breaking news
T Padma Rao Goud
-
BRS Party: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తమ అభర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను ఎంపీ అభ్యర్థిని ఖరారు చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ శనివారం పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు అభిప్రాయం మేరకు సికింద్రాబాద్ అభ్యర్థిగా పద్మారావు పేరును ఖరారు చేశారు. కాగా ఇప్పటి వరకు 14 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి, నల్గొండ, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చదవండి: Liquor Case: ఎమ్మెల్సీ కవితకు కస్టడీ పొడిగింపు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. నాగర్కర్నూల్ - ఆర్ఎస్ ప్రవీణ్కుమార్. మెదక్ - వెంకట్రామిరెడ్డి. మహబూబ్నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి కరీంనగర్- వినోద్ కుమార్. పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్. జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్ ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు. చేవెళ్ల - కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. మహబూబాబాద్- మాలోత్ కవిత. మల్కాజ్గిరి - రాగిడి లక్ష్మారెడ్డి ఆదిలాబాద్ - ఆత్రం సక్కు. నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్. వరంగల్ - కడియం కావ్య -
డిప్యూటీ స్పీకర్గా పద్మారావుగౌడ్ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సభాపతి ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు భట్టి విక్రమార్క తదితరులు పద్మారావుగౌడ్ను స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేం దర్, నిరంజన్రెడ్డి, ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, కొప్పుల ఈశ్వర్, సభ్యులు పద్మా దేవేందర్రెడ్డి, దానం నాగేందర్, కౌసర మోహినుద్దీన్, రాజాసింగ్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, సురేందర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్రెడ్డి మరణానికి సంతాపం తెలుపుతూ స్పీకర్ పోచారం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం కొద్దిసేపు సభ ఆయనకు నివాళులు అర్పించింది. గరీబీ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారు... పద్మారావుగౌడ్ హైదరాబాద్ కార్పొరేటర్గా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన గతంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. ఇందిరా గాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లో వివిధ కర్మాగారాలకు కార్మిక నాయకుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను డిప్యూటీ స్పీకర్గా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవం కాలేదు. అప్పుడు పోటీలో ఉండా ల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మేము సహకరించాం. నేను డిప్యూటీ స్పీకర్గా పనిచేశాను. ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఉప సభాపతిగా పనిచేసినా తర్వాత అనేక అవకాశాలు వస్తాయనడానికే ఇలా చెబుతున్నా. – మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేత నిబద్ధతతో పనిచేశారు... గత ప్రభుత్వ హయాంలో నిబద్ధతతో పని చేసి పదవులకు అలంకారం తీసుకొచ్చారు. అదే మాదిరిగా ఈ పదవికీ వన్నె తెస్తారనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. – కేటీఆర్ ఆప్యాయత ఆయన చిరునామా... ఆయన ఏ హోదాలో ఉన్నా పజ్జన్నగా పిలుచుకునే వాళ్లం. ఆప్యాయతే ఆయన చిరునామా. అన్నారు. గతంలో ఎన్నో పదవులు అలంకరించి వికసించినట్లే ఇప్పుడూ పద్మంలా వికసిస్తారని విశ్వసిస్తున్నా. – హరీశ్రావు అండర్స్టాండింగ్తోనే అలా పోటీ చేశాం 2004 ఎన్నికల్లో నాపై పద్మారావు గెలిస్తే 2008 ఉప ఎన్నికల్లో నేను ఆయనపై గెలిచా. 2009లో సనత్నగర్ నుంచి ఇద్దరం పోటీ చేసి ఓడిపోయాం. 2014 ఎన్నికల్లో మేమిద్దరం అండర్స్టాండింగ్తోనే వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచాం. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నా పెళ్లి చేసింది ఆయనే... ఉద్యమ సమయంలో ఓయూలో ఉన్న మాకు పజ్జన్న వెన్నుదన్నుగా నిలిచారు. 2012లో నా పెళ్లి చేసింది ఆయనే. పెళ్లికి అత్తమామ ఒప్పుకోకపోతే పద్మారావు పెద్ద మనసుతో వారితో మాట్లాడి నా ప్రేమ వివాహానికి ఒప్పించారు. – బాల్క సుమన్ ఆయన ఉద్యమ నాయకుడు పద్మారావుగౌడ్తో గత 20 ఏళ్ల నుంచి నాకు ఉన్న అనుబంధం మరచిపోలేనిది. రెండుసార్లు కార్పొరేటర్గా పనిచేసిన ఆయన పదవి వదులుకొని 2001లో టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పద్మారావుగౌడ్. ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు అందరికీ ఆదర్శం. పరేడ్ గ్రౌండ్స్లో టీఆర్ఎస్ నిర్వహించిన తొలి సభకు రేయింబవళ్లు కష్టపడి పని చేసి సభ విజయవంతం అయ్యేలా ఆయన కృషి చేశారు. జంట నగరాల్లో టీఆర్ఎస్ విజయంలో ఆయన పాత్ర కీలకం. రాజధానిలో కల్లు దుకాణాలు మూసివేయొద్దం టూ సమైక్య రాష్ట్రంలో పోరాడారు. 2014లో పద్మారావు ఆబ్కారీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నగరం లో మళ్లీ కల్లు దుకాణాల పునరుద్ధరణ జరిగింది. లక్షలాది ఈత, తాటి మొక్కలను ఆయన నాటిం చారు. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఒకేలా ఉంటారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. – సీఎం కేసీఆర్ స్ఫూర్తివంతంగా సభను నిర్వహిస్తా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు సీఎం కేసీఆర్తోపాటు మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు. శాసనసభకు గౌరవ ఉపసభాపతిగా ఎన్నికైన తర్వాత సభలో నిష్పక్షపాతంగా, ప్రజ లకు ఉపయోగపడే చర్చలు జరగాలని ఆశిస్తు న్నా. ఇందుకోసం సభ్యులందరికీ సముచిత అవకాశాలు కల్పించాలనేది నా అభిప్రాయం. వర్తమాన తరానికే కాకుండా భావితరాల వారికి స్ఫూర్తివంతంగా సభా కార్యక్రమాలు నిర్వహిం చేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. – పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్ -
హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా బుధవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. ముఖ్యంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన వర్షంతో లోతట్టుప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. నగరంలోని కొన్ని ప్రాంతాలు రాత్రి నుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అంధకారంలో మగ్గిపోయాయి. నగరంలోని సికింద్రాబాద్, బేగంపేట, పంజాగుట్ట, అమీర్పేట, ఎర్రగడ్డ, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలతో పాటు పలు కాలనీలను వరద నీరు ముంచెత్తడంతో లాలాపేటలోని ఫంక్షన్హాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మోకాళ్లలోతు నీళ్లలోనూ రాష్ట్ర మంత్రి పద్మారావు పునరావాస కేంద్రాన్ని, చుట్టుపక్కల ప్రాంతాలలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిరాశ్రయులుగా మారిన వారి గురించి చర్యలు తీసుకునే దిశగా జీహెచ్ఎంసీ అధికారులకు పద్మారావు ఆదేశాలు జారీచేశారు. నగరంలోని పలు అపార్ట్మెంట్స్లోకి భారీగా వర్షపు నీరు చేరుతుండటంతో అందులోని అపార్ట్మెంట్ వాసులు కిందకు వచ్చేందుకు అవకాశాలు లేని పరిస్థితి నెలకొంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పలు కాలనీల్లో భారీగా వరద నీరు చేరుకోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీళ్లలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మల్కాజ్గిరిలోని బండ్ల చెరువు పొంగి పొర్లుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పటేల్నగర్, దుర్గానగర్, సాయిపురి కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. జీహెచ్ఎంసీ కమిషనర్ సమీక్ష హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్రెడ్డి సమీక్ష జరిపారు. ఈఈ, సర్కిల్ కమిషనర్లు ఫీల్డ్లో ఉండాలని కమిషనర్ ఆదేశించారు. ఎమర్జెన్సీ టీంలకోసం 040-21111111 నెంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.