breaking news
Silver foyles
-
సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్
సాధారణంగా గోల్డ్ ఫాయిల్ను ఉపయోగించి తంజావూరు పెయింటింగ్స్ను డిజైన్ చేస్తారు. అయితే హైదరాబాద్ అత్తాపూర్లో ఉంటున్న నిఖిత, అల్కాలు సిల్వర్ ఫాయిల్ను ఉపయోగించి, కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్ తయారు చేస్తున్నారు. వైకుంఠపాళీ, అష్టాచెమ్మా, లూడో వంటి గేమ్ బోర్డులను సిల్వర్ ఫాయిల్తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. దేవతామూర్తులు, ఫోటో ఫ్రేమ్లు, వాల్ క్లాక్లు, వాల్ ఫ్రేమ్స్, హ్యాంగింగ్స్.. ప్రతీ డిజైన్ వెండివెన్నెలలా చూపరులను ఆకట్టుకునేలా డిజైన్ చేస్తూ, వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇద్దరూ దూరపు బంధువులు. వరసకు అక్కాచెలెళ్లు. ఇద్దరూ గృహిణులుగా తమ తమ ఇంటి బాధ్యతలను చక్కబెట్టుకుంటూ, పిల్లల పనులు చూసుకుంటున్నారు. ‘ఎన్ని పనులున్నా మనలోని అభిరుచికి మెరుగులు దిద్దుకోవాల్సింది మనమే. అందుకే, కొంత సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాం’ అని వివరించారు ఈ కజిన్స్. రోజూ ఎనిమిది గంటలు నిఖిత, అల్కా ఇద్దరూ బి.కామ్ డిగ్రీ పూర్తి చేశారు. ‘ఆసక్తి కొద్దీ ఆభరణాల తయారీ కోర్సు చేశాను’ అని చెప్పిన నిఖిత పదేళ్ల పాటు అందమైన ఆభరణాలను రూపుకట్టారు. ‘దాదాపు వందకు పైగా ఎగ్జిబిషన్లలో నా ఆభరణాలను ప్రదర్శించాను. కరోనా సమయంలో మాత్రం కొత్తగా ఆలోచించాలనుకున్నాను. ఇంటి నుంచే కొత్త వర్క్ తో నా ప్రెజెంటేషన్ ఉండాలనుకున్నాను. అప్పుడే సిల్వర్ ఫాయిల్ ఐడియా వచ్చింది. ఈ విషయాన్ని అల్కాతో చర్చించినప్పుడు మంచి ఆలోచన అంది. తంజావూర్ పెయింటింగ్స్లో గోల్డ్ ఫాయిల్ను ఉపయోగిస్తారు. అది ఖర్చుతో కూడుకున్నది కూడా. అందుకే మేం సిల్వర్ ఫాయిల్ గురించి ఆలోచించాం. దీంతో ఇద్దరం సిల్వర్ ఫాయిల్తో రకరకాల ఫ్రేమ్స్ తయారు చేశాం. వీటిని మిగతా వేటి వేటికి జత చేయచ్చో ఒక ప్లాన్ వేసుకున్నాం. కలపకు సిల్వర్ ఫాయిల్ను జత చేస్తూ చాలా ప్రయోగాలే చేశాం. జ్యువెలరీ బాక్సులు, వాచీలు, గేమ్ బోర్డులు.. ప్రతీది ప్రత్యేకం అనిపించేలా డిజైన్ చేశాం’ అని వివరించింది నిఖిత. ‘ఈ వర్క్ లో ఇద్దరం గంటల గంటల సమయం కేటాయించాం. అందుకు మా కుటుంబాలు కూడా సపోర్ట్గా ఉన్నాయి. ఫ్రేమ్స్కు నాలుగైదు రోజుల సమయం సరిపోతుంది. కానీ, గేమ్ బోర్డులకు పది నుంచి ఇరవై రోజులైనా సమయం పడుతుంది. దాదాపు రోజూ ఎనిమిది నుంచి పది గంటలైనా వీటి తయారీకి కేటాయిస్తాం’ అని తమ వర్క్ గురించి వివరించింది అల్కా. ప్రత్యేకమైన కానుకలు ‘మేం చేసే డిజైన్స్లో మరోదాన్ని పోలిన డిజైన్ ఉండదు. దేనికది ప్రత్యేకం. పెళ్లి్ల, పుట్టినరోజు, గృహప్రవేశాలు వంటి వేడుకలకు ఏదైనా కానుక తీసుకెళ్లాలనుకుంటారు. అదే సమయంలో కానుక తీసుకున్నవాళ్లు ఇంట్లో తీపి జ్ఞాపకంగా అలంకరించుకోవాలనుకుంటారు. ఎన్నేళ్లయినా ప్రత్యేకంగా ఉండే సిల్వర్ ఫాయిల్తో డిజైన్స్ తీసుకు రావాలనుకున్నాం. మేం ‘నకాషి’ పేరుతో మా బ్రాండ్ను పరిచయం చేస్తున్నాం. ఈ డిజైన్స్లో స్వరోస్కి, జెమ్స్ కూడా ఉపయోగిస్తాం. డిజైన్, సైజును బట్టి ధరలు ఉంటాయి. పెట్టుబడి ఇద్దరిది, రాబడి ఇద్దరిదీ’ అంటూ కలిసి పనిచేస్తే కలిగే లాభం గురించి, పంచుకున్న పని రోజుల గురించి ఆనందంగా తెలిపారు ఈ సిల్వర్ ఫాయిల్ సిస్టర్స్. – నిర్మలారెడ్డి -
స్కానింగ్కు ఫాయిల్తో చెక్!
- విదేశాల నుంచి పోస్టులో వస్తున్న డ్రగ్స్ - స్కానింగ్కు చిక్కకుండా సిల్వర్ ఫాయిల్స్లో ప్యాక్ - టాస్క్ఫోర్స్ దర్యాప్తులో వెలుగులోకి కీలకాంశాలు సాక్షి, హైదరాబాద్: టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేసిన డ్రగ్స్ గ్యాంగ్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. వంశీధర్కి ఎల్ఎస్డీ డ్రగ్ సరఫరా చేసిన మల్లికార్జున్రావు ఇప్పటి వరకు మూడుసార్లు డార్క్నెట్ వినియోగించి జర్మనీ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసినట్టు వెల్లడైంది. వర్చువల్ కరెన్సీ అయిన బిట్ కాయిన్స్ను ఆన్లైన్లో ఖరీదు చేసి వాటి ద్వారా డ్రగ్స్ ఆర్డర్ చేస్తున్నాడని తేలింది. బిట్ కాయిన్ విలువ ప్రస్తుతం భారత కరెన్సీలో రూ.1.65 లక్షలు ఉందని పోలీసులు చెప్తున్నారు. సిల్వర్ ఫాయిల్స్లో పార్శిల్.. ఆర్డర్లు తీసుకునే జర్మనీ, యూరోపియన్ దేశాల్లో ఉన్న డ్రగ్స్ సరఫరాదారులు వాటిని కొరియర్, పోస్టల్ ద్వారానే ఇక్కడకు పంపిస్తున్నారు. ఒక్కో దఫా గరిష్టంగా 200 గ్రాములు మాత్రమే ఖరీదు చేస్తుండటంతో ఆ మేరకు పార్శిల్ చేస్తున్నారు. ఎల్ఎస్డీ బిస్కెట్స్, ఎల్ ఎస్ఏ విత్తులతో ఇబ్బంది లేక పోయినా.. కొకైన్, ఎల్ఎస్డీ స్టాంపుల్ని విమానాశ్రయాల్లో స్కాన్ చేసినప్పుడు గుర్తించే ఆస్కారం ఉంది. ఈ నేపథ్యంలోనే స్కానింగ్కు చిక్కకుండా ఉండేందుకు వీటిని సిల్వర్ ఫాయిల్స్లో పార్శిల్ చేస్తున్నట్లు వెల్లడైంది. మల్లికార్జున్ వీటిని డెలివరీ చేయడానికి ఓ కిరాణా దుకాణం యజమాని చిరునామా ఇచ్చాడు. అభివన్కు సహకరించిన బాబీ.. డార్క్నెట్ ద్వారా అభినవ్ మహేందర్ కూడా డ్రగ్స్ ఖరీదు చేశాడు. ఈ వ్యవహారాల్లో ఇతడికి శశికాంత్ చర్ల అలియాస్ బాబీ సహాయకారిగా ఉన్నాడు. బాబీ చెరస్ అనే మాదక ద్రవ్యాన్నీ తీసుకువచ్చి అభినవ్కు అప్పగించేవాడు. హిమాచల్ప్రదేశ్లోని కస్సోల్ లో లభించే ఈ చెరస్ కోసం తరచు అక్కడకు వెళ్లేవాడు. ప్రస్తుతం అక్కడే ఉన్న ఇతడిని సిటీకి వచ్చిన తర్వాత అరెస్టు చేయాలని టాస్క్ఫోర్స్ పోలీసులు నిర్ణయించారు. మల్లికార్జున్, అభినవ్ నుంచి డ్రగ్స్ ఖరీదు చేసి విక్రయించే వంశీధర్ నిత్యం తన వెంట ఓ ఎయిర్గన్ ఉంచుకునేవాడు. డ్రగ్స్ క్రయవిక్రయాల దగ్గర ఎదుటి వారిని బెదిరించడానికి దీనిని వినియోగించే వాడని తేలింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన చికా 2012లో బిజినెస్ వీసాపై గోవా వచ్చాడు. ప్రస్తుతం అక్కడే వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. నైజీరియాకు లక్కీ 2014లో స్టూడెంట్ వీసాపై ముంబై వచ్చాడు. 2016 వరకు ఢిల్లీలోని ఛత్రపతి కాలేజ్లో బీఎస్సీ (పెట్రో కెమికల్స్) చేశాడు. ప్రస్తుతం మణికొండలో స్నేహితుడితో కలిసి నివసిస్తున్నాడు. చికా, లక్కీ ఇద్దరూ వీసా గడువు ముగిసినా భారత్లోనే ఉంటున్నట్లు గుర్తించారు. చికా గోవాతో పాటు ముంబై, హైదరాబాద్ల్లో తరచు సంచరిస్తూ పబ్స్, హోటల్స్, రెస్టారెంట్స్లో డ్రగ్స్ అమ్మే వాడని వెల్లడైంది.