breaking news
ukg students
-
వీపు వాతలు తేలేలా.. యూకేజీ పిల్లాడిపై టీచర్ కర్కశత్వం!
సాక్షి, కందుకూరు: చేతి రాత బాగా లేదని ఐదేళ్ల చిన్నారిని చితకబాదిందొక టీచర్. టీచర్ కొట్టిందని బిడ్డ చెప్పడంతో ఆవేదన చెందిన చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ చైతన్య స్కూల్లో చోటుచేసుకున్న ఈ ఘటన మంగళవారం వెలుగుచూసింది. కందుకూరు మండలం ఆనందపురం గ్రామానికి చెందిన తల్లపనేని మాధవరావు కుమారుడు మనోభిరామ్ కందుకూరులోని శ్రీచైతన్య స్కూలు క్యాంపస్-2లో యూకేజీ చదువుతున్నాడు. సోమవారం స్కూలుకు వెళ్లగా రైటింగ్ బాగా లేదంటూ అభిరామ్ను క్లాస్ టీచర్ స్వర్ణ బెత్తంతో తీవ్రంగా కొట్టింది. వీపు వాతలు తేలేలా కర్కశత్వం ప్రదర్శించింది. ఇంటికి వెళ్లిన మనోభిరామ్కు స్నానం చేయిస్తున్న సమయంలో వీపంతా వాతలు ఉండడాన్ని తల్లి గమనించింది. ఎలా జరిగిందని అడగగా స్కూల్లో టీచర్ కొట్టిందని చెప్పాడు. టీచర్ ప్రవర్తనపై ఽచిన్నారి తండ్రి మాధవరావు మంగళవారం ఉదయాన్నే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఇన్చార్జి ఎస్సై ప్రభాకర్ దర్యాప్తు చేస్తున్నారు. -
పండుగ పప్పలు తిని విద్యార్థులకు అస్వస్థత
కోటపల్లి : పాడైపోయిన తినుబండారాలు తినడంతో 13 మంది చిన్నపిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కోటపల్లిలోని ఉషోదయ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. పాఠశాలలో యూకేజీ చదువుతున్న ఓ బాలిక తన స్నేహితుల కోసం ఉగాది పండుగ సందర్భంగా ఇంట్లో చేసిన తినుబండారాలను మంగళవారం పాఠశాలకు తీసుకుని వచ్చింది. భోజన విరామంలో వాటిని తిన్న13 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే వారిని చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా అనారోగ్యానికి గురైన పిల్లలందరూ ఐదేళ్లలోపు చిన్నారులే కావడంతో వారి తల్లిదండ్రులు.. పిల్లలకు ఏమవుతుందోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి చక్కబడటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నట్లయ్యింది.