breaking news
workless
-
పరిశ్రమలు కుదేల్: ఇం‘డల్’స్ట్రియల్
పటాన్చెరులో ఉన్న ఓ పరిశ్రమ బయోమాస్క్ బ్రికెట్ (బొగ్గుకు ప్రత్యామ్నాయం) తయారు చేసి టైల్స్ ఉత్పత్తి చేసే ఓ భారీ పరిశ్రమ (కొత్తూరు)కు సరఫరా చేస్తోంది. ఈ టైల్స్ ఎక్కువగా ఉత్తర భారత దేశానికి రవాణా అవుతాయి. ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ కారణంగా నిర్మాణ రంగం కుదేలవడంతో టైల్స్ పరిశ్రమకు ఆర్డర్లు తగ్గాయి. దీంతో ఈ టైల్స్ పరిశ్రమ పటాన్చెరులోని బ్రికెట్ల ఆర్డర్లను తగ్గించింది. చేసేదేమీ లేక పటాన్చెరులోని బ్రికెట్ పరిశ్రమ ఉత్పత్తిని దాదాపు సగానికి తగ్గించింది. ఈ పరిశ్రమలో పనిచేసే సుమారు 200 మందిలో 80 నుంచి 100 మంది కారి్మకులకు పనిలేకుండా పోయింది. ఈ పరిస్థితి ఒక్క పటాన్చెరులోని బయోమాస్క్ బ్రికెట్ ఫ్యాక్టరీదే కాదు.. జిల్లాలోని పాశమైలారం, బొల్లారం, గడ్డపోతారం, బొంతపల్లి, హత్నూర, సంగారెడ్డి, జహీరాబాద్ వంటి ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడల్లోని అనేక పరిశ్రమల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఫార్మా సంబంధిత కేటగిరీలకు చెందిన పరిశ్రమలను మినహాయించి మిగిలిన అన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమలపైనా లాక్డౌన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. సరైన ఆర్డర్లు లేక ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది. పారిశ్రామిక ప్రగతి చక్రం ఆగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు అన్ని రకాల పరిశ్రమల కార్యకలాపాలను లాక్డౌన్ నిబంధనలకు మినహాయింపు ఇచి్చంది. మాస్క్లు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటిస్తూనే ఉత్పత్తిని కొనసాగించుకోవచ్చని మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ రాష్ట్రంలో ఇతర వ్యాపార, వాణిజ్య రంగాలపై ఉన్న లాక్డౌన్తో పాటు, ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావంతో పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గుతోంది. దీని ప్రభావం పారిశ్రామిక రంగంలోని కార్మికులపై పడుతోంది. కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి దెబ్బ లాక్డౌన్ కారణంగా పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గడంతో కారి్మకుల ఉపాధిపై దెబ్బ పడుతోంది. అనేక పరిశ్రమలు కాంట్రాక్ట్ కారి్మకులు, రోజువారీ వేతనాలపై పనిచేసే కారి్మకులకు పని ఇవ్వడం లేదు. కేవలం పరి్మనెంట్ కారి్మకులకు మాత్రమే పని కల్పిస్తున్నాయని కారి్మక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పరి్మనెంట్ కారి్మకుల్లో కూడా కొందరిని సెలవులపై వెళ్లాలని యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని చెబుతున్నారు. దీంతో రోజువారీ వేతనాలు, కాంట్రాక్ట్ కారి్మకులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఒడిశా, బిహార్, ఉత్తరప్రదేశ్, జార్కండ్ వంటి రాష్ట్రాల నుంచి వచి్చన వలస కూలీలు చాలామంది నెల రోజుల క్రితం నుంచి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. స్థానిక కారి్మకులు పని దొరక్క, చేతిలో చిల్లిగవ్వ లేక పడరాని పాట్లు పడుతున్నారు. ఫార్మా పరిశ్రమల్లో నిరాటంకంగా ఉత్పత్తి కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రకాల మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కోవిడ్–19కు చికిత్స అందించే మందుల కొరత ఏర్పడింది. దీంతో జిల్లాలోని ఫార్మా కంపెనీలు ఉత్పత్తి నిరాటంకంగా కొసాగిస్తున్నాయి. సాధారణ రోజుల్లో కంటే ఎక్కువే ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు మూడు షిఫ్టులతో పరిశ్రమల్లో ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఫార్మా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు కూడా కరోనా సోకుతుండటంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతోందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. కారి్మకులను ఆదుకోవాలి లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి. నిత్యావసరాలతో పాటు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలి. యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించాలి. కరోనా బారిన పడిన కారి్మకులకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలి. వ్యాక్సినేషన్ చేయించడంతో పాటు ఇంట్లో ఉండలేని బాధితులకు హోం ఐసోలేషన్ సౌకర్యం కల్పించాలి. - కొల్కూరి నర్సింహారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఆర్డర్లు తగ్గాయి.. లాక్డౌన్ నిబంధనలతో పరిశ్రమల్లో ఉత్పత్తిని కొనసాగించేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా ఆయా రంగాల ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయింది. ముఖ్యంగా నిర్మాణ, ఆటోమొబైల్ వంటి రంగాల నుంచి ఆర్డర్లు తగ్గాయి. దీంతో సంబంధిత పరిశ్రమలు ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వస్తోంది. - కాల రమేశ్ ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ (ఐలా) చైర్మన్ -
పనిలేని పోటుగాళ్లు
హైదరాబాద్: బతకాలంటే ఏదో ఒక పని చేయాలి. కుటుంబాన్ని పోషించాలంటే చిన్న ఉద్యోగమైనా ఉండాలి. పని కోసం వివిధ ప్రాంతాలవారు మహానగరానికి వలస బాట పడుతుంటే.. ఇక్కడ ఉన్నవారు మాత్రం పనీపాటా లేకుండా గడిపేస్తున్నారు. ‘పని’ చూపిస్తామని దేశవిదేశాలకు చెందిన కంపెనీలు వస్తుంటే.. వీటితో తమకేంటన్నట్టు కాలం గడిపేస్తున్నారు. ఇలాంటి వారు నగరంలో లక్షన్నర మందికి పైగా ఉన్నారంటే అశ్చర్యం కలుగుతుంది. ఎలాంటి పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్న వారిలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఇందులో చదువుకున్న వారే అధికం. ఈ లెక్కలు కేంద్రం ఆధీనంలోని జనాభా గణాంక శాఖ తేల్చినవే. సిటీలో ఉన్న బిచ్చగాళ్లలో డిగ్రీ, టెక్నికల్ డిప్లొమో, పీజీ చదువుకున్నవారు సైతం ఉన్నారట. నాన్-వర్కర్స్ 25 లక్షల మంది కేంద్ర జనాభా లెక్కల విభాగం 2011లో జనాభాను లెక్కించడంతో పాటు ఆర్థిక, సామాజిక కోణాల్లోనూ సమాచారం సేకరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి వాటి క్రోడీకరణ, విశ్లేషణ, అధ్యయనం చేసింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ‘ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్’ గత నెలలో అదనపు వివరాలను విడుదల చేసింది. హైదరాబాద్కు సంబంధించి ఇందులోని అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. రాష్ట్రాలతో పాటు నగరాలు, పట్టణాల వారీగా గణాంకాలను పొందుపరిచింది. సమాచారం సేకరించే నాటికి ఏపనీ చేయకుండా ఉన్నవారిని ‘నాన్-వర్కర్స్’ కేటగిరీలో చేర్చింది. సిటీకి సంబంధించి ఈ కేటగిరిలో ఉన్నవారు 25,30,026 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 9,72,990, స్త్రీలు 15,57,036 మంది ఉన్నారు. ‘అవన్నీ’ తీసేసిన తరవాత.. సిటీలో ఖాళీగా ఉన్న వారిని ఏడు కేటగిరీ కింద విభజించారు. విద్యార్థులు, గృహావసరాలకు పరిమితమైన వారు, వైకల్యం సహా అనేక కారణాల నేపథ్యంలో కుటుంబీకులపై ఆధారపడిన వారు, పదవీ విరమణ చేసినవారు, పెన్షనర్లను మినహాయించారు. విద్యార్థి దశకు చేరుకోకుండా తల్లి ఒడికి, ఇంటికి పరిమితమైన పసివారిని ‘ఖాళీ’ కేటగిరిలోకి చేర్చకుండా ‘డిపెండెంట్స్’గా విశ్లేషించారు. మిగిలిన 1,66,255 మందీ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారని లెక్క తేలింది. ఇలాంటి వారిలో స్త్రీల కంటే పురుషులే అధికంగా ఉన్నారని ‘సెన్సస్’ స్పష్టం చేసింది. స్త్రీల సంఖ్య 44 వేలుగా ఉండగా.. ‘మగ మహారాజులు’ దీనికి మూడు రెట్లతో ఏకంగా 1.2 లక్షల మందికి పైగా రికార్డులకెక్కారు. ‘అక్షరం’ నేర్చినా అక్కరకు రాకుండా.. విద్యావకాశాలు లేకో, విద్యార్హతలు సాధించలేకో ఖాళీగా ఉండిపోయారనుకుంటే పొరపాటే. ‘పనీపాటా’ లేని వారిలో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఖాళీగా ఉంటున్న నగరవాసుల్లో టెన్త్, ఆలోపు చదివిన వారి కంటే.. ఎస్సెస్సీ పూర్తయి, డిగ్రీ లోపు చదివిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. డిగ్రీ ఆపై విద్యార్హతలు గలవారూ సిటీలో ఖాళీగానే ఉన్నారని గణాంకాలు తేల్చాయి. అక్షరాస్యులై ఉండీ, ఏ పనీ చేయకుండా ఉన్న వారిలో పురుషులు 97,797 మంది ఉండగా, స్త్రీలు 33,651 మంది ఉన్నారు. సిటీలో క్యాలిఫైడ్ బెగ్గర్స్.. సెన్సస్ డిపార్ట్మెంట్ నాన్-వర్కర్స్ కేటగిరీలో బిచ్చగాళ్లనూ చేర్చింది. వారికి సంబంధించిన అనేక అంశాలను సేకరించింది. వీటి ప్రకారం నగరంలో బిచ్చగాళ్ల సంఖ్య 1506గా తేల్చింది. ఇందులో స్త్రీల కంటే పురుషులే అధికమని లెక్కకట్టింది. చదువు లేని కారణంగా ఇతర పనులు చేసుకోలేక ఈ బాట పట్టినవారితో పాటు ‘క్వాలిఫైడ్ బెగ్గర్స్’ సైతం హైదరాబాద్లో ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలోని బిచ్చగాళ్లలో నిరక్షరాస్యులు 583 మంది ఉండగా, అక్షరాస్యులు 932 మంది ఉన్నట్టు నిర్ధారించింది. డిగ్రీ ఆపై చదివిన వారు 46 మంది ఉన్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన వీరు ‘చేతులు చాస్తున్నార’ని తెలుస్తోంది. డిగ్రీ, సాంకేతిక విద్య అభ్యసించిన వారు ఇద్దరు ఉండగా, డిగ్రీ కంటే ఎక్కువ చదివిన వారు 44 మంది ఉన్నట్లు గణాంకాల్లో స్పష్టం చేసింది. అవకాశాలు కల్పించాలి.. నగరంలో ఉన్న అన్ని వర్గాల వారికీ, వారికున్న అర్హతలు, ఆసక్తుల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఏదో ఒక పని చేయాలనే అవగాహన అందరిలోనూ కల్పించాలి. బిచ్చగాళ్ల విషయానికి వస్తే... ఆదాయం ఎక్కువ, పన్ను ఉండదు అనే ఉద్దేశంతో కొందరు ఈ బాట పడుతున్నారు. వీరి నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలి. బిక్షాటన చేస్తున్నవారికి వృత్తివిద్యల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా పరిస్థితి మార్చవచ్చు. - వివేక్ నర్సింహం, చార్టెడ్ అకౌంటెంట్