breaking news
Sudarshan Chakra Mission
-
సుదర్శన చక్రతో శత్రు నాశనం
ఉడుపి/యశవంతపుర: దేశ రక్షణ పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఎర్రకోట నుంచి శ్రీకృష్ణుడి సందేశాన్ని వినిపించామని తెలిపారు. శత్రువులను నాశనం చేయడానికి ‘మిషన్ సుదర్శన చక్ర’ను ప్రకటించామని గుర్తుచేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కీలకమైన ప్రాంతాలు, పారిశ్రామికవాడలకు బలమైన రక్షణ కవచం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.ప్రధాని మోదీ శుక్రవారం కర్ణాటకలోని ఉడుపి పట్టణంలో పర్యటించారు. ఉడుపి శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో ‘లక్ష కంఠ గీతా పారాయణం’లో పాల్గొన్నారు. లక్ష మందికిపైగా భక్తులతో కలిసి భగవద్గీత పారాయణం చేశారు. 18 శ్లోకాలను పఠించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మన దేశంలో గతంలో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు నిశ్శబ్దంగా ఉండిపోయాయని, ప్రతిదాడులు చేయడానికి సంకోచించాయని ఆక్షేపించారు. కానీ, ఇప్పటి నవ భారతదేశం ఒత్తిళ్లు, బెదిరింపులు, దాడులకు ఎంతమాత్రం లొంగబోదని తేల్చిచెప్పారు. ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం ఎంతదూరమైనా వెళ్తుందని ఉద్ఘాటించారు. దేశ భద్రతే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. పథకాలకు భగవద్గీత బోధనలే పునాది ‘‘శాంతి, సత్యం కోసం ఎల్లప్పుడూ కృషి చేయాలని భగవద్గీత బోధిస్తోంది. అదేసమయంలో దుషు్టలు, దుర్మార్గులను అంతం చేయాలని చెబుతోంది. వసుధైక కుటుంబం అనే సూత్రాన్ని విశ్వసిస్తున్నాం. ధర్మో రక్షిత రక్షితః అని పఠిస్తున్నాం. పహల్గాంలో మన పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ముష్కరులపై యుద్ధం చేశాం. వారికి తగిన గుణపాఠం నేర్పించాం. మన నిత్య జీవితంలో భగవద్గీత పాత్ర ఎంతో ఉంది. గీత బోధనలు ప్రతి తరానికీ వర్తిస్తాయి. దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం జాతీయ విధానాల రూపకల్పనలో భగవద్గీత దిశానిర్దేశం చేస్తూనే ఉంది. జనం బాగు కోసం పనిచేయాలని గీతలో శ్రీకృష్ణుడు పిలుపునిచ్చాడు. సబ్కా సాత్, సబ్కా వికాస్.. సర్వజన హితాయ నినాదాలకు భగవద్గీత శ్లోకాలే స్ఫూర్తి. ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి ప్రజా సంక్షేమ పథకాలకు పునాది భగవద్గీత బోధనలే. భగవద్గీత చూపిన మార్గంలో నడుస్తూ మహిళల భద్రత, సాధికారత కోసం నారీశక్తి వందన్ అధినియం తీసుకొచ్చాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. శ్రీకృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు ఉడుపి పట్టణంలో ప్రధాని మోదీ తొలుత రోడ్డుషోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేశారు. తనపై చల్లిన పూలను తిరిగి జనంపై చల్లారు. అనంతరం శ్రీకృష్ణుడి ఆలయానికి చేరుకున్నారు. పర్యాయ పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ ఆధ్వర్యంలో మోదీకి అర్చకులు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తర్వాత ఆలయ ఆచారం ప్రకారం కిటికీ(కనకన కిండీ) నుంచి శ్రీకృష్ణుడి మూలమూర్తిని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మోదీకి వెండి దారంతో కూడిన తులసి జపమాల, శంకు, చక్ర, గద, పద్మం ముద్రలను బహూకరించారు. మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామి ప్రధాని మోదీకి ‘భారత భాగ్య విధాత’ బిరుదునిచ్చి సన్మానించారు. కాశీ కారిడార్ తరహాలో ఉడుపి కారిడార్ను అభివృద్ధి చేయాలని మోదీని కోరారు. కనకదాసకు నివాళులు ఉడుపిలోని చరిత్రాత్మక కనక మండపాన్ని మోదీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా 14వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త, కీర్తనకారుడు కనకదాసకు ఘనంగా నివాళులరి్పంచారు. ఉడుపిలో శ్రీకృష్ణుడు పశి్చమ ముఖంగా కొలువుదీరడం వెనుక కనకదాస పాత్ర ఉందని భక్తులు విశ్వసిస్తారు. మోదీ ఉడుపి ఆలయాన్ని సందర్శించడం ఇది రెండోసారి. 2008 ఏడాదిలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో ఈ ఆలయానికి వచ్చారు. తొమ్మిది ప్రతిజ్ఞలు వికసిత్ భారత్, నవ్య భారత్ కోసం తొమ్మిది ప్రతిజ్ఞలు చేయాలని ప్రధాని మోదీ ఉడుపి శ్రీకృష్ణుడి ఆలయం నుంచి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. అవి ఏమిటంటే.. → మాతృమూర్తి పేరిట ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలి. → నదులు, చెరువులు, ఇతర జల వనరులను కాపాడుకోవాలి. జల సంరక్షణే మన ధ్యేయం కావాలి. → కనీసం ఒక నిరుపేద జీవితాన్ని మెరుగుపర్చడానికి కృషి చేయాలి. → బాధ్యత కలిగిన దేశ పౌరులుగా స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, ఉపయోగించుకోవాలి. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది మన నినాదం కావాలి. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు తోడ్పాటునందించాలి. -
శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం
వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.ఒక్కసారి సంధిస్తే..సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.సుదర్శన చక్రం సంహారాలుశ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.అన్నమయ్య నోట.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది.


