారు. * భీంగల్ మండలంలో రాయితీ ట్రాక్టర్లు ఐదుగురికి కేటాయించగా అందులో ఒకరు అధికార పార్టీ టౌన్ అధ్యక్షుడు, మరొకరు మండల ప్రజాప్రతినిధి బంధువు ఉన్నారు. ఇంకో నాయకుడు బినామీ పేరు మీద రాయితీ ట్రాక్టర్ అందుకున్నారు. * బోధన్ మండలంలో 13 మందికి రాయితీ ట్రాక్టర్లు ఇవ్వగా అందులో ఒకరు సొసైటీ చైర్మన్ (అధికార పార్టీ) కాగా మిగిత నలుగురు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. * జుక్కల్ మండలంలో రాయితీ ట్రాక్టర్లు ఇద్దరికి కేటాయించగా అందులో ఒకరు జిల్లా పరిషత్ ప్రాధేశిక సభ్యుడు(జడ్పీటీసీ) కాగా, ఇంకొకరు మాజీ సర్పంచ్(అధికార పార్టీ కార్యకర్త). * డిచ్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో మొత్తం రాయితీ ట్రాక్టర్లు 8 మందికి కేటాయించగా అందులో ఏడుగురు అధికార పార్టీ కార్యకర్తలే ఉండటం గమనార్హం. లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తేనే స్పందించారు... జిల్లా సహరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాయితీ ట్రాక్టర్లపై సమాచార హక్కు చట్టం కింద వేదిక ప్రతినిధులు సహదరఖాస్తు చేయగా జిల్లా వ్యవసాయ కార్యాలయ అధికారులు సమాచారం ఇవ్వలేదు. మొదట అప్పీల్ చేసినా స్పందన లేకపోవడంతో సమాచార కమిషన్, లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త జిల్లా వ్యవసాయ అధికారికి, అప్పటి కలెక్టర్కు నోటీసులు పంపింది. నోటీసులు అందుకున్న సంయుక్త వ్యవసాయ సంచాలకులు సహరక్షణ వేదిక ప్రతినిధులకు సమాచారం అందించారు. -
సార్ల దయ ఉంటేనే ‘యంత్రలక్ష్మి’
- లబ్ధిదారుల ఎంపికలో లోపించిన పారదర్శకత - ఫోర్వీల్ డ్రైవ్ ట్రాక్టర్ కేటాయింపులో పైరవీలు - నామమాత్రంగా వ్యవహరించిన జిల్లా సెలక్షన్ కమిటీ - అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నదాతలు నిజామాబాద్అర్బన్/మోర్తాడ్: ‘యంత్రలక్ష్మి’ పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేయడంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సూచించిన వారికే వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేజ్వీల్స్ అవసరం లేకుండా పంట పొలాలను దున్నడానికి ఫోర్వీల్ ట్రాక్టర్లను ఆయా కంపెనీలు తయారు చేశాయి. వీటితో రహదారులు దెబ్బతినే అవకాశం ఉండదు. అందుకే వీటిని రైతుల కు ‘యంత్రలక్ష్మి’ పథకం కింద 50 శాతం సబ్సిడీతో అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని రైతాంగానికి 179 ఫో ర్వీల్ ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారు. వీటి ధర రూ. ఎనిమిది లక్షల నుంచి రూ. తొమ్మిది లక్షల వరకు ఉంది. ట్రాక్టర్ ధరలో రైతు సగం చెల్లిస్తే మిగిలిన మొత్తం ప్రభుత్వం సబ్సిడీ రూ పంలో అందిస్తుంది. ‘అధికార’ అండదండలున్నవారికే ఫోర్వీల్ ట్రాక్టర్ యూనిట్లను పొందడానికి దాదాపు 670 మం ది రైతులు మండల వ్యవసాయూధికారి కార్యాలయూలలో దరఖాస్తు చేసుకున్నారు. 18 మందికి ప్రోసీడింగులు అందించారు. ఇందులో అనర్హులు ఉండడం గమనార్హం. రైతులు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి జేడీఏ కార్యాలయానికి పం పించారు. వాటిని జిల్లా సెలక్షన్ కమిటీ పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులు సూచించినవారిని సెలక్ష న్ కమిటీ ఎంపిక చేసిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఫోర్వీల్ ట్రాక్టర్ యూనిట్ల కేటాయింపు పారదర్శకంగా జరుగలేదని అధికార పార్టీ అండదండలు ఉన్న వారికే యూనిట్లను కేటాయించారని చెబుతున్నారు. పారదర్శకంగా ఎంపిక జరిగి ఉంటే అర్హులకు ట్రాక్టర్ యూనిట్లు దక్కేవని అభిప్రాయం వ్య క్తం చేస్తున్నారు. ఫోర్ వీల్ ట్రాక్టర్ల యూనిట్ల కేటాయింపు విషయూన్ని ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స ర్వసభ్య సమావేశంలో ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు ప్రశ్నించారు. అధికార పార్టీకి సంబంధించినవారికే ట్రాక్టర్ యూనిట్లను కేటాయించారని వివరించారు. అపుడు వ్యవసాయశాఖ మంతి పోచారం శ్రీనివాస్రె డ్డి స్పందించి భవిష్యత్తులో అర్హులైన అందరికి ట్రాక్టర్ యూనిట్లను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనర్హులే లబ్ధిదారులు ప్రజాప్రతినిధులు సైతం తాము చెప్పిందే వేదంగా సాగాలంటున్నారు. ఆయా నియోజకవర్గాలలో సబ్సిడీ యంత్రాలకు అర్హుల ఎంపికలో తాము సిఫార్సు చేసిన వారినే అర్హులుగా గుర్తించాలని అధికారులకు ఆదేశిస్తున్నారు. దీంతో ‘యంత్రలక్ష్మి’ అర్హుల జాబితా సిఫార్సు జాబితాగా మారింది. సరైన రైతులకు ట్రాక్టర్లు అందక ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. మొదటి దశలో 150 ట్రాక్టర్లను అందించాల్సి ఉంది. రెంజల్ మండలంలో ఓ వైద్యుడు యంత్రలక్ష్మిలో భాగంగా ట్రాక్టర్ను పొందాడు. స్వయంగా జిల్లా పరిషత్ సమావేశంలో సంబంధిత ఎంపీపీ కూడా ఈ విషయంలో వెలుగులోకి తీసుకవచ్చారు. రాజకీయ పార్టీ నాయకు లు, ప్రజాప్రతినిధులు ,వైద్యులు, వ్యాపారస్తులు ఇతరుల పం టలను, తప్పుడు పత్రాలు చూపించి 50 శాతం సబ్సిడీపైన ట్రాక్టర్లను పొందారు. మోర్తాడ్ మండలంలో యంత్రలక్ష్మిలో భాగంగా ట్రా క్టర్ల కోసం 26 దరఖాస్తులు వచ్చాయి. కానీ, జేడీఏ కార్యాలయానికి జాబితా రాగానే కేవలం ఏడుగురు మా త్రమే ఉన్నారు. మిగితవారిని మండల కేంద్రంలోనే తొలగిం చారు. ఇందులో ఉన్నవారు సైతం ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారేనని తెలిసింది. మోర్తాడ్ ఎంపీపీ దరఖాస్తు చేయించిన పేర్లు సైతం మాయమయ్యాయి. విచారణ జరపాలి ధర్పల్లి మండలంలో ఇద్దరు వ్యాపారస్తులు ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వీరు ఇతర రైతులకు వాటిని అద్దెకు ఇవ్వడం గమనార్హం. నిజామాబాద్ మండల కేంద్రం లో యంత్రలక్ష్మికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఓ ప్రజాప్రతినిధి వద్దే కొనసాగింది. స్వయంగా ఆయనే పరిశీలించి ఇచ్చిన దరఖాస్తులను ఎంపిక చేశారు. నిజాం సాగర్ మండలంలో అసలు వ్యవసాయభూమి లేని వారు ట్రాక్టర్లను పొందారు. మండల స్థాయిలో ట్రాక్టర్లు పొందినవారిలో స్థానిక నేతలూ ఉన్నారు. అధికారులు చె ప్పిన దానిని ఏమాత్రం పట్టించుకోకుండా, తాము చెప్పిన వారికే ఇవ్వాలంటూ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చారని సమాచారం. ఉన్నతాధికారులు విచారణ చేపడితే అర్హులకు న్యాయం జరిగే అవకాశం ఉంది.