breaking news
secret ballot
-
కొత్త పోప్ ఎవరో!
ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మంది క్యాథలిక్లకు అత్యున్నత మతాధికారిగా సేవలు అందించబోయే తదుపరి పోప్ ఎవరనే ఉత్కంఠ తీవ్రమైంది. దీనికి తెరదించడంలో భాగంగా కార్డినల్స్ బుధవారం వాటికన్ సిటీలో రహస్య ఓటింగ్కు సిద్ధమయ్యారు. అత్యధిక మెజారిటీ సాధించిన కార్డినల్కు పోప్ పదవి దక్కనుంది. 70 దేశాలకు చెందిన 133 మంది కార్డినళ్లు సిస్టిన్ ఛాపెల్లోకి వెళ్లి రహస్య ఓటింగ్లో పాల్గొనబోతున్నారు.మూడింట రెండొంతుల మెజారిటీ వచ్చిన వారే నూతన పోప్ అవుతారు. సిస్టిన్ ఛాపెల్లో ఏ కార్డినల్ ఎవరికి ఓటేశారనే విషయం పొరపాటున కూడా బయటకు పొక్కకుండా ఉండేందుకు వాటికన్ సిటీవ్యాప్తంగా అన్ని మొబైల్ఫోన్ల స్నిగల్స్ను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఆపేయనున్నారు. నాలుగున్నర గంటలకు కార్డినళ్లు అందరూ ఛాపెల్లోకి వెళ్లనున్నారు. వీళ్ల ఫోన్లు, అన్నిరకాల ఎలక్ట్రానిక్ ఉపకరణాలను అధికారులు తీసుకుని కొత్త పోప్ ఎన్నిక తర్వాతే తిరిగి అప్పగిస్తారు. అప్పటిదాకా కార్డినళ్లను ఛాపెల్ ప్రాంగణం బయటకు కూడా అనుమతించబోరు. కొత్త పోప్ ఎన్నికల వార్త వినేందుకు ప్రజలు, మీడియా ప్రతినిధులు వేచి ఉండే ‘సెయింట్ పీటర్ స్క్వేర్’ వద్ద మాత్రం మొబైల్ నెట్వర్క్ పనిచేయనుంది. రహస్య ప్రక్రియలో ఎవరు పోప్గా పోటీపడుతున్నారనే అంశంపై ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ప్రధానంగా ఐదారుగురి పేర్లు మాత్రమే వినవస్తున్నాయి. వాళ్ల గురించి క్లుప్తంగా...పియట్రో పరోలిన్70 ఏళ్ల ఇటలీ కార్డినల్ అయిన పియట్రో పరోలిన్ మిగతా వాళ్లతో పోలిస్తే పోటీలో ముందంజలో ఉన్నారు. గత పోప్ ఫ్రాన్సిస్ హయాంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్కు ప్రధాన సలహాదారుగా ఉంటూ ఇప్పటికే ఈయన డిప్యూటీ పోప్గా అందరికీ చిరపరిచితులు. క్యాథలిక్ల పాత సిద్ధాంతాల పరిరక్షణకంటే దౌత్యం, ప్రపంచవ్యాప్తంగా పోప్ ప్రతిష్టను ఇనుమడింపజేయడం మీదనే ఈయన ప్రధానంగా దృష్టిపెడతారనే వాదన ఉంది. గత 266 మంది పోప్లలో 213 మంది ఇటలీ దేశస్తులే. గత 40 ఏళ్లుగా ఇటలీవ్యక్తి పోప్ పదవిని అధిరోహించలేదు. ఈ లెక్కన ఈసారి ఇటలీ వర్గం ఈయనకు అత్యధిక మద్దతిచ్చే అవకాశముంది.లూయిస్ ఆంటోనియోగోకెమ్ ట్యాగిల్67 ఏళ్ల ట్యాగిల్ ఫిలిప్పీన్స్ దేశస్తుడు. మిగతా వాళ్లతో పోలిస్తే ఈయన చాలా సంవత్సరాలుగా పాస్టర్గా కొనసాగి కార్డినల్ అయ్యారు. వాటికన్ తరఫున దౌత్యవేత్తగా, చర్చి చట్టాలను కఠినంగా అమలుచేసే కార్డినళ్లతో పోలిస్తే ఈయన భిన్నమైన వ్యక్తి. ఈయన స్వదేశం ఫిలిప్పీన్స్లో 80 శాతం జనాభా క్యాథలిక్లే. పైగా కార్డినళ్లలో ఐదుగురు ఫిలిప్పీన్ దేశస్తులున్నారు. దీంతో ఈయనకు సైతం మద్దతు పలికే లాబీ బలంగా ఉందని వార్తలొస్తున్నాయి.రాబర్ట్ ప్రివోస్ట్69 ఏళ్ల ప్రివోస్ట్ స్వస్థలం అమెరికాలోని షికాగో. రెండేళ్ల క్రితం తదుపరి బిషప్ల ఎన్నికల బాధ్యతలను ఇటీవల మార్క్ ఆలెట్ను పక్కనబెట్టిమరీ ప్రివోస్ట్కు పోప్ ఫ్రాన్సిస్ కట్టబెట్టారు. ఇలా ఫ్రాన్సిస్ నుంచి మన్ననలు పొందారు. పోప్గా ఎన్నికైతే ఆ పీఠాన్ని అధిరోహించిన తొలి అమెరికన్ కార్డినల్గా చరిత్రకెక్కుతారు.పీటర్ కోడ్వో టర్క్సన్76 ఏళ్ల టర్క్సన్ ఘనా దేశానికి చెందిన కార్డినల్. 22 ఏళ్ల క్రితం ఘనా నుంచి కార్డినల్ అయిన తొలి వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు. గత 1,500 ఏళ్లలో ఆఫ్రికా ఖండం నుంచి ఎవరూ పోప్ బాధ్యతలు చేపట్టలేదు. ఈసారి ఈయనకు సైతం గెలుపు అవకాశాలున్నట్టు తెలుస్తోంది. స్వలింగ సంబంధాలను నేరంగా చూడకూడదని ఆయన వాదించేవారు. యూరప్లో ఇస్లాం మతవ్యాప్తి పెరగొచ్చని గతంలో ఆందోళన వ్యక్తం చేశారు.మారియో గ్రెక్68 ఏళ్ల మారియో మాల్టా దేశానికి చెందిన వ్యక్తి. క్యాథలిక్లలో అందరితో కలుపుకొని పోయే కార్డినల్కు అవకాశం ఇవ్వాలని భావిస్తే మొట్టమొదట వినిపించేది ఈయన పేరే. పోప్కు సలహాలు, సూచనలు ఇచ్చే సంఘమైన బిషప్ సైనోడ్కు ఆరేళ్ల క్రితమే ఈయన ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. అందరి సమ్మతితో నిర్ణయాలు తీసుకోవాలనేది ఈయన ఆలోచన.ఫ్రిడోలిన్ ఆంబోంగో బెసుంగీ65 ఏళ్ల ఫ్రిడోలిన్ ఆఫ్రికాలోని కాంగో దేశానికి చెందిన వ్యక్తి. ఆఫ్రికా నుంచి ఏటా లక్షల సంఖ్యలో క్రైస్తవ మతంలోకి మారుతున్న నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఫ్రిడోలిన్కు సైతం మెండుగా ఉన్నట్లు సమాచారం. ఏడేళ్లు కిన్షారా ఆర్చ్బిషప్గా ఉన్న ఈయనను పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్గా ఎంపికచేశారు. పాత సాంప్రదాయాలకు ఈయన పట్టంకడతారు. స్వలింగ వివాహాలకు ఈయన బద్ద వ్యతిరేకి. ‘‘ క్రైస్తవుల్లో ప్రొటెస్టాంట్లను ప్రొటెస్టెంట్లుగానే ఉండనిద్దాం. ఇక ముస్లింను ముస్లింగానే బతకనిద్దాం’’ అని గతంలో వ్యాఖ్యానించారు. ఈయన వ్యాఖ్యలు క్రైస్తవాన్ని బోధించే మతప్రచారకులకు ఇబ్బందికరంగా మారాయి.పీటర్ ఎర్డో72 ఏళ్ల ఎర్డో హంగేరీ దేశానికి చెందిన కార్డినల్. గత 21 ఏళ్లుగా కార్డినల్గా కొనసాగుతూ యూరప్లో చర్చి వర్గాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా ఎదిగారు. 2006 నుంచి పదేళ్లపాటు యూరోపియన్ బిషప్ల మండలి సమావేశాలను విజయవంతంగా నిర్వహించారు. తొలుత బుడాపెస్ట్ ఆర్చ్బిషప్గా పనిచేశారు. అటు ఆఫ్రికన్ కార్డినళ్లతో, ఇటు యూరప్ కార్డినళ్లతో సత్సంబంధాలున్నాయి. పోప్ పదవికి గట్టి పోటీ ఇచ్చే వీలుంది. – సాక్షి, నేషనల్ డెస్క్పోప్ ఫ్రాన్సిస్, ఆయనకు ముందు పోప్గా ఉన్న బెనెడిక్ట్–16లను పోప్ పదవికి ఎన్నుకోవడానికి కార్డినళ్లకు కేవలం రెండు రోజుల సమయం పట్టింది. అయితే 1268 సంవత్సరంలో ఈ ప్రక్రియ ఎంతకీ తెమల్లేదు. దీంతో ఏకంగా 1,006 రోజులపాటు ఓటింగ్ జరిగి ఎట్టకేలకు 1271 సంవత్సరంలో పోప్ను ఎన్నుకున్నారు. చరిత్రలో అత్యంత సుదీర్ఘకాల ఎన్నిక ప్రక్రియ ఇదే. -
మే 7న నూతన పోప్ ఎన్నిక
