breaking news
thallada sai krishna
-
వరద బాధితులకు అండగా సినీ సెలబ్రిటీలు
కుండపోత వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో సెలబ్రిటీలు సైతం మేమున్నామంటూ తోచిన సాయం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ తమవంతు సాయం చేశారు.అలీ దంపతుల గొప్ప మనసుతాజాగా కమెడియన్ అలీ దంపతులు ఆంధ్రప్రదేశ్కు రూ.3 లక్షలు, తెలంగాణకు రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. యంగ్ డైరెక్టర్ తల్లాడ సాయికృష్ణ సైతం ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాకు కలిపి రూ.1.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. అతడి స్నేహితులతో కలిసి.. వరదల వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఆహారం, నిత్యావసర వస్తులను పంచుతూ మానవత్వం చాటుకున్నారు.అక్కినేని కుటుంబం సాయంమరోవైపు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటే అక్కినేని కుటుంబం తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చింది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చింది. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ సాయాన్ని అందజేశాయి. మరోవైపు రామ్చరణ్ సైతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు.. వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు ( Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి…— Ram Charan (@AlwaysRamCharan) September 4, 2024మెగా హీరో సాయిధరమ్ తేజ్.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ.10 లక్షలు విరాళమిచ్చాడు. అలాగే అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షలు సాయం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు.. అదే విధంగా విజయవాడ లో నేను మన మెగా అభిమానులు మరియు జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం మరియు ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు.…— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 4, 2024చదవండి: కోట్లు దానం చేసిన ప్రభాస్-బన్నీ -
Mystery Movie: ఫోరెన్సిక్ ఆఫీసర్గా ఆలీ
తల్లాడ సాయికృష్ణ హీరోగా స్వీయదర్శకత్వంలో టించిన చిత్రం మిస్టరీ. స్వప్న చౌదరి హీరోయిన్. అలీ, సుమన్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర కీలపాత్రల్లో నటించారు. పీవీ ఆర్ట్స్ పతాకంపై వెంకట్ పులగం నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఆలీ పోస్టర్ని విడుదల చేశారు. ఈ చిత్రం ఫోరెన్సిక్ ఆఫీసర్ సాయి పాత్రలో ఆలీ కనిపిస్తాడని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట్ పులగం మాట్లాడుతూ ‘దర్శకుడు సాయికృష్ణ గారు నాకు కథ చేపినపుడు చాలా కొత్తగా అనిపించింది, వెంటనే సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నాం. సినిమా చాలా బాగా వస్తుంది’ అని తెలిపారు. ‘మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కామెడీ చిత్రం. ఆలీ డిఫరెంట్గా ఉంటుంది. కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది’అని హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ అన్నారు.