-
పుతిన్ను అరెస్టు చేస్తే.. రష్యాతో యుద్దం తప్పదు: సౌతాఫ్రికా అధ్యక్షుడు
ఆగష్టులో జొహానెస్బర్గ్ వేదికగా బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా హాజరుకానున్నారు. ఈ ఏడాది మార్చిలో పుతిన్పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీసీ) అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఐసీసీ సభ్య దేశంగా ఉన్న దక్షిణాఫ్రికా పుతిన్ను అరెస్టు చేయాల్సి ఉంటుంది. దీంతో పుతిన్ అరెస్టు విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుతిన్ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం తప్పదని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమపోసో అన్నారు. బ్రిగ్స్ సమావేశం నేపథ్యంలో దక్షిణాఫ్రికాకు వస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ను అరెస్టు చేయాలని ఆ దేశ ప్రతిపక్ష డెమోక్రటిక్ అలయెన్స్ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టులో విచారణ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో పుతిన్ను అరెస్టు చేస్తే రష్యాతో యుద్ధం ప్రకటించినట్లేనని రమఫొస పేర్కొన్నారు. రష్యాతో యుద్ధం చేయడం దక్షిణాఫ్రికా రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టుకు తెలిపారు. మరోవైపు బ్రిక్స్ దేశాల వేదికను తమ దేశం నుంచి మార్చాలన్న ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించినట్లు దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పౌల్ మషతిలే తెలిపారు. గత కొన్నాళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం దురాక్రమణమని పలు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఐక్యరాజ్య సమితి నియమాలకు విఘాతం కలిగిస్తోందని తెలుపతూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్ను అరెస్టు చేయాలని కోరాయి. ఆ తర్వాత ఐసీసీ ఆయనపై అరెస్టు వారెంట్ను జారీ చేసింది. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని విరమించాలని పలు దేశాలు కోరుతున్నాయి. ఇదీ చదవండి: మండుతున్న ధరలు, ఆస్తులు అమ్ముకుంటున్న పాకిస్తాన్.. పరిస్థితి కష్టమేనంటున్న ఐఎంఎఫ్ నివేదిక -
రూ. 54 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
శంషాబాద్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పదిహేను రోజులుగా టాంజానియా, దక్షిణాఫ్రికాల నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడగా తాజాగా శుక్రవారం మరో మహిళ హెరాయిన్ తీసుకొచ్చిన మహిళను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన మహిళ దోహా మీదుగా ఖతర్ ఎయిర్లైన్స్ విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. అనుమానిత దేశాల నుంచి వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టిన అధికారులు ఆ మహిళ లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నల్లని పాలిథీన్ కవర్తో ఉన్న ప్యాకేజిని తొలగించడంతో అందులో 6.75 కేజీల బరువు కలిగిన హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.54కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. సదరు మహిళ కూడా క్యారియర్గా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాలీ బ్యాగుల్లో హెరాయిన్.. మార్కెట్ విలువ రూ.126 కోట్లు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ పట్టుబడింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దేశంలోకి దొంగతనంగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. శనివారం జొహన్నెస్బర్గ్ నుంచి దోహా మీదుగా వచ్చిన వీరి లగేజీని తనిఖీ చేయగా బ్యాగుల్లో తెల్లటి పౌడర్, గుళికల రూపంలో ఉన్న సుమారు 18 కిలోల బరువున్న రూ.126 కోట్ల విలువైన హెరాయిన్ బయటపడిందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ట్రాలీ బ్యాగుల్లో వీటిని కనిపించకుండా దాచి ఉంచారని చెప్పారు. చదవండి: DCPCR: థియరీ ఫార్ములా ప్రాక్టికల్స్కు వద్దు Kukatpally: మూఢ నమ్మకం.. తీసింది ప్రాణం -
సిప్లా చేతికి దక్షిణాఫ్రికా ఫార్మా కంపెనీ
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సిప్లా కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన మిర్రెన్ లిమిటెడ్ను కొనుగోలు చేయనున్నది. ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) ఔషధాలను తయారు చేసే మిర్రెన్ కంపెనీని రూ.228 కోట్లకు (45 కోట్ల దక్షిణాఫ్రికా రాండ్లు) కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నామని సిప్లా తెలిపింది. మిర్రెన్ లిమిటెడ్ను తమ దక్షిణాఫ్రికా అనుబంధ కంపెనీ, సిప్లా మెడ్ప్రో సౌత్ ఆఫ్రికా కొనుగోలు చేయనున్నదని వివరించింది. ఈ లావాదేవీకి దక్షిణాఫ్రికా కాంపిటీషన్ కమిషన్ ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవుతుందని పేర్కొంది. దక్షిణాఫ్రికా, నమీబియా, బోట్స్వానా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే మిర్రెన్ కంపెనీ ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగిసే ఏడాదికి 15.21 కోట్లదక్షిణాఫ్రికా రాండ్ల టర్నోవర్ను సాధించింది. కంపెనీ కొనుగోలు వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సిప్లా షేర్ 1.2 శాతం లాభంతో రూ.632 వద్ద ముగిసింది. -
గుప్తా స్కాం: బీవోబీకి సౌత్ ఆఫ్రికా దెబ్బ
జోహన్నెస్బర్గ్: అధ్యక్షుడు రాజీనామాకు దారితీసిన గుప్తా స్కాంపై సౌత్ ఆఫ్రికా ప్రతి పక్ష పార్టీ డెమెక్రాటిక్ అలయన్స్(డీఏ) ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) పై క్రిమినల్ చర్యలకు సిద్ధపడుతోంది. ఈ మేరకు హిందూ ఒక కథనాన్ని ప్రచురించింది. ది హిందూ, ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ ప్రాజెక్ట్ (ఏసీసీఆర్పీ) చేపట్టిన ఒక వివరణాత్మక దర్యాప్తు నేపథ్యంలో ప్రతిపక్షపార్టీ బీవోబీపై చర్యలకు దిగనుందని నివేదించింది. సీనియర్ బ్యాంకు అధికారులు గుప్తా కుటుంబం యాజమాన్యంలోని కంపెనీలతో సహా, సహారా గ్రూపుకు చెందిన వివిధ కంపెనీలకు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వ సంస్థల నుండి పెద్ద ఎత్తున, వివరణ లేని చెల్లింపులు చేశారనేది ప్రధాన ఆరోపణ. ముఖ్యంగా జూనియర్ ఉద్యోగులు లేవనెత్తిన అనుమానాస్పద లావాదేవీల నివేదికలను (ఎస్.ఆర్.ఎస్) ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని విమర్శించింది. జోహాన్నెస్బర్గ్లో బీవోబీ బ్రాంచ్లో ఈ అక్రమ లావాదేవీలు ఎక్కువగా 2016 లో నమోదైనట్టు గుర్తించింది. ఈ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డీఏ భావిస్తోంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ చట్టం 29 , 52 సెక్షన్ల ప్రకారం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ భారీకుంభకోణంపై తమ పోరాటం కొనసాగుతుందని డీఏ పార్టీ ప్రతినిధి నటాషా మజ్జోన్ స్పష్టం చేశారు. 1990లలో భారతదేశం నుంచి వలస వెళ్లిన గుప్తా బ్రదర్స్ అతుల్, అజయ్, రాజేష్ - దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా సహకారంతో బిలియన్ డాలర్ల కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత సంతతికి చెందిన గుప్తా కుటుంబంతో జుమాకు సన్నిహిత్ సంబంధాలు వివాదాస్పదంగా మారాయి. వీటితోపాటు పలు అవినీతి ఆరోపణలు. చివరకు అధికార ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఒత్తిడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న జుమా రాజీనామాకు దారితీసింది. అదే రోజున, జోహెన్నెస్ బర్గ్లోని గుప్తా భవనంపై పోలీసులు దాడి చేయడంతోపాటు అజయ్గుప్తాకు అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. అలాగేమాజీ ప్రెసిడెంట్ కొడుకు డ్యుడ్యూజనే సహా, ముగ్గురు గుప్తా సోదరులు దుబాయ్కి పారిపోయారని భావిస్తున్నారు. మరోవైపు సౌత్ ఆఫ్రికాలో కార్యకలాపాలను నిలిపివేయాలని బీవోబీ నిర్ణయించింది. తమ కార్యకలాపాలు ఎప్పుడూ ఆ దేశంలోని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే కొనసాగాయని వివరించింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement