breaking news
Swiss company
-
స్విట్జర్లాండ్కు ‘యాక్ట్’ అమ్మేసుకుంది
ముంబై: బ్రాడ్బ్యాండ్ సంస్థ ఏట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్ (యాక్ట్)లో నియంత్రణ వాటాలను స్విట్జర్లాండ్కి చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ పార్ట్నర్స్ గ్రూప్ దక్కించుకుంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ లెక్కగట్టి, ప్రస్తుత షేర్హోల్డర్లయిన ఆర్గాన్, టీఏ అసోసియేట్స్ తమ వాటాలను విక్రయిస్తున్నాయి. ఆర్గాన్ పూర్తిగా నిష్క్రమిస్తుండగా, టీఏ పాక్షికంగా వాటాలను విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు రెండు సంస్థలు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపాయి. దేశంలోని 19 నగరాల్లో 20 లక్షల మంది వినియోగదారులకు యాక్ట్ సంస్థ ఇంటర్నెట్, టీవీ, డేటా, ఇతర బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తోంది. కంపెనీలో 7,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. దేశీయంగా యాక్ట్ నాలుగో అతి పెద్ద వైర్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్గా ఉందని యాక్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాలా మల్లాది తెలిపారు. 2008 జూన్లో యాక్ట్లో ట్రూ నార్త్ ఫండ్ త్రీ నియంత్రణ వాటాలు కొనుగోలు చేసింది. అటుపైన 2016లో ఇండియం వి (మారిషస్) హోల్డింగ్స్ సంస్థ.. ఆర్గాన్, టీఏల ద్వారా ఆ వాటాలను కొనుగోలు చేసింది. తాజాగా వాటినే స్విస్ సంస్థకి విక్రయిస్తోంది. -
టెక్ మహీంద్రా చేతికి స్విస్ కంపెనీ
న్యూఢిల్లీ: కన్సల్టింగ్ సేవల సంస్థ సాఫ్జెన్ హోల్డింగ్స్ను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తెలిపింది. అయితే, ఒప్పందం విలువ మాత్రం వెల్లడించలేదు. ఈ డీల్ మార్చి నాటికి పూర్తికాగలదని కంపెనీ వివరించింది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే సాఫ్జెన్.. కమర్షియల్, రిటైల్ బ్యాంకింగ్ తదితర రంగాల సంస్థలకు సేవలు అందిస్తోంది. ఇందులో 450 మంది ఉద్యోగులు ఉన్నారు. కస్టమర్లకు అత్యాధునిక కోర్ బ్యాంకింగ్ సేవలు అందించడానికి ఈ డీల్ ఉపయోగపడగలదని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీయంగా నాలుగో అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థగా ఎదగాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న టెక్ మహీంద్రా కొన్నాళ్లుగా పలు కంపెనీలను కొనుగోలు చేసింది. ఇటీవలే 240 మిలియన్ డాలర్లతో అమెరికాకు చెందిన లైట్బ్రిడ్జ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ను కొనుగోలు చేసింది.