వాటికన్ సిటీ: నూతన పోప్ ఎన్నిక ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. మే 7వ తేదీన వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్లో జరిగే కార్యక్రమంలో రహస్య ఓటింగ్ జరగనుంది. ప్రపంచ దేశాల నుంచి తరలిరానున్న సుమారు 135 కార్డినల్స్ ఈ ప్రక్రియలో భాగస్వాములు కానున్నారు. దాదాపు 12 ఏళ్లపాటు కేథలిక్కుల మత పెద్దగా కొనసాగిన పోప్ ఫ్రాన్సిస్ ఈ నెల 21వ తేదీన కన్నుమూయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. పోప్ ఎన్నిక ప్రక్రియ ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయంలో స్పష్టత లేదు. గతంలో 2005, 2013ల్లో రెండు రోజుల వ్యవధిలోనే తదుపరి పోప్ ఎవరనే విషయం తేలిపోయింది. మే 7వ తేదీన కార్డినల్స్ ముందుగా సెయింట్ పీటర్స్ బసిలికాలో జరిగే సామూహిక ప్రార్థనల్లో పాల్గొంటారని, అనంతరం ఓటింగ్కు అర్హులైన వారంతా సిస్టిన్ చాపెల్ రహస్య విధానంలో జరిగే ఓటింగ్లో పాల్గొంటారని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రునీ చెప్పారు. లోపలికి వెళ్లిన వారికి నూతన పోప్ ఎన్నికయ్యే వరకు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధాలుండవు. మొదటి రోజు మధ్యాహ్నం జరిగే ఓటింగ్లో కార్డినల్స్ ఒకే ఒక్కసారి ఓటేస్తారు. ఫలితం తేలకుంటే తర్వాత రోజుల్లో నాలుగుసార్లు చొప్పున ఓటేయాల్సి ఉంటుంది. మూడింట రెండొంతుల మెజారిటీ ఓట్లు సాధించిన వారే నూతన పోప్ అవుతారు. ఇందుకు కొంత సమయం పడుతుంది. మూడో రోజూ ఫలితం తేలకుంటే ప్రార్థనల కోసం విరామమిచ్చి మరోసారి ఓటింగ్ ప్రక్రియ చేపడతారు. ఎన్నిక నేపథ్యంలో సోమవారం పర్యాటకులను బయటకు పంపించేసి వాటికన్ అధికారులు సిస్టిన్ చాపెల్కు తాళాలు వేశారు. -
భద్రతా మండలికి పాక్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి శాశ్వతేతర సభ్య దేశాల కోటాలో 5 దేశాలు ఎన్నికయ్యాయి. అవి..పాకిస్తాన్, పనామా, సొమాలియా, డెన్మార్క్, గ్రీస్. ఐరాస జనరల్ అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ విధానంలో గురువారం జరిగిన ఎన్నికలో ఆఫ్రికా, ఆసి యా–పసిఫిక్ ప్రాంతాలకుగాను సొమా లియా, పాకిస్తాన్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాలకుగాను పనామా, పశ్చిమ యూరప్, ఇతర దేశాలకుగాను డెన్మార్క్, గ్రీస్లు అత్యధిక ఓట్లు సంపాదించాయి. 2025 జనవరి నుంచి రెండేళ్ల పాటు 2026 డిసెంబర్ 31వ తేదీ వరకు ఇవి శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి. -
ఐరాసలో రష్యాకు భారత్ షాక్!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో భారత్ తన మిత్రదేశం రష్యాకు షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ భూభాగంలోని నాలుగు ప్రాంతాలను చట్టవిరుద్ధంగా ఆక్రమించడాన్ని ఖండించే ముసాయిదా తీర్మానంపై.. రష్యా రహస్య బ్యాలెట్ కోసం డిమాండ్ చేసింది. అయితే.. రష్యా చేసిన డిమాండ్ను తిరస్కరిస్తూ భారత్ ఓటు వేసింది. ఆల్బేనియా తీసుకొచ్చిన ఈ డ్రాఫ్ట్ రెజల్యూషన్పై ఓటింగ్ విషయంలో పునరాలోచించాలని రష్యా.. ఐరాస సాధారణ అసెంబ్లీని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో తీర్మానంపై ఓటింగ్ రహస్య బ్యాలెట్తో జరగాలా? బహిరంగంగా జరగాలా? అనే విషయంపై సోమవారం ఓటింగ్ నిర్వహించింది జనరల్ అసెంబ్లీ. రహస్య ఓటింగ్కు రష్యా పట్టుబట్టగా.. ఓటింగ్లో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. మొత్తం 107 మంది సభ్యులున్న సాధారణ అసెంబ్లీలో.. పదమూడు దేశాలు మాత్రమే రష్యాకు అనుకూలంగా ఓటేశాయి. మరో 39 దేశాలు (రష్యా, చైనా సహా) ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. రష్యా విజ్ఞప్తి మేరకు.. ఈ ఓటింగ్ నమోదు చేయబడింది. ఇందులో.. మాస్కో చేసిన సవాలుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వంద దేశాలలో భారతదేశం ఒకటి అని యూఎన్జీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఓటింగ్ అనంతరం రష్యా శాశ్వత ప్రతినిధి వాసిలీ నెబెంజియా మాట్లాడుతూ.. UN సభ్యత్వం ఒక దారుణమైన మోసానికి సాక్ష్యంగా మారిందని, ఈ మోసంలో దురదృష్టవశాత్తు జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు కీలక పాత్ర పోషించారు అని ఆరోపించారు. UN జనరల్ అసెంబ్లీ తీర్మానం ముసాయిదా ప్రకారం.. రష్యా తన బలగాలను ఉక్రెయిన్ నుంచి, యుద్ధంలో దెబ్బతిన్న దేశం అంతర్జాతీయ సరిహద్దుల నుంచి వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉక్రెయిన్పై తన ప్రకోపరహిత దూకుడు యుద్ధాన్ని నిలిపివేయాలి. అలాగే.. రష్యా చర్యను గుర్తించవద్దని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ఘాటిస్తుందని తెలిపింది. బుధవారంగానీ, గురువారంగానీ ఈ తీర్మానంపై బహిరంగ ఓటింగ్ జరగనుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని లుగన్స్క్, డోనెట్స్క్, ఖేర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల్ని రష్యా తనలో అధికారికంగా విలీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యా తీరును ఖండించాయి. రష్యా రిఫరెండం చట్టవిరుద్ధంగా పేర్కొంటూ అమెరికా-ఆల్బేనియాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా.. భారత్ ఆ ఓటింగ్కు దూరంగా ఉంది. పైగా రష్యా వీటో జారీ చేయడంతో.. ఆ తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలోనే ఐరాస సాధారణ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది ఆల్బేనియా. ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణ/రష్యా మిలిటరీ చర్య విషయంలో మొదటి నుంచి తటస్థ స్థితిని అవలంభిస్తోంది భారత్. శాంతి చర్చల ద్వారానే సమస్యకు ఓ పరిష్కారం లభిస్తుందని చెబుతూ వస్తోంది. అయితే తాజాగా ఉక్రెయిన్పై క్షిపణుల దాడులు పెరిగిపోతుండడంతో ఆందోళన సైతం వ్యక్తం చేసింది భారత్. పరిస్థితి మామూలు స్థితికి చేరేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో రెండురోజుల్లో జరగబోయే కీలక ఓటింగ్లో తటస్థ వైఖరినే అవలంభిస్తుందా? లేదంటే ఇప్పుడు బహిరంగ ఓటింగ్కు మొగ్గుచూపినట్లే కీలక ఓటింగ్ రష్యాకు ఝలక్ ఇస్తుందా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే!. -
భద్రతామండలికి ఐదు దేశాలు ఏకగ్రీవ ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలో శక్తివంతమై న భద్రతామండలికి శుక్రవారం బ్రెజిల్, యూఏఈ, అల్బేనియా, ఘనా, గబాన్ దేశాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 15 మంది సభ్యులుండే మండలిలో చోటు సంపాదించడం చాలా దేశాలు ఒక మహదవకాశంగా భావిస్తాయి. సిరియా, యెమెన్, మాలి, మయన్మార్ దేశాల్లో సంక్షోభాలు మొదలుకొని.. ఉత్తరకొరియా, ఇరాన్ల అణ్వాయుధ ముప్పు, ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), అల్ ఖాయిదా వంటి ఉగ్ర సంస్థల దాడులు దాకా అనేక అంశాలపై తమ వాణిని బలంగా వినిపించేందుకు మండలి ముఖ్య వేదిక కావడమే ఇందుకు కారణం. ఆల్బేనియాకు మండలిలో చోటు లభించడం ఇదే మొదటిసారి కాగా, బ్రెజిల్కు ఇది 11వ సారి. రహస్య బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల ఫలితాలను జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ వొల్కన్ బొజ్కిర్ ప్రకటించారు. మండలిలోని 15 సభ్య దేశాల్లో వీటో అధికారం ఉన్న అమెరికా, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్సులతోపాటు 10 తాత్కాలిక సభ్య దేశాలుంటాయి. -
ఆర్టీసీ ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్
- ఫిబ్రవరి 9న తుది ఓటరు జాబితా.. -18న పోలింగ్, కౌంటింగ్ - మార్చి 4న అధికారికంగా ఫలితాలు వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరగనుంది. ఒక్కో ఓటరు రెండు ఓట్లు వేయనున్నారు. తెల్ల రంగు బ్యాలెట్(క్లాజ్ 3) రాష్ట గుర్తింపునకు, గులాబి రంగు బ్యాలెట్(క్లాజ్ 6) జిల్లా గుర్తింపునకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన మార్గదర్శకాలను కార్మిక శాఖ ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 13జిల్లాల్లోను ప్రస్తుతం ఉన్న 57,800ఓటర్లకు సంబంధించిన జాబితాలను ఈ నెల 29న అన్ని డిపోల్లోను ముసాయిదా ఓటరు జాబితాలను ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు దానికి సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 6వ తేదీన అభ్యంతరాల పరిశీలన చేస్తారు. బదిలీలు, పదవి విరమణ, వృతులకు సంబంధించిన ఓట్లను తొలగింపులు, చేర్పులు, మార్పులు చేసి ఫిబ్రవరి 9న తుది ఓటరు జాబితాలను ఆర్టీసీ డిపోల వారీగా ప్రకటిస్తారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ మొత్తం కార్మిక శాఖ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. ఎన్నికల సిబ్బందికి, సామాగ్రి చేరవేతకు ఆర్టీసీ బస్సులను సమకూర్చాల్సి ఉంటుంది. ఆయా డిపోల పరిధిలోని డిపో మేనేజర్లు ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 18న ఉదయం 5గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు డిపోలవారీగా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 6గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నేరుగా ఓటు హక్కు వినియోగించుకోలేని పోలింగ్ సిబ్బంది, ఆఫీసు సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు ఫిబ్రవరి 23, 24తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ను అందజేయవచ్చు. ఆ రెండు రోజుల్లోను ఏ రోజు వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను అదే రోజు లెక్కిస్తారు. పోలింగ్ రోజునే ఓట్ల లెక్కింపుతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు సంఘం ఏమిటన్నది తేలిపోనుంది. అయితే మార్చి 4 ఉదయం 11గంటలకు గుర్తింపు సంఘం ఏమిటన్నది అధికారికంగా ప్రకటించనున్నారు. -
ఎలక్టోరల్ రూల్స్ సవరించండి: ఈసీ
న్యూఢిల్లీ: ఓట్ల లెక్కింపు సమయంలో ఓటింగ్ సరళిని వెల్లడించేలా ఉన్న ప్రస్తుత పద్ధతిని మార్చాలని, రహస్య ఓటింగ్ ప్రక్రియను కాపాడేలా కొత్త పరికరాన్ని వినియోగించేలా ఎన్నికల నియమావళికి సవరణలు చేయాలని కేంద్రాన్ని ఎన్నికల సంఘం కోరింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. పోలింగ్ స్టేషన్లవారీగా ఈవీఎంల్లో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారని, దీని వల్ల వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి అందరికీ తెలిసిపోతోందని, దీనివల్ల ఓటర్లు బెదిరింపులు, దాడులు, వివక్ష కు గురవుతున్నారని పేర్కొంది. అందువల్ల ఒక్కో ఈవీఎంను విడివిడిగా కాకుండా 14 ఈవీఎంల్లోని ఓట్లను ఒకేసారి లెక్కించే ‘టోటలైజర్’ పరికరాన్ని వారడాలంది. ఎన్నికల్లో పార్టీల వార్తలను ఆమోదించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ఈసీ ప్రసార భారతిని కోరింది. బిహార్ ఎన్నికల సమయంలో వచ్చిన ఫిర్యాదుపై ఈసీ ఈ విధంగా స్పందించింది. -
రహస్య బ్యాలెట్
సీఎం ఎన్నికకు బీజేపీ ప్రతిపాదన న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు విషయమై బీజేపీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. రహస్య బ్యాలెట్ విధానం ద్వారా ముఖ్యమంత్రిని ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని ఎల్జీని కోరాలని భావిస్తోంది. జాతీయ ప్రాదేశిక ప్రాంత చట్టం, 1991లో అందుకు అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. చట్టంలోని సెక్షన్ 9(2) ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో రహస్య ఓటింగ్ నిర్వహించాలి. అందులో ఎక్కువమంది అభ్యర్థులు బలపర్చిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చు. ఇప్పటిదాకా బిల్లును ఆమోదించే విషయంలోనే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. అయితే ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు కూడా ఈవిధానాన్ని అనుసరించవచ్చు. ముఖ్యమంత్రిని ఎన్నుకున్న తర్వాత సభలో అత్యధిక మెజార్టీ ఉన్న పార్టీ అధికారపక్షం, ఆ తర్వాత ఎక్కువ మంది సభ్యులున్న పార్టీ ప్రతిపక్షం అవుతుంది. అయితే ఈ చట్టం ప్రకారం పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఉండదు. అంతేకాక ఏ అభ్యర్థి ముఖ్యమంత్రిగా ఎవరిని బలపర్చారో కూడా తెలిసే అవకాశం లేదు. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు సమస్యను పరిష్కరించాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ ఉపాధ్యాయ్ డిమాండ్ చేస్తున్నారు. అలాకాకుండా అసెంబ్లీలో మెజార్టీ సభ్యులున్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినా తమకేమీ అభ్యంతరం లేదని సతీశ్ స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉందని, ఈ మూడు ప్రతిపాదనల్లో తాము దేనినైనా అంగీకరిస్తామని ఉపాధ్యాయ్ తెలిపారు. కాగా బీజేపీ చేసిన ఈ డిమాండ్పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. రహస్య ఓటింగ్ నిర్వహించడమంటే బేరసారాలకు బహిరంగంగా తలుపులు తెరిచినట్లేనని పేర్కొంటున్నారు. -
మా వయస్సు.. మీ ఓటు!
పదవీ కాలాన్ని పొడిగించుకొనేందుకు కొందరు నిమ్స్ వైద్యుల ఎత్తుగడ శుక్రవారమే ప్రారంభమైన రహస్య బ్యాలెట్ డైరెక్టర్ అనుమతితోనే జరుగుతున్న బాగోతం.. నిబంధనలకు నీళ్లు మీ సేవలు చాలు.. వెళ్లిపోమ్మంటున్న జూనియర్ ఫ్యాకల్టీలు సాక్షి, హైదరాబాద్: సాధారణంగా రిటైర్మెంట్ వయస్సు సమీపించిన ఉద్యోగుల పదవీ కాలాన్ని పొడిగించుకోవాలంటే.. వయసు నిబంధనను సవరించాలి. అందులోనూ ఆ పని చేయాల్సింది ప్రభుత్వమే. కానీ నిమ్స్లో మాత్రం దీనంతటికీ నీళ్లోదిలేశారు. నిమ్స్లో 62 ఏళ్ల వయసు దాటితే పదవీ విరమణ చేయాలి. కానీ, కొద్ది రోజుల్లో పదవీ విరమణ చేయాల్సిన పలువురు వైద్యులు మళ్లీ పదవిలో కొనసాగడానికి రహస్య బ్యాలెట్ విధానానికి పూనుకున్నారు. అందుకు డెరైక్టర్నూ ఒప్పించారు. ఈ మేరకు వైద్యులందరూ రహస్య బ్యాలెట్ పద్ధతిలో పాల్గొనాలంటూ శుక్రవారం నిమ్స్ వైద్యులందరికీ డీన్ నుంచి ఓ ఈ-మెయిల్ సందేశం వచ్చింది. ఒక్కసారిగా వచ్చిన ఈ సందేశంతో వైద్యులు కంగుతిన్నారు. అసలు ఆ బ్యాలెట్లో మూడు ఆప్షన్లు ఇచ్చారు. ఒకటో ఆప్షన్లో.. ‘మీ పదోన్నతులకు అడ్డుకాము. శస్త్రచికిత్సలు మీ ఇష్టమొచ్చినట్టే చేసుకోవచ్చు. విభాగాధిపతి పోస్టులను రొటేషన్ పద్ధతిలో ఇస్తాం. 65 ఏళ్ల వయసుకు ఓటేస్తున్నాం’ అని... రెండో ఆప్షన్లో ‘ఒప్పుకొనేది లేదు’ అని... మూడో ఆప్షన్లో ‘మేము నిర్ణయించుకోలేం. తటస్థంగా ఉంటాం’ అని పెట్టారు. ఈ రహస్య బ్యాలెట్లో శుక్రవారం కొంతమంది వైద్యులు ఓటేశారు కూడా. శనివారం సాయంత్రం వరకూ ఈ ఓటింగ్ కొనసాగనుంది. అయితే, నిమ్స్లో 140 మందికి పైగా ఫ్యాకల్టీ సభ్యులుండగా.. 70 శాతం మంది వయస్సు పెంపును వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ‘మిమ్మల్ని భరించలేం, మీరు చేసిన సేవలు చాలు. ఇక వెళ్లిపోండి’ అంటూ కొంతమంది బ్యాలెట్లో రాసినట్టు నిమ్స్ వర్గాల సమాచారం. నిమ్స్ చరిత్రలో ఇలాంటి తిరకాసు నిర్ణయాలు లేవని, వయసు దాటాక కూడా ఇదేం పరిస్థితి అని పలువురు వైద్యులు విమర్శిస్తున్నారు. కొత్తగా వచ్చిన డెరైక్టర్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలపై మండిపడుతున్నారు. కాగా.. వైద్యుల్లో వీబీఎన్ ప్రసాద్, జగన్మోహన్రావు, పీవీఎల్ఎన్ మూర్తి, ముకుందరెడ్డి, పీవీ రావు తదితరులు కొద్ది రోజుల్లో పదవీవిరమణ చేయనున్నారు.