breaking news
Sanjay Puri
-
ఐటీసీ కొనుగోళ్ల వేట
న్యూఢిల్లీ: ఐటీసీ లిమిటెడ్ భవిష్యత్తు వృద్ధి మార్గాలపై దృష్టి పెట్టింది. ఆకర్షణీయమైన అవకాశాలను సొంతం చేసుకోవడంతోపాటు.. ‘ఐటీసీ నెక్ట్స్’ వ్యూహంలో భాగంగా సామర్థ్య విస్తరణకు రెండు బిలియన్ డాలర్లు (సుమారు రూ.15వేల కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించింది. వర్చువల్గా నిర్వహించిన మీడియా సమావేశంలో భాగంగా ఐటీసీ చైర్మన్ సంజీవ్ పురి ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా కొనుగోళ్లనూ పరిశీలిస్తామని చెప్పారు. కాకపోతే కొనుగోళ్లకు చేసే ఖర్చు ప్రతిపాదిత పెట్టుబడులకు అదనంగా ఉంటుందని స్పష్టం చేశారు. డిమాండ్ను చేరుకునేందుకు, పోటీతత్వంతో కొనసాగేందుకు, టెక్నాలజీ, నాణ్యతను పెంచుకునేందుకు అదనపు పెట్టుబడుల అవసరాన్ని ప్రస్తావించారు. వృద్ధికి మార్గాలను గుర్తించినట్టు చెప్పారు. కొత్త మార్గాలు..: ‘భవిష్యత్తు వినియోగ ధోరణులను గుర్తించాం. ఈ దిశగా ఏదైనా అవకాశం కనిపిస్తే.. అది మాకు విలువను తెచ్చిపెడుతుందని భావిస్తే ముందుకు వెళతాం (కొనుగోళ్లు). మధ్య కాలానికి దృష్టి సారిస్తూ.. అందులో భాగంగా 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నాం. ఒక విభాగంలో సామర్థ్య వినియోగం గరిష్ట స్థాయికి చేరినప్పుడు అదనపు సామర్థ్యాన్ని ఏర్పాటు చే స్తాం. ఎప్పటికప్పుడు నాణ్యతను పెంచుకోవ డ మూ అవసరమే. ఇందుకు సంబంధించి సాంకేతికతను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయం (పేపర్), సూపర్ యాప్, ఐటీసీ మార్స్ (చిన్న రైతుల సామర్థ్య పెంపునకు సంబంధించి) అన్నవి కొత్త వృద్ధి విభా గాలు అవుతాయి’ అని సంజీవ్పురి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో స్పైస్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మసాలా దినుసుల ప్లాంట్ను ఐటీసీ ఏర్పాటు చేయనుంది. దేశీయ, ఎగుమతి మార్కెట్ల అవసరాలను తీర్చేందుకు ఈ ప్లాంట్ను వినియోగించనున్నట్టు పురి ప్రకటించారు. ఐపీఎం సర్టిఫైడ్ ఆహార, మసాల ఉత్పత్తులను తయారు చేయనున్నట్టు తెలిపారు. ఇతర దేశాల కఠినమైన నిబంధనలను అందుకునేలా ఈ ఉత్పత్తులు ఉంటాయన్నారు. -
ఎన్నికల వేళ ఆప్కు ఊపు
న్యూఢిల్లీ: కీలక నేత లు పార్టీని వీడుతుండటంతో ఆత్మరక్షణలో పడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి గురువారం కాస్త ఊరట లభించింది. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన ఢిల్లీ పీసీసీ కంప్యూటర్, రీసెర్చ్ విభాగాధిపతి సంజయ్ పూరి ‘ఆప్’లో చేరారు. 30 ఏళ్ల పాటు కాంగ్రెస్లో కొనసాగిన పూరి... ఢిల్లీ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి నీనా కపూర్ , జనక్పురి నియోజకవర్గ ప్రజలతో కలసి ఆప్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే బీజేపీ, బీఎస్పీల నుంచి ఒక్కో కౌన్సిలర్లు కూడా ఆప్ చెంతకు చేరారు. వీరిని ఆప్ సీనియర్ నాయకుడు సంజయ్ సింగ్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింగ్ మాట్లాడుతూ కొత్తగా చేరిన వారితో పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడిందని అభిప్రాయపడ్డారు. బీజేపీ కంటే తమ పార్టీకే ఎన్నికల్లో విజయావకాశాలున్నట్లు విశ్లేషించారు. తాజా ఆప్ నేత పూరి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ రంగాల్లో విఫలమైందని విమర్శించారు. తనకు టికెట్ నిరాకరించినందువల్లనే ఆ పార్టీని తప్పుపట్టడం లేదని స్పష్టం చేశారు. విద్యుత్ చార్జీల త గ్గింపు, నిత్యావసర ధరల నియంత్రణలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. టికెట్ ఆశించి భంగపడ్డ పూరి ప్రస్తుత ఎన్నికల్లో జనక్ పురి నియోజకవర్గలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన సంజయ్కు భంగపాటు ఎదురైంది. దీంతో అసంతృప్తి చెందిన ఆయన పార్టీ నుంచి ఇటీవలే బయటికొచ్చారు. ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్న సంజయ్ అనూహ్యంగా ఆప్ కండువా కప్పుకున్నారు. పూరి... కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ స్థాయిలో పనిచేశారు.