breaking news
Traffic Details
-
అక్కడ ట్రాఫిక్ జామ్... ఇలా వెళ్లండి !
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రధాన రహదారిలోని ఓ ప్రాంతంలో ధర్నా, మరో రోడ్డులో యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ విషయం సీసీ కెమెరాలు, హైరైజ్ కెమెరాలు, డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ పోలీసులకు తెలుస్తుంది. కానీ ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వాహన చోదకులకు తెలియదు. దీంతో వారు ఆ ట్రాఫిక్లో చిక్కుకుంటున్నారు. అలా కాకుండా ముందే ఆ విషయం తెలిస్తే..మరో ప్రత్యామ్నాయ మార్గంలో వెళతారు. హైదరాబాద్ పోలీసులు–గూగుల్ ఇండియా ప్రతినిధులు కసరత్తు చేశారు. కొన్ని మార్గాల్లో ప్రయోగాత్మకంగా కూడా అమలు చేశారు. త్వరలో హైదరాబాద్ అంతా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. జంక్షన్లో మూడు, నాలుగు రోడ్లు సాధారణంగా ప్రతి ట్రాఫిక్ జంక్షన్లోనూ మూడు, నాలుగు రోడ్లు ఉంటాయి. ఒక్కో రోడ్డుకు నిర్ణీత సమయం గ్రీన్ లైట్, రెడ్ లైట్ వెలుగుతూ ‘సిగ్నల్స్ సైకిల్’నడుస్తుంది. అన్ని రోడ్లలోనూ, అన్ని వేళల్లో వాహనాల రద్దీ ఒకేలా ఉండదు. అయినా ట్రాఫిక్ సిగ్నల్స్ సైకిల్లో మార్పు ఉండదు. అలా ఉండాలంటే వాటిని క్షేత్రస్థాయి సిబ్బంది మాన్యువల్గా ఆపరేట్ చేయాలి. ఇలాంటి అనేక సమస్యలకు గూగుల్ సంస్థ పరిష్కారం చూపనుంది. హైదరాబాద్ పోలీసులు–గూగుల్ ఇండియా ప్రతినిధులు కొన్ని జంక్షన్లు, రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న విధానం త్వరలోనే నగరవ్యాప్తంగా అమలు కానున్నట్టు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శుక్రవారం ప్రకటించారు. ఐటీఎంఎస్ సహకారంతో సిగ్నలింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసంధానించి ఉండే సర్వర్కు ఏ జంక్షన్లోని.. ఏ రహదారిలో ఎంత ట్రాఫిక్ ఉంది అనేది సాంకేతికంగా తెలుస్తుంది. దీనికోసం ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టంలో (ఐటీఎంఎస్) అడాఫ్టివ్ ట్రాఫిక్ కంట్రోలింగ్ సిస్టం (ఏటీసీఎస్) విధానం అమలవుతుంది. ఈ విధానంలో ఓ మార్గంలో ఉన్న నాలుగైదు జంక్షన్లు అనుసంధానం అవుతాయి. ఆయా చౌరస్తాల్లో ఎటు నుంచి ఎంత ట్రాఫిక్ వస్తుందనేది లెక్కించడానికి అవసరమైన పరిజ్ఞానం ట్రాఫిక్ కెమెరాల్లో ఉంటుంది. ఇవన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానించి ఉంటాయి. అక్కడి సర్వర్లో ఉండే సాఫ్ట్వేర్ ఈ వాహనాల సంఖ్య ఆధారంగా ఏఏ మార్గాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఆ రూట్లకు ఎక్కువ సేపు గ్రీన్లైట్ పడేలా చేస్తుంది. అయితే గరిష్టంగా 100 సెకన్లు మాత్రమే ఇది ఉంటుంది. ఆపై రొటేషన్పై సిగ్నల్ సైకిల్ మొదలవుతుంది.మ్యాప్స్ ద్వారానే అలర్ట్స్ కూడా...ఇప్పటికే గూగుల్ మ్యాప్స్లో ఆయా మార్గాల్లో ఉన్న రద్దీ కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉన్న సెల్ఫోన్ల ద్వారా ఈ రద్దీని గూగుల్ సంస్థ గుర్తిస్తోంది. ట్రాఫిక్ పోలీసుల డేటాతో గూగుల్ సర్వర్ అనుసంధానం చేస్తున్నారు. ఇలా నగరంలోని వివిధ మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీ వివరాలు గూగుల్కు చేరతాయి. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయినా, రోడ్డు ప్రమాదం జరిగినా, నిరసన కార్యక్రమం ఉన్నా కూడా తెలుస్తాయి. ఈ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే గూగుల్ సర్వర్ మ్యాప్స్కు అనుసంధానం చేస్తుంది. తద్వారా ఆయా మార్గాల్లో ప్రయాణిస్తున్న వాహనచోదకులను గుర్తించడంతోపాటు ట్రాఫిక్ జామ్పై అలర్ట్ ఇస్తుంది. దాదాç³# రెండుమూడు కిలోమీటర్ల ముందే ఈ సమాచారం ఇవ్వడంతో పాటు ప్రత్యామ్నాయ మార్గాన్నీ సూచిస్తుంది. ఈ విధానం అమలులోకి వస్తే సిగ్నల్స్ అన్నీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని (సీసీసీ) సర్వర్ ఆధారంగా పనిచేస్తాయి. కేవలం అవసరమైనప్పుడు మాత్రమే జంక్షన్లను మాన్యువల్గా ఆపరేట్ చేస్తారు. -
పుష్కర వేళ.. ఇలా వెళ్దాం
బృహత్తర కార్యక్రమానికి మరో రోజులో తొలి అడుగు పడనుంది. మన రాష్ట్రమే కాదు.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు.. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి కోట్లాదిమంది భక్తులు కృష్ణమ్మ పుష్కర స్నానమాచరించి పునీతమవ్వాలని ఇప్పటికే బయల్దేరి ఉంటారు. కానీ, విజయవాడ నగరంలో ఇంకా జరుగుతున్న పుష్కరాలు, పలు అభివృద్ధి పనుల నేపథ్యంలో కొంతమేర రూట్మ్యాప్లో గజిబిజికి గురయ్యే అవకాశం ఉంది. ఇలాంటి వారి కోసం.. వాహనాలు ఎక్కడ దిగాలి? ఘాట్కు ఎలా చేరుకోవాలి? వంటి వివరాలతో ప్రత్యేక కథనం. శాటిలైట్ బస్స్టేషన్లు : 6 – ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం – వైవీరావు ఎస్టేట్ – జాకీర్ హుస్సేన్ కళాశాల (ఇబ్రహీంపట్నం) – వీటీపీఎస్ ఏ కాలనీ గ్రౌండ్ – కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల – పెదకాకాని శాటిలైట్ రైల్వేస్టేషన్లు : 4 – రాయనపాడు – గుణదల – మధురానగర్ – కృష్ణా కెనాల్ శాటిలైట్ బస్, రైల్వేస్టేషన్ల వద్ద పుష్కర నగర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సకల సౌకర్యాలూ ఉంటాయి. అక్కడి నుంచి ఘాట్ల వద్దకు ఉచిత ఆర్టీసీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. పార్కింగ్ ప్రదేశాలు : 121 ఉచిత బస్సులు : 740 గుంటూరు వైపు నుంచి.. – అమరావతి, ధ్యానబుద్ధ ఘాట్ : గుంటూరు నగరం.. ఆ చుట్టుపక్కల నుంచి వచ్చే యాత్రికులు అమరావతి ఘాట్కు చేరుకోవచ్చు. ఇక్కడే ధ్యానబుద్ధ ఘాట్ కూడా ఉంది. గుంటూరు నుంచి నేరుగా అమరావతిలోని గుంటూరు రోడ్డు లేదా విజయవాడ రోడ్డు లేదా సత్తెనపల్లి రోడ్డులో ఏర్పాటుచేసిన పుష్కర నగర్కు చేరుకోవచ్చు. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఏర్పాటుచేసిన బస్సుల్లో ఘాట్ల వద్దకు చేరుకోవచ్చు. సుమారు 1.5 కిలోమీటరు దూరంలో ఉండే ఈ ఘాట్లకు నడుచుకుని అయినా వెళ్లవచ్చు. – సీతానగరం ఘాట్ : గుంటూరు నగరం.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చెన్నై నుంచి వచ్చేవారు ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న సీతానగరం ఘాట్కు చేరుకోవచ్చు. ఇక్కడ 8 పుష్కరనగర్లు ఏర్పాటు చేశారు. పాత జాతీయరహదారిలో 3, జాతీయ రహదారిపై 3, కృష్ణా కెనాల్ జంక్షన్ వద్ద ఒకటి, మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రి వద్ద ఒకటి పుష్కర ఘాట్ను సిద్ధం చేశారు. ప్రైవేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ ఉచిత బస్సుల్లో ఉండవల్లి సెంటర్ చేరుకోవాలి. అక్కడి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న పుష్కర ఘాట్కు నడిచే వెళ్లాలి. హైదరాబాద్ నుంచి.. ముక్త్యాల ఘాట్ : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు ముక్త్యాల భవానీ ఘాట్కు వెళ్లాలంటే 65వ నంబర్ జాతీయ రహదారిలోని షేర్మహ్మద్పేట అడ్డరోడ్డు నుంచి 13 కిలోమీటర్ల దూరంలోని ముక్త్యాల భవానీ ఘాట్కు వెళ్లాలి. వెళ్లే దారిలో సీమ పందుల పెంపక కేంద్రం సమీపంలో పుష్కర నగర్ ఏర్పాటు చేశారు. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఘాట్కు చేరుకోవచ్చు. వేదాద్రి ఘాట్ : వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి ఘాట్కు వెళ్లాలంటే చిల్లకల్లు నుంచి 12 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. గౌరవరం నుంచి వేదాద్రి 10 కిలోమీటర్లు. 65వ నంబర్ జాతీయ రహదారి కొణకంచి అడ్డరోడ్డు నుంచి 13 కిలోమీటర్లు వెళ్లాలి. భక్తులు సులభంగా తెలుసుకునేందుకు ప్రధాన సెంటర్లలో రూట్ మ్యాప్లను ఏర్పాటు చేశారు. పవిత్ర సంగమం ఘాట్ : కృష్ణా, గోదావరి నదులు కలిసే చోటు పవిత్ర సంగమం ఘాట్. పుష్కరాలకు హైదరాబాద్.. ఆపై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఎక్కువగా స్నానాలు చేసే అవకాశం ఉంది. ఈ ఘాట్ వద్ద స్నానాలు చేయాలనుకునే భక్తులు ప్రయివేట్ వాహనాల్లో వస్తే ఇబ్రహీంపట్నంలోని ట్రక్ టెర్మినల్ దగ్గర ఆగాల్సి ఉంటుంది. అక్కడే పుష్కర నగర్ ఉంటుంది. ప్రయివేట్ వాహనాలను అక్కడి వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ఘాట్ మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చే హైదరాబాద్.. ఆపై ప్రాంతాల భక్తులు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలో జాకీర్ హుస్సేన్ కాలేజీ వరకూ చేరుకోవాలి. అక్కడే పుష్కర నగర్ ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఘాట్కు ఆర్టీసీ ఉచిత సర్వీసుల్లో చేరుకోవచ్చు. ఇక మైలవరం, భద్రచలం కొండపల్లి నుంచి వచ్చే వాహనాలు వీటీపీఎస్ ప్లే గ్రౌండ్లో ఏర్పాటుచేసిన పుష్కర నగర్ వద్ద ఆగాల్సి ఉంటుంది. భవానీ, పున్నమి ఘాట్లు : హైదరాబాద్.. ఆపై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భవానీ, పున్నమి ఘాట్లలో పుష్కర స్నానం చేయాలనుకుంటే.. ప్రయివేట్ వాహనమైనా, ఆర్టీసీ బస్సు అయినా భవానీపురం దర్గా వద్ద ఏర్పాటుచేసిన పుష్కర నగర్ వద్ద ఆగాలి. అక్కడి నుంచి నడుచుకుని ఈ రెండు ఘాట్లకూ చేరుకోవచ్చు. దుర్గాఘాట్ : బెజవాడ దుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రికి సమీపంలో ఉన్న దుర్గాఘాట్లో పుణ్యస్నానం చేయాలనుకునే దూరప్రాంతపు భక్తులు భవానీపురం దర్గా వద్ద అయినా దిగవచ్చు. లేదంటే విజయవాడలోని వైఎస్సార్ కాలనీ సమీపంలోని వైవీ రావు ఎస్టేట్ వద్ద ఏర్పాటుచేసిన పుష్కర నగర్లో దిగవచ్చు. అక్కడి నుంచి దుర్గాఘాట్తో పాటు భవానీ, పున్నమి ఘాట్కు ఉచిత బస్సులు నడుస్తాయి. హంసలదీవి కృష్ణా సాగర సంగమం : హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు నుంచి వచ్చేవారు హంసలదీవిలోని కృష్ణా సాగర సంగమ ప్రాంతంలో పుణ్యస్నానం చేయాలనుకుంటే.. ఆర్టీసీ బస్సులను ఆశ్రయించవచ్చు. విజయవాడ నుంచి అవనిగడ్డకు నిత్యం బస్సులు తిరుగుతూనే ఉంటాయి. అవనిగడ్డ నుంచి కోడూరు.. ఉల్లిపాలెం మీదుగా హంసలదీవి రావాలి. అక్కడి నుంచి సముద్రతీరంలో డాల్ఫిన్ భవనం వద్ద పుష్కర నగర్ ఉంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని కృష్ణా సాగర సంగమ ప్రాంతానికి చేరుకోవచ్చు. ప్రయివేట్ వాహనాలైతే కోడూరు నుంచి దింటిమెరక గ్రామం.. పాలకాయతిప్ప నుంచి సముద్రం తీరంలోని పుష్కర నగర్కు చేరుకోవచ్చు. భారీ వాహనాల మళ్లింపు ఇలా.. – విజయవాడ నుంచి రోజూ విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై వెళ్లే భారీ వాహనాల కోసం పుష్కరాల 12 రోజులూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను కంచికచర్ల, ఇబ్రహీంపట్నం నుంచి మళ్లిస్తారు. కంచికచర్ల మీదుగా జుజ్జూరు, జమలాపురం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదుగా విశాఖ చేరుకోవచ్చు. ఇబ్రహీంపట్నం మీదుగా కొండపల్లి, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్కు చేరవేస్తారు. – విశాఖ నుంచి చెన్నై, హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను హనుమాన్ జంక్షన్ నుంచి రూటు మారుస్తారు. 740 ఆర్టీసీ ఉచిత సర్వీసులు కృష్ణా పుష్కరాలకు విజయవాడలో 740 ఉచిత సిటీ బస్సులు నడుపుతున్నారు. శాటిలైట్ బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లు, పుష్కర పార్కింగ్ ప్రాంతాల నుంచి ఉచిత బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి మూడు నిమిషాలకు ఒక ఉచిత బస్సు ఉంటుంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలోని శాటిలైట్ బస్స్టేషన్ వరకూ వస్తాయి. అక్కడి నుంచి నగరంలోని ఆరు ఘాట్లకు వెళ్లడానికి వీలుగా 100 ఉచిత బస్సుల్ని ఏర్పాటుచేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు వైవీ రావు ఎస్టేట్లోని శాటిలైట్ బస్స్టేషన్ వద్ద ఆగుతాయి. అక్కడి నుంచి ఘాట్లకు 65 బస్సులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులు ఇబ్రహీంపట్నంలోని జాకీర్ హుస్సేన్ గ్రౌండ్లో ఉన్న శాటిలైట్ బస్స్టేషన్లో ఆగుతాయి. అక్కడి నుంచి ఘాట్లకు 45 ఉచిత బస్సులు నడుస్తాయి. తిరువూరు, భద్రాచలం నుంచి వచ్చే బస్సులు వీటీపీఎస్ కాలనీలో శాటిలైట్ స్టేషన్లో ఆగుతాయి. అక్కడి నుంచి 10 ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని పుష్కర ఘాట్లకు మూడువేల బస్సులు నడుపుతున్నారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్స్టేషన్ సిటీ బస్స్టేషన్గా నడుస్తుంది. -
సాంకేతికతకు నిలువుటద్దం
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో క్రియేటివిటీకి కొదువే లేకుండా పోతోంది. నిన్న మొన్నటి తరం మాదిరి వాతావరణం, ట్రాఫిక్ వంటి విషయాలు తెలుసుకోవాలంటే రేడియోలో.. టీవీల వైపో చూసే రోజులు పోయాయి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్ల హవానే. ఇంకో అడుగు ముందుకు దూసుకుపోతే.. మనకు కావాల్సిన వివరాలను గోడకున్న అద్దంలో చూసుకోగలిగితే.. ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో కదా..! గూగుల్ సంస్థలో ఇంజనీర్ అయిన మాక్స్ బ్రాన్కు ఇలాంటి ఆలోచనే వచ్చింది. తన బాత్రూంలో ఉన్న అద్దాన్ని ‘స్మార్ట్’గా మార్చేశారు. ఈ అద్దానికి వెనుక వైపు టీవీ స్టిక్ అనే పరికరం, ఆకుపచ్చ ఎల్ఈడీ, పవర్ బటన్ను స్విచ్ బోర్డు ద్వారా అనుసంధానం చేశాడు. ఈ టీవీ స్టిక్లోని సాఫ్ట్వేర్ అద్దం ముందు వివరాలు కనిపించేలా చేస్తుంది. అయితే ట్రాఫిక్ వివరాలు, టచ్స్క్రీన్, వాయిస్ ద్వారా ఆపరేట్ చేయడం వంటి అదనపు హంగులు కూడా జోడించాలని యోచిస్తున్నట్లు మాక్స్ పేర్కొన్నాడు.