అదితిరావుకు పెళ్లైంది తెలుసా?
మణిరత్నం దర్శకత్వంలో కార్తీకి జంటగా నటించే అవకాశం రావడంతో బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైదరి దక్షిణాదిలో పాపులర్ అయ్యింది. అయితే చాలా కాలం క్రితమే సింగారం చిత్రంలో నటించింది. ప్రస్తుతం హిందీలో బిజీనాయకిగా రాణిస్తున్న అదితిరావు తన వ్యక్తిగత జీవితాన్ని చాలా గోప్యంగా ఉంచుకుంది. ఈ అమ్మడికి ఎనిమిదేళ్ల క్రితమే పెళ్లి అయ్యిందన్నది. ఈ విషయం ఎందరికి తెలుసో గానీ ఆ తరువాత భర్తకు విడాకులు కూడా ఇచ్చేసింది.
భరత నాట్యంలో ప్రావీణ్యం పొందిన అదితిరావు నటిగా వెండితెరకు పరిచయం అయిన తరువాత బాలీవుడ్ నటుడు సత్యదీప్ మిశ్రాను 2009లో పెళ్లి చేసుకుంది. మూగజీవులంటే ఇష్టపడే సత్యదీప్ మిశ్రా పిల్లులు, కుక్కలను పెంచుతున్నాడు. ఆయన ఇన్కంటాక్స్ రంగంలో అసిస్టెంట్ కమిషనర్గా పని చేశారట. ఆ తరువాత నటుడిగా మారాడు.
కాగా కొంత కాలం సజావుగా సాగిన సత్యదీప్ మిశ్రా, అదితిరవుల సంసార జీవితం మనస్పర్థలతో విడిపోయే పరిస్థితి ఏర్పడింది. అది విడాకుల వరకూ దారి తీసింది. 2013లో సత్యదీప్ నుంచి అదితిరావు విడాకులు పొందింది. అదితిరావు నటించిన కాట్రువెలియిడై చిత్రం శుక్రవారం తెరపైకి రానుండగా హిందీలో సంజయ్దత్ కూతురుగా భూమి చిత్రంలోనూ, సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో పద్మావతి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది.