breaking news
revenge on women
-
ఒక్క కన్నీటి బొట్టు
ఇద్దరూ ప్రేమించుకున్నారు. బ్రేకప్ అయి ‘ఇద్దరు’గా మిగిలారు. అమ్మాయి ఏడ్చింది. అబ్బాయి ఏడ్వలేదనుకుంది. ‘నా కోసం ఒక్క కన్నీటి బొట్టు.. నీ దగ్గర లేదా’ అని అడిగింది. అతడి చేత కన్నీళ్లు పెట్టించడానికి.. ట్రక్కునిండా ప్రేమను పంపింది. ‘‘రెండు కళ్ల నుంచి కాదు సావిత్రి, ఒక కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి’’ అంటాడు క్రిష్. (డైరెక్టర్ కెవీ రెడ్డి ఆయన). ‘‘ఊ’’ అంటుంది కీర్తి సురేశ్. (నటి సావిత్రి ఆమె). మళ్లీ చెప్తాడు క్రిష్. ‘‘రెండు కళ్ల నుంచి కాదమ్మాయ్. ఒక కంటి నుంచి మాత్రమే కొన్ని కన్నీటి బొట్లు రావాలి’’ ‘‘ఊ’’ అని తల ఊపుతుంది. పాట మొదలౌతుంది. ‘నీ కోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’. కీర్తి సురేశ్కి ఒక కంటి నుంచి మాత్రమే కన్నీటి బొట్లు వచ్చేస్తాయి! రెండంటే రెండు బొట్లే అడిగి ఉంటాడు క్రిష్. రెండంటే రెండు బొట్లే రాలుస్తుంది కీర్తి సురేశ్. ‘మహానటి’లోని సన్నివేశం ఇది. (తెలంగాణలో కొత్తగా 27 కేసులు ) ∙∙ మిస్ ఝావో ఓ కుర్రాడిని ప్రేమించింది. అతడూ ఆమెను ప్రేమించాడు. ఇద్దరిదీ చైనా. జీబో అనే ప్రాంతంలో ఉంటారు. ఉండేది జీబోలోనే అయినా, ప్రేమ మొదలైనప్పట్నుంచీ ఒకరి మనసుల్లో ఒకరు ఉంటున్నారు. ఏడాది క్రితం ప్రేమలో పడ్డారు. ఈమధ్యే విడిపోయారు. బ్రేకప్ చెప్పేశాడు ఆ కుర్రాడు. ఝావో తట్టుకోలేకపోయింది. తల్లడిల్లిపోయింది. ‘నీకోసమే నే జీవించునది, ఈ విరహములో, ఈ నిరాశలో నీ కోసమే నే జీవించునది’ అని పాడుకుంది. అతడు పట్టించుకోలేదు. కాల్ చేయలేదు. కాల్ చేస్తే తియ్యలేదు. ఏడ్చింది. తన లెక్క ప్రకారం అతడూ ఏడుస్తూ ఉండాలి. కానీ అతడు ఏడ్వడం లేదని, హాయిగా ఉన్నాడని ఆమెకు తెలిసింది! అతడు ఏడుస్తూ లేకపోవడం చూసిన వారెవరో వచ్చి ఆమెకు చెప్తే తెలిసింది. ∙∙ ఝావో బాయ్ఫ్రెండ్ అప్పుడే నిద్ర లేచాడు. కళ్లు నలుముకుంటూ ముందు గదిలోకి వచ్చాడు. గది నిండా ఉల్లి సంచులు! వెయ్యి కిలోల ఉల్లిపాయలు. డెలివరీ బాయ్ ట్రక్కులో తీసుకొచ్చి అక్కడి దింపేసి వెళ్లిపోయాడు. సంచుల్లో చిన్న స్లిప్ ఉంది. ఆ స్లిప్లో ఎవరిదో చేతి రాత! ఎవరిదో ఏంటి.. తన గర్ల్ ఫ్రెండ్ ఝావోదే! అక్షరాలు పైకే కనిపిస్తున్నాయి. ‘‘నేను మూడు రోజులు ఏడ్చాను. ఇప్పుడు నీ వంతు’’ అని రాసి ఉంది! ‘తిక్క పిల్ల’ అనుకున్నాడు. ఈలోగా, ‘‘ఏంటి బాబూ, ఇన్ని ఎర్ర ఉల్లిపాయల సంచులూ’’ అని పక్కింటి వాళ్లొచ్చి అడిగారు. అప్పుడు ఏడ్చాడు ఆ కుర్రాడు. ‘‘నా ఫ్రెండే. ప్రతి దానికీ అతి చేస్తుంటుంది. అందుకే విడిపోయాం. విడిపోయినందుకు తను ఏడుస్తోందట. నన్నూ ఏడవమని ఈ ఉల్లిపాయల్ని పంపింది. బ్రేకప్ అయినప్పట్నుంచీ నేను ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదని నా ఫ్రెండ్స్ అందరితో చెబుతోందట! ఏడ్వనందుకు చెడ్డవాణ్ణి అయ్యాను’’ అని ఫీల్ అయ్యాడు. ఈ ఫీలింగేదో ఫోన్ చేసి ఆ పిల్ల దగ్గరే ఏడిస్తే హ్యాపీగా ఫీల్ అయి ఉండేది కదా పాపం. బ్రేకప్ అవడం అంటే మరింత దగ్గరవడం. ఉల్లి సంచుల్ని చూస్తూ తల పట్టుకున్న మిస్ ఝావో బాయ్ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ ఇంటికి మిస్ ఝావో డెలివరీ చేసిన ఉల్లిపాయలు -
మహిళలంటే అసహ్యంతో.. ప్రతీకారం
సవతి తల్లి దాష్టీకానికి విసుగెత్తిన ఓ పాకిస్తానీ యువకుడు క్రూరంగా మారాడు. ఆమెపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు రోడ్డుపై కనిపించిన మహిళలను కత్తిపోట్లకు గురిచేస్తూ దారుణ ఘటనలకు పాల్పడుతున్నాడు. ఈ ఏడాదిలో 17 మంది మహిళలను కత్తిపోట్లకు గురిచేయగా.. ఓ మహిళా మరణానికి కారణమైనట్టు గారిసన్ నగర రావల్పిండి పోలీసులు శుక్రవారం పేర్కొన్నారు. 22 ఏళ్ల మహ్మద్ అలీ, రోడ్లపై కనిపించిన మహిళలపై యాధృచ్చికంగా దాడులకు పాల్పడుతున్నట్టు పోలీసు ఇన్వెస్టిగేటర్ మాలిక్ జుల్ఫికర్ హుస్సేన్ తెలిపారు. మహిళలంటే అసహ్యంతోనే వారిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఈ ఘటనలకు పాల్పడుతున్నట్టు అలీ తన క్రూరత్మకాన్ని బయటపెట్టినట్టు హుస్సేన్ చెప్పారు. జనవరి నుంచి ఈ నెల వరకు 17 మంది మహిళలను కత్తిపోట్లతో తీవ్రంగా గాయపరిచినట్టు, ఈ దాడుల్లో ఒక నర్సు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. అలీ చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడంతో, అతని తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. సవతి తల్లిగా అలీ జీవితంలోకి వచ్చిన ఆమె, అతని తీవ్రంగా హింసించేది. ఆ దాష్టీక ఘటనలు భరించలేక అలీ క్రూరంగా మారాడు. సవతితల్లిపై హత్యాయత్నానికి కూడా పాల్పడాడు. అవకాశం చేజిక్కినప్పుడల్లా రోడ్డుపై కనిపించే మహిళలపై దాడులకు పాల్పడుతున్నాడని పోలీసు అధికారి హుస్సేన్ వెల్లడించారు. ఘటనలన్నీ రావల్పిండి వీధుల్లోనే జరిగాయని ఆయన వివరించారు. పరువు హత్యలపై, సాధారణ ప్రాంతాల్లో మహిళలపై జరిగే దాడులపై వ్యతిరేకంగా పాకిస్తాన్ మహిళలు తమ హక్కుల కోసం గతేళ్లుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.