రాజ్నాథ్ను కలిసిన రాష్ట్ర నేతలు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెస్ బలహీనపడటం, టీడీపీకి విశ్వసనీయత లేకపోవడం తమకు కలిసివస్తుందని భావిస్తున్న బీజేపీ నేతలు ఆయా పార్టీల నాయకుల్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కూడా పలువురు ఆసక్తి చూపుతున్నారు. సుదీర్ఘకాలం టీడీపీలో ఉండి ఆ తర్వాత తప్పుకున్న బోడ జనార్దన్, వాసంశెట్టి సత్య, తదితరులు మంగళవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్సింగ్తో భేటీ అయ్యారు.
ఇది బీజేపీలోకి భవిష్యత్లో వలసలకు సంకేతంగా కని పిస్తోంది. సీమాంధ్రకు చెందిన ఓ సామాజికవర్గం నేతలూ పార్టీ కేంద్రనాయకుల్ని కలిశారు. కొందరు సీమాంధ్ర నేతలు బుధవారం పార్టీ నేత వెంకయ్యనాయుడినీ కలవనున్నారు. టీడీపీలో కీలకంగా ఉన్న ఓ సామాజికవర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో ఒంటరి పోరే: కిషన్రెడ్డి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలకూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్రెడ్డి పునరుద్ఘాటించారు. టీడీపీతో పొత్తేమీ లేదని స్పష్టంచేశారు. పార్టీ నుంచి వలసలను ఆపడానికే టీడీపీ పొత్తుల ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఢిల్లీలో మంగళవారం ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇవ్వడంతోపాటు సీమాం ధ్రుల సమస్యలనూ పరిష్కరించాలన్నారు.