-
ఉద్యోగ భర్తీల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం
ముషీరాబాద్: ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఖాళీల భర్తీపై రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ముషీరాబాద్లో రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అ«ధ్యక్షతన నిరుద్యోగ మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లకు రాజీనామా చేసినా, సభ్యులు మరణించినా ఆరు నెలల్లోపు భర్తీ చేయాలని రాజ్యాంగం చెబుతుందన్నారు. అయితే ఉద్యోగ ఖాళీలు ఏర్పడిన 10 నుంచి 20 ఏళ్ల వరకు భర్తీ చేయడం లేదన్నారు. అన్ని రాజకీయ పోరాటాలు ఏకమై పార్లమెంటులో బిల్లు పెట్టి ఖాళీలు ఏర్పడిన నెలలోపు భర్తీ చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. -
కెరీర్కు 'ఇన్స్పైర్'
సాక్షి, బాపట్ల:దేశంలో ప్రతిభకు కొదవలేదు. కోట్లాది మంది విద్యార్థుల్లో ఎందరో కలాంలు ఉన్నారు. భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కలలు కంటున్నారు. అటువంటి వారిని గుర్తించి ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిందే ‘ఇన్స్పైర్ మనక్’. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ)రూపొందించిన స్కీం ఇది. విద్యార్థులను సైన్స్ కెరీర్ వైపు మళ్లించడంతోపాటు పరిశోధనలకు ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో 2008లో కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ‘ఇన్స్పైర్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇన్స్పైర్ మనక్తో ఏటా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థుల ప్రదర్శనలను తీసుకుంటుంది. ఆరో తరగతి నుంచి పీజీ వరకు విద్యాభివృద్ధి కోసం మూడు విభాగాల్లో ఐదు రకాల కార్యక్రమాలను అమలు చేస్తుంది. సైన్స్పై ఆసక్తి పెరిగేలా విద్యార్థుల్లో విజ్ఞాన సామర్థ్య వృద్ధికి డీఎస్టీ కృషి చేస్తోంది. ఇన్స్పైర్ మనక్, ఇన్స్పైర్ ఇంటర్న్షిప్లతో పాటు మూడు కేటగిరిల్లో పరిశోధనకు భరోసా కల్పిస్తుంది. దేశ వ్యాప్తంగా ఉండే ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. జూలై 31తో ప్రాజెక్టుల నమోదు గడువు ముగియనుంది. దరఖాస్తు అర్హత వివరాలు ఆరోవ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అర్హులు ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు నామినేషన్లు పంపించాలి మన చుట్టూ పరిసరాల్లో నెలకొన్న సామాజిక సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచనలతో ప్రాజెక్టు రూపొందించాలి ప్రతిపాదనలను డీఎస్టీ పోర్టల్ (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్.డీఎస్టీ.జీవోవీ.ఇన్)లో ఆప్లోడ్ చేయాలి ఈ నెల 31లోగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టుల రూపకల్పనకు రూ.10 వేలను ప్రభుత్వం విద్యార్థికి అందజేస్తుంది. విద్యార్థులు తమ ఆలోచనలకు రూపం ఇచ్చిన నమూనాలతో ప్రదర్శనలకు హాజరు కావాలి రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ప్రాజెక్ట్ రూపకల్పనకు ప్రభుత్వం రూ.20 వేలు అందజేస్తుంది 4 జాతీయ స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టు రూపకల్పనకు రూ. 50 వేలు అందిస్తుంది. 4 అంతర్జాతీయ స్థాయిలో ప్రాజెక్టు ఎంపికైతే పేటెంట్ హక్కులు లభిస్తాయి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ 2,78,040 ఎయిడెడ్ 34,628 ప్రైవేటు 3,45,746 విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహం విద్యార్థుల ప్రతిభకు తగిన ప్రొత్సాహం లభిస్తుంది. సైన్స్ ఇన్స్పైర్ అవార్డులను ఆందుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. మా పాఠశాల నుంచి ప్రతి ఏడాది జిల్లాస్థాయికి ఎంపికవుతూనే ఉన్నారు. వీరితో పాటు 2013 డిసెంబర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్లో జరిగిన నేషనల్ చిల్ట్రన్ సైన్స్ సదస్సుకు మా పాఠశాల నుంచి ఆరుగురు విద్యార్థులు పాల్గొని గోల్డ్మెడల్స్ సాధించారు. దక్షిణభారత వైజ్ఞానిక ప్రదర్శనలో గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రథమ బహుమతి సాధించాం. – జి. శ్రీనివాసరావు, సైన్స్ టీచర్, చెరువుజమ్ములపాలెం జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఒక పాఠశాల ఒకేసారి రిజస్టర్ చేయాలి. ఒకే యూజర్ ఐడీ, పాస్వార్డ్ రూపొందించుకుని ఉపయోగించాలి. విద్యార్థి పేరుతో బ్యాంకు ఖాతా ఉండాలి. మెయిల్ ఐడీలను పలుమార్లు ఉపయోగించినా విద్యార్థుల ఖాతాలోకి నగదు జమ కాదు. ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలి. – ఎ.ఎ.మధుకుమార్, జిల్లా సైన్స్ అధికారి జిల్లాకు గుర్తింపు తెచ్చేలా కృషి జాతీయస్థాయిలో జిల్లాకు పేరు వచ్చేలా కృషి చేస్తున్నాం. గతేడాది గుంటూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,275 మంది అర్హత సాధిస్తే వారిలో 217 మంది జిల్లాస్థాయిలో ఎంపికయ్యారు. 22 మంది రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. వారిలో 03 జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. ఈ ఏడాది విద్యార్థులు తయారుచేసే ప్రతి ప్రాజెక్టు సృజనాత్మకంగా, నూతనంగా ఉండాలని సూచించాం. అందుకు అవసరమైన శిక్షణ సైన్స్ ఉపాధ్యాయులకు ఇప్పటికే ఇచ్చాం. – ఆర్.ఎస్.గంగాభవాని, డీఈవో, గుంటూరు -
జల రవాణాకు మహర్దశ
సాక్షి, ముంబై: జల రవాణాకు మంచి రోజులు రాబోతున్నాయి. కొంకణ్ తీరంలోని ఓడ రేవులను పునరుద్ధరించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ మేరకు రూ. 22,775 కోట్లతో ప్రణాళికను రూపొందించాయి. కొంకణ్లోని 720 కిలోమీటర్ల తీరంలో ఉన్న 51 ఓడ రేవుల్లోని జలమార్గాల్లో పూడిక తీయాలని కూడా నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ముంబై, నవీముంబై, జేఎన్పీటీ వంటి ఓడ రేవులతో పాటు మిగిలిన 49 ఓడరేవులు చిన్నతరహా, మీడియం ఇలా అయిదు రకాల వర్గాలుగా ఏర్పాటుచేసి వీటిని అభివృద్ధి చేయనున్నాయి.ఈ చర్యల వల్ల జల రవాణా మరింత పుంజుకొని రాబోయే రోజుల్లో కొంకణ్ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఈ ప్రణాళికకు ఆమోదం లభిస్తే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జల రవాణాతో లాభాలు అనేకం.... ముంబైతోపాటు ఇతర ప్రాంతాలకు జలరవాణా ప్రారంభిస్తే అనేక లాభాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జలరవాణా వల్ల నగరంలోని ట్రాఫిక్ సమస్యకు కొంత పరిష్కారం లభించే అవకాశముందని అంటున్నారు. అలాగే ప్రయాణికులు తక్కువ సమయంలో తమ గమ్యస్థానాలకు చేరుకునే అవకాశముందని తెలిపారు. మరోవైపు ముంబై-గోవా జలమార్గం సేవలు ప్రారంభించాలన్న డిమాండ్ కూడా ఊపందుకుంటోంది. రోడ్డు మార్గం ద్వారా ముంబై-గోవా మధ్య సుమారు 12 నుంచి 15 గంటల సమయం పడుతుంది. అదే సముద్ర మార్గం ద్వారా వెళితే కేవలం ఐదు గంటల్లో చేరుకునే అవకాశముంది. విలువైన సమయంతోపాటు చార్జీలు కూడా కలిసి వచ్చే అవకాశముందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement