breaking news
slowly
-
ఊరూ.. పల్లెటూరు..!
‘కరీంనగర్ సిటీకి చెందిన ఓ ఉద్యోగ దంపతులు 25 ఏళ్లక్రితం హుజూరాబాద్ సమీపంలోని చెల్పూర్ గ్రామంలో అద్దెకు ఉండేవారు. అక్కడ వీరికి జన్మించిన చంటిబాబుకు స్నానం చేయించడం.. ఏడిస్తే ఆడిపించడం వంటివి ఇంటి యజమానురాలు చేసేవారు. ఆ చిన్నోడు ఆమెను అమ్మమ్మ అనేవాడు. తర్వాత ఆ దంపతులు బదిలీపై వెళ్లిపోయారు. ఈక్రమంలో తల్లిదండ్రులు ఊళ్లో కిరాయికి ఉన్న ఇంటి యజమాని.. వారి పిల్లల గురించి తరచూ మాట్లాడుకోవడం వినేవాడు. ఆ పసిపిల్లోడు ఎదిగి ఉద్యోగ రీత్యా అమెరికా వెళ్లాడు. ఇటీవల అద్దె ఇంటి అమ్మమ్మను కలిసేందుకు వచ్చాడు. చిన్నప్పుడు తనను లాలించారని గుర్తుకు తెచ్చుకుని ఆ కుటుంబ సభ్యులను హత్తుకున్నాడు. ఇంటి యజమాని అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు’.హుజూరాబాద్: పల్లెలు.. ఆత్మీయతకు ముల్లెలు. ఊరోళ్లంతా రక్త సంబంధీకులు కాకపోయినా.. సామాజిక వర్గాలు వేరైనా బంధువుల్లా కలిసుంటారు.. ఎవరింట్లోనైనా ఏదైనా పనిపడితే మేమున్నామంటూ భరోసా ఇస్తారు. ఇరుగుపొరుగువారు పోగవుతారు. చేయిచేయి కలిపి పనికానిస్తారు. పంట కోతకొచ్చింది.. కూలీలు దొరకట్టేదని బాధపడుతుంటే.. చూస్తూ ఊరుకోకుండా సాయంగా నడుంబిగిస్తారు. పల్లెటూరి ముల్లెను విప్పి చూస్తే ఇలాంటి ఆత్మీయ అనుబంధాలెన్నో కనిపిస్తాయి.తలా ఓ చేయి వేస్తరు..ఊళ్లలో జరిగే శుభకార్యాలు.. విందులు.. ఇతర కార్యాలకు వంటలు చేసేందుకు ఒకరినొకరు సహకరించుకునే తీరూ చాలా గొప్పగా ఉంటుంది. ఒకరిద్దరే ఉన్నా.. ఇరుగుపొరుగు వారు సాయంగా నిలిచి వంటావార్పు చేసి ఎవరికీ ఏ కష్టం.. నష్టం రాకుండా చూస్తారు. వంటచేసి వడ్డించే దాకా అన్నీ తామై వ్యవహరించే విధానం పల్లె సిగలో చక్కని నగలా కనిపిస్తుంది. అదే పట్టణాల్లోనైతే ఈ పనులన్నీ ఎక్కడ చేస్తామని క్యాటరింగ్కు అప్పగిస్తారు.వాళ్లకు వీళ్లు.. వీళ్లకు వాళ్లువరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఊళ్లలో ఇంటి పక్కోళ్ల పొలానికి వీళ్లు వెళ్లి కోతల్లో పాల్గొంటారు.. వాళ్ల పొలం కోతకు వస్తే వీళ్లు వెళ్తారు. ఇలా ఇంటి చు ట్టూ ఉన్నవారితో ప్రేమానురాగాలు కొనసాగిస్తారు. ఏ చిన్న పండుగ చేసుకున్నా.. ఇంట్ల ఏది వండినా పంచుకొని తింటారు. ఈ పద్ధతి వల్ల డబ్బులు లేకుండా చేను పని, ఇంటి పనులు పూర్తవుతాయి. ఇలా ఒకరి పనుల్లో ఒకరు భాగస్వామ్యం అవ్వడాన్ని గ్రామాల్లో ‘బదిలీ’ అంటారు. వరికోతలు పూర్తయ్యాక.. కొత్తబియ్యం వండి ఒకరినొకరు బంతి భోజనాలకు పిలుచుకుంటారు. ఇప్పుడు పరిస్థితి మారుతుంది. కొన్ని పల్లెలు మూలవాసం మర్చిపోతున్నాయి. ఆత్మీతకు దూరమవుతున్నాయి.స్వచ్ఛందంగా కదిలి.. రోడ్డు నిర్మించిగంభీరావుపేట(సిరిసిల్ల): వర్షాల ప్రభావంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ధాన్యం ఇంటికి తెచ్చుకునేందుకు రైతులకు దారిలేదు. రైతులంతా స్వచ్ఛందంగా కదిలారు. గంభీరావుపేట మండలం గోరింటాలకు చెందిన రైతులు చేయిచేయి కలిపారు. గ్రామ శివారులోని వాగుపై వంతెన లేకపోవడంతో తాత్కాలిక మట్టిరోడ్డును ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా రైతులు ఐక్యంగా కలిసిరావడం.. ఒకరికొకరు సాయం చేసుకోవడం పల్లె బంధానికి అద్దంపడుతోంది. సాగుకు సాయంగా వచ్చేవారునా యుక్త వయస్సులో ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సాగు పనులు చేసేవాళ్లం. సరదా మాట లు మాట్లాడుకుంటూ పనులు చేస్తుంటే పని చేసినట్టు ఉండేవి కావు. కానీ, ఇప్పుడు డబ్బుకు ప్రా« దాన్యం పెరిగింది. బంధుత్వాల మధ్య వైరంగా మారి బంధాలను దూరం చేసుకుంటున్నారు. డ బ్బు ప్రాధాన్యతను పక్కన బెట్టి స్నేహంగా ఒకరినొ కరు సాయం చేసుకుంటూ సంతోషంగా జీవించవచ్చు. – మూగల సంజీవరెడ్డి,రైతు, ధర్మరాజుపల్లి పండుగ వచ్చిందంటే..ఒకప్పుడు పండుగ వచ్చిదంటే పల్లెలకు కొత్త రూపం వచ్చేది. దూ ర బంధువులు ఊరికి వచ్చారంటే కలివిడిగి తిరుగుతుండేవారు. పండుగకు వచ్చిన వారు యోగక్షేమాలను అడిగి తెలుసుకొని సా యం చేసేవారు. ఇప్పుడు బట్టలు, బంగారంపై మోజు తప్ప పండుగలకు ప్రాధాన్యం ఇవ్వడం లే దు. ప్రస్తుత యువతకు మంచి విషయాలు చెప్పాలంటే వారు ఎలా తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉంది. – కనకం విజయ, రాంపూర్ ముచ్చటగా ఉంటదిమా ఇంట్లో పెద్దలు పండుగలు, పెళ్లిల్ల తంతుపై వారు యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఆచరించిన పద్ధతి, వ్యవహారాల గురించి చెబుతుంటే ముచ్చటగా ఉంటది. అప్పట్లో ప్రతీ విషయాన్ని పక్కవారితో వారు పంచుకునే తీరు ఆశ్చర్యం వేస్తోంది. నాటి ఆచార వ్యవహారాలను నేటి యువత పాటిస్తే భవిష్యత్ తరాలు బాగుంటాయి. – బండారి మహేశ్, తుమ్మన్నపల్లి∙ ఒకప్పటి పల్లెల్లో కలివిడితనం∙ ఒకరికొకరు సాయంగా మేమున్నామంటూ భరోసా ∙ సోషల్ మీడియా రాకతో ఊళ్లలో దూరమవుతున్న పల్లె సంస్కృతి -
మస్తిష్కం మనం అనుకున్నంత ఫాస్ట్ కాదు!
పంచేంద్రియాల నుంచి నిరంతరాయంగా వచ్చే సమాచారాన్ని రెప్పపాటు వ్యవధిలో ప్రాసెస్ చేసి అందుకు అనుగుణంగా మానవ మెదడు ఆయా అవయవాలకు ఆదేశాలుగా తిరిగి పంపిస్తుందని ఇన్నాళ్లూ చదువుకున్నాం. అయితే గత అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. తనకు అందిన సమాచారాన్ని మెదడు ఎంతవేగంగా విశ్లేíÙస్తుందనే అంశంపై శాస్త్రవేత్తలు తొలిసారిగా దృష్టిసారించారు. ఈ పరిశోధనలో వెల్లడైన ఫలితాలు మెదడుపై ఇన్నాళ్లూ ఉన్న అభిప్రాయాలను మార్చుకునే పరిస్థితుల్ని కల్పిస్తున్నాయి.కళ్లు, చెవులు, చర్మం, ముక్కు ఇలా ఇంద్రియాలు, అవయవాల నుంచి ఒక్క సెకన్ కూడా ఆపకుండా వచ్చే సమాచారాన్ని మెదడు కేవలం సెకన్కు 10 బైట్ల వేగంతో మాత్రమే ప్రాసెస్ చేస్తోందని పరిశోధనలో పాల్గొన్న అధ్యయనకారులు తేల్చిచెప్పారు. కంప్యూటర్ పరిభాషలో సమాచారాన్ని ప్రాథమికంగా ఒక బైట్లో కొలుస్తారు. ఈ లెక్కన ఒక వై–ఫై కనెక్షన్ గుండా ఒక సెకన్లో 5 కోట్ల బైట్ల సమాచారం ప్రాసెస్ అవుతోంది. అలాంటిది చదవడం, రాయడం, వీడియో గేమ్ ఆడటం, రూబిక్ క్యూబ్ గళ్లను పరిష్కరించడం వంటి పనులు చేసేటపుడు మనిషి మెదడు కేవలం 10 బైట్ల వేగంతోనే సమాచారాన్ని ప్రాసెస్ చేయగల్గుతోంది. ఇది నిజంగా అత్యంత తక్కువ వేగం’’అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కాలిఫోరి్నయా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని అధ్యయనకారుల పరిశోధన వివరాలు ‘న్యూరాన్’జర్నల్లో గతవారం ప్రచురితమయ్యాయి. ‘‘ప్రధాన అంగాల నుంచేకాకుండా అంతర్గతంగా కోటానుకోట్ల కణాల నుంచి నాడీ వ్యవస్థ ద్వారా కోట్లాదిగా పోటెత్తుతున్న సమాచారంలో కేవలం ఈ పదిని మాత్రం తీసుకుంటూ మన మెదడు తన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచంపై ఒక అవగాహనకు వస్తోంది. ఆ అవగాహనతోనే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది నిజంగా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం. అసలు మన మెదడు సెకన్కు కేవలం 10 బైట్ల స్థాయిలోనే పనిచేయడానికి కారణాలేంటో తెలియాల్సి ఉంది.వేగంగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఒక నిర్ధారణకు వచి్చందా? లేదంటే ఇంతవరకు అతివేగంగా ప్రాసెస్ చేయాల్సిన అవసరమే రాలేదా? అనే కొత్త ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. మానవ పరిణామ క్రమంలో మనిషి అడవులను దాటి మైదాన ప్రాంతాలకు విస్తరించినా జంతువుల నుంచి రక్షణ, ఆహారాన్వేషణ, మైథునం వంటి బహుకొద్ది అంశాలకు మాత్రమే ఆదిమమానవుడు తన ఆలోచనలను పరిమితం చేశాడు. అలా ఎప్పుడూ స్వల్ప స్థాయిల్లో కొనసాగిన ఆలోచనల వేగం నేటి యుగంలోనూ పుంజుకోకపోయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.ఏకకాలంలో కేవలం కొన్ని ఆలోచనలు, సమాచారాన్ని మాత్రమే ఎందుకు ప్రాసెస్ చేయగల్గుతోంది? ఎక్కువ డేటాను ఎందుకు విశ్లేíÙంచలేకపోతోంది? సమాచార సముద్రంలోంచి కేవలం గుక్కెడు నీటినే ఎందుకు ఒడిసి పట్టుకోగల్గుతోంది? అనే విషయాలపై మరింత లోతైన అధ్యయనం చేపట్టాల్సి ఉంది. మానవ మెదడులో ఏకంగా 8,500 కోట్ల న్యూరాన్లు ఉన్నాయి. వీటిల్లో మూడింట ఒక వంతు మెదడు వల్కలంలోనే పోగుబడి ఉన్నాయి. అత్యున్నత స్థాయి ఆలోచనలు ఈ వల్కలంలోనే ఉద్భవిస్తాయి. ఇంతటి సామర్థ్యం ఉండి కూడా మెరుపువేగంతో దూసుకెళ్లాల్సిన మెదడు ఎందుకిలా మొండికేస్తుందో తెలియాల్సి ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జమ్మూకశ్మీర్లో మందకోడిగా పోలింగ్
-
ఆగుతూ సా..గుతూ
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం అడుగు ముందుకు.. రెండడుగులు వెనుకకు అన్నచందంగా తయారైంది. పనులను వేగవంతం చేయాల్సిన తరుణంలోనూ ఆగుతూ.. సా..గుతున్నాయి. వాతావరణ పరిస్థితుల పరంగా కలిసివచ్చే ప్రస్తుత సీజన్ లోనూ అనుకున్న స్థాయిలో పనులు ముందుకు సాగటం లేదు. బిల్లు చెల్లింపుల్లో జాప్యమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పోలవరం : పోలవరం ప్రాజెక్ట్కు సంబం ధించి స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో మట్టి తొలగింపు పనులు (ఎర్త్ వర్క్స్) పడకేశాయి. గతంతో పోలిస్తే రోజువారీ పనులు సగానికి పడిపోయాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందుల కారణంగా సబ్ కాంట్రాక్టర్లు పనులను నామమాత్రంగా చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ప్రధాన కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్ ట్రాయ్ సంస్థ సబ్–కాంట్రాక్టర్ అయిన త్రివేణి సంస్థకు పెద్దమొత్తంలో బిల్లుల్ని బకాయిపడింది. మిగిలిన సబ్–కాంట్రాక్టర్లకు సైతం బిల్లు చెల్లింపులు చేయడం లేదు. త్రివేణి ఆధ్వర్యంలో పనులు చేస్తున్న చిన్నపాటి కాంట్రాక్టర్లకు ఆ సంస్థ సైతం బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల వల్ల నెల రోజులుగా స్పిల్ వే నిర్మాణ ప్రాంతంలో మట్టి తొలగింపు పనులు పడకేశాయి. అలా అలా.. కానిస్తున్నారు స్పిల్ వే నిర్మాణంలో భాగంగా కాంక్రీట్ పనులకు ఇబ్బందులు కలగకుండా మాత్రమే మట్టి తొలగింపు పనులను చేపట్టగా.. అవికూడా లక్ష్యం మేరకు సాగటం లేదు. నెల క్రితం వరకు రోజుకు 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల నుంచి 1.90 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తొలగింపు చేసిన త్రివేణి సంస్థ ప్రస్తుతం రోజుకు కేవలం 90 వేల క్యూబిక్ మీటర్ల మేర మాత్రమే పనులు చేస్తోంది. స్పిల్ చానల్ పనులు కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. బ్లాస్టింగ్లు చేసే కొన్ని సంస్థలు సైతం బకాయిలు చెల్లించకపోవటంతో పనులు వదిలి వెళ్లిపోయాయి. లక్ష్యాల్ని చేరటం కష్టమే ఈ ఏడాది ప్రస్తుత సీజ న్ (జనవరి నుంచి జూ న్ వరకు)లో ప్రాజెక్ట్ పనులు నిర్దేశించిన లక్ష్యాలను చేరటం కష్టంగా కనబడుతోంది. స్పిల్ వే నిర్మాణానికి సంబంధించి 52 బ్లాక్లలో కాంక్రీట్ పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 4 బ్లాక్లకు సంబంధించిన పనులు మాత్రమే పూర్తయ్యాయి. మరో 4 బ్లాక్ల పనులు జరుగుతున్నాయి. డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబం ధించి 139 కొలను (పాండ్స్) పనులు చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 39 పనులు పూర్తయ్యాయి. 669 మీటర్ల పొడవున పనులు చేయాల్సి ఉండగా, 206 మీటర్ల మేర పూర్తయ్యాయి. ఇవి కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. ఇక 10.80 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించాల్సి ఉండగా.. 3.60 కోట్ల క్యూబిక్ మీటర్ల పనులు పడకేశాయి. వర్షాలు లేని సమయంలో మాత్రమే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. మహా అయితే, జూ న్ నెలాఖరు వరకు ఈ పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈలోగా లక్ష్యం మేరకు మట్టి తొలగించే అవకాశం కనిపించడం లేదు. ఇటీవల డీజిల్ లేదనే సాకుతో నాలుగు రోజులపాటు మట్టి తొలగింపు పనులను పూర్తిగా నిలిపివేసిన విషయం విదితమే. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజ న్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు పనులు పూర్తయ్యే అవకాశం లేదని పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కనక దుర్గ ప్లైఓవర్కు నిర్లక్ష్యపు గ్రహణం


