breaking news
recrutiment
-
కారుణ్యం.. దారుణం..బట్టబయలు చేసిన మెటర్నిటీ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమనాలో..నిద్రమత్తు అనాలో కానీ..గుడ్డిగా వ్యవహరిస్తున్న తీరుకు ఇదో మచ్చు తునక. ఓ మహిళ తనకు వివాహం కాలేదని చెప్పి..ఏకంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆమె మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్మెంట్కు దరఖాస్తు చేసుకున్న సమయంలో ఈ అంశాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...ఆరోగ్యం–పారిశుధ్యం విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళాఉద్యోగి ఒకరు మెటర్నిటీ ఖర్చుల రీయింబర్స్మెంట్ నిమిత్తం చేసుకున్న దరఖాస్తును జీహెచ్ఎంసీలోని సంబంధిత అధికారులు వాటిని చెల్లించే రాష్ట్రస్థాయి వైద్య విభాగానికి పంపించారు. ఫైలును పరిశీలించిన సదరు విభాగం మెటర్నిటీ ప్రయోజనాలను రెండు కాన్పుల వరకు మాత్రమే పొందే అవకాశం ఉందని, ఆమెకది నాలుగో కాన్పు అయినందున నిధులివ్వడం కుదరదని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించినందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫైలును తిప్పి పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో..అసలు ఆమె ఉద్యోగంలో చేరడమే అక్రమ మార్గంలో చేరిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కారుణ్య నియామకం కింద రెండేళ్ల క్రితం ఉద్యోగంలో చేరిన ఆమె తనకు వివాహం కాలేదని పేర్కొంటూ ఉద్యోగం పొందినట్లు వినిపిస్తోంది. ఇప్పుడు మెటర్నీటీ ప్రయోజనం పొందేందుకు ఆస్పత్రి సేవల ఖర్చులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు జతచేయడంతో వాటిని పరిశీలించిన సంబంధిత విభాగం నాలుగోకాన్పుగా గుర్తించింది. కారుణ్య నియామకాలకు సంబంధించి కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు వారి సంతానంలో ఎవరో ఒకరికి ఉద్యోగం ఇవ్వవచ్చునని, అమ్మాయిలైతే వివాహం కాని వారికి వర్తిస్తుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మిగతా సంతతి నిరభ్యంతరం కూడా అందుకు అవసరం.ఈ నేపథ్యంలో అసలు ఆమె నియామకమే అక్రమంగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వ్యవహారంపై విజిలెన్స్ విభాగం ద్వారా విచారణ జరిపించేందుకు అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంధ పాలన ఎన్నాళ్లు..? ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీలోని ఉన్నతాధికారులు ఎన్నాళ్లు అంధ పాలన సాగిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి జీహెచ్ఎంసీకి డిప్యుటేషన్పై వచ్చి మూడేళ్లకు తిరిగి వెళ్లాల్సి ఉండగా, ఐదేళ్లు దాటినా.. ఆ తర్వాత సైతం జీహెచ్ఎంసీయే సొంత డిపార్ట్మెంట్లా పాతుకుపోయిన వారి విషయంలోనే ఏమీ చేయని ఉన్నతాధికారులు.. ఇతర విభాగాల్లోనూ వక్రమార్గాల్లో అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. (చదవండి: చితి మంటలకు చెల్లు! విదేశాల్లో ఉన్నవారు సైతం చూసేలా...) -
రాష్ట్రంలో 3,137 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 3,137 పోలీసు పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసినట్టు ఏపీ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్విశ్వజిత్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్ఎల్పిఆర్బి.ఎపి.జిఓవి.ఐఎన్ వెబ్సైట్లో అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఈ నెల 5 వ తేదీ నుంచి 24వ తేదీ లోగా, కానిస్టేబుల్, వార్డెన్, ఫైర్మెన్ పోస్టులకు ఈ నెల 12 నుంచి డిసెంబర్ 7 వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి వయస్సు ధృవీకరణ, విద్యార్హత, శరీర కొలతలకు సంబంధించి ధృవపత్రాలు దరఖాస్తుతోపాటు ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఐ, ఆర్ఎస్ఐ, ఫైర్ ఆఫీసర్, డిప్యూటీ జైలర్ పోస్టులకు ఓసీ, బీసీలు రూ.600, ఎస్సీ, ఎస్టీలు రూ.300 వంతున ఫీజు చెల్లించాలి. వీరికి డిసెంబర్ 16వ తేదీ ప్రాథమిక పరీక్ష ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్, వార్డర్, ఫైర్మెన్ పోస్టులకు ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ పోస్టులకు రూ.150 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. వీరికి 2019 జనవరి 6న ప్రాథమిక పరీక్ష ఉంటుంది. భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్ఐ(సివిల్) 150, ఆర్ఎస్ఐ(ఏఆర్) 75, ఆర్ఎస్ఐ(ఏపీఎస్పీ) 75, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 20, డిప్యూటీ జైలర్(మెన్) 10, డిప్యూటీ జైలర్(ఉమెన్) 4, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ 50, పోలీస్ కానిస్టేబుల్(సివిల్) 1600, కానిస్టేబుల్(ఏఆర్) 300, పోలీస్ కానిస్టేబుల్(ఏపీఎస్పీ) 300, వార్డర్(మేల్) 100, వార్డర్(ఉమెన్) 23, ఫైర్మెన్ 400, డ్రైవర్ ఆపరేటర్స్ 30 పోస్టులు ఉన్నాయి. -
నైపుణ్యమే నేటి అవసరం
కొత్త కోణం తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న రిక్రూట్మెంట్లో కనీసం ఒక్క శాతమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడంలేదు. రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువత దాదాపు కోటి అని అంచనా. ఈ జనాభాను ఏవిధమైన ఉపాధిరంగంలోకి తీసుకెళతారన్నది అక్కడి ప్రభుత్వం ఎక్కడా స్పష్టం చేయలేదు. తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో ‘‘జాబు రావాలంటే, బాబు రావాలి’’ అన్న నినాదాన్నిచ్చారు. బాబు వచ్చాడు కానీ జాబు మాత్రం రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానిగా అమరావతి నిర్మాణం, అభివృద్ధి అక్కడి బీదా బిక్కీ వేలాదిమందిని నిర్వాసితులను చేసింది. ఎందరో వ్యవసాయ కూలీలు, కార్మికులు, వారి కుటుంబాలు దిక్కులేని వారయ్యారు. అలా కొలువూ, నెలవూ కోల్పోయిన 15 వేల మందికి వివిధ వృత్తుల్లో నైపుణ్యం అందించి, ఉపాధి కల్పించి, ఆయా కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఒక పథకాన్ని రూపొందించారు. దీని పనితీరును గమనించిన తరువాత మిగతా జాల్లాలకు విస్తరింపజేయాలని నిర్ణయిం చారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించారు. అయితే వివిధ జిల్లాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వాటి పనితీరు సంతృప్తికరంగా లేదు. యువత గురించి ఏవీ ప్రణాళికలు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండేళ్లు గడిచాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ జనాభాలో 40 శాతంగా ఉన్న యువతరం భవిష్యత్ మాత్రం త్రిశంకు స్వర్గంలోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో యువత, విద్యార్థిలోకం పాత్ర కీలకమైనది. నీళ్లు, నిధులు, నియామకాలు ఉద్యమ ప్రాథమిక నినాదాలు కూడా. ఇందులో ఎక్కువమందిని ఉద్యమంలో భాగస్వాములను చేసినది నియామకాలే. తరత రాలుగా తాము కోల్పోయిందేదో కొత్త రాష్ట్రం తెచ్చిస్తుందని ఆశించారు. నూతన ప్రభుత్వం వెంటనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేసి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టింది. పోలీస్ రిక్రూట్మెంట్ విభాగం, విద్యుత్ విభాగాలు విడివిడిగా నియామకాలు చేపట్టాయి. ఇప్పటికి 15 వేల నుంచి 20 వేల వరకు నియామకాలకు ప్రక్రియ కొనసాగుతున్నది. ఒకవేళ ప్రభుత్వం ఇదే పద్ధతిలో తన విధానాన్ని కొనసాగించి మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో తెలంగాణలో లక్షా ఏడువేల ఖాళీలున్నట్టు ప్రకటించింది. అంటే ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంటే లక్ష ఉద్యోగాలు వస్తాయి. కానీ అన్ని ఉద్యోగాలు లేవనే వాదన ఉన్నది. గరిష్టంగా లక్ష ఉద్యోగాలూ వస్తాయను కుందాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో వన్టైం రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగార్థుల సంఖ్య దాదాపు 11 లక్షల యాభైవేలు. అంటే ప్రభుత్వం మొత్తం ఖాళీలను భర్తీ చేసినా ఇంకా మిగిలేది, రిజిస్టర్ చేసుకున్న గ్రాడ్యుయేషన్ ఆపై చదివిన వాళ్లు దాదాపు పది లక్షల యాభైవేలు. వీరి పరిస్థితి ఏమిటి? వీళ్లే కాదు, జనాభాలో యువకులు 40 శాతం. ఇందులో సగం మంది చదువుకుంటున్నవారనుకుంటే, మిగతా 20 శాతం అంటే నాలుగు కోట్ల జనాభాలో 80 లక్షలు ఉంటారు. వీళ్లలో లక్ష మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తే, ఇంకా 79 లక్షలమంది నిరుద్యోగులుగానే ఉంటారు. తెలంగాణ ప్రభుత్వానికిది సవాల్. తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న రిక్రూట్మెంట్లో కనీసం ఒక్క శాతమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టడంలేదు. రాష్ట్రం విడిపోయి రెండు సంవత్సరాలు దాటిన తరువాత కూడా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఆంధ్ర ప్రదేశ్లో నిరుద్యోగ యువత దాదాపు కోటి అని అంచనా. ఈ జనాభాను ఏవిధమైన ఉపాధిరంగంలోకి తీసుకెళతారన్నది అక్కడి ప్రభుత్వం ఎక్కడా స్పష్టం చేయలేదు. తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో ‘‘జాబు రావాలంటే, బాబు రావాలి’’ అన్న నినాదాన్నిచ్చారు. బాబు వచ్చాడు కానీ జాబు మాత్రం రాలేదన్న వాస్తవం యువతరంలో అసంతృప్తిని నింపింది. సామాజి కాభివృద్ధిలో మానవ వనరుల వినియోగం, వారి అభివృద్ధి ముఖ్యమైనది. జాతీయ స్థూలాదాయం పెరుగుదల అంకెలను చూపెట్టి దేశ ప్రగతి, రాష్ట్రాల ప్రగతిని కొలిస్తే ప్రయోజనం లేదు. ఒకటి వాస్తవం: భవిష్యత్ ఉపాధి కల్పన అంతా నైపుణ్యం ఆధారంగానే ఉంటుంది. గ్రామాలూ, పట్టణాలూ ఒకటే ఇటీవల కేంద్ర కార్మిక, ఉపాధి, మంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి పరిస్థితులపై ఒక సర్వే నిర్వహించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికొస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతివంద మందిలో 49 శాతం మంది అంటే దాదాపు అర్థభాగం, నగరాల్లో అయితే 37 శాతం స్వయంఉపాధిలో ఉన్నారు. అరకొరగా పనులు చేస్తున్న వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం, పట్టణాల్లో 17.1 శాతం ఉన్నారు. కాంట్రాక్టు తరహా ఉద్యోగాల్లో గ్రామీణ ప్రాంతాల్లో 1.6 శాతం, పట్టణాల్లో 5.7 శాతం మంది ఉన్నారు. భద్రత కలిగి, భరోసా కలిగిన వేతన జీవులు గ్రామీణ ప్రాంతాల్లో 7.3 శాతం ఉండగా, పట్టణాల్లో 39.8 శాతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్వయంఉపాధి పొందుతున్న వారు, గ్రామీణ ప్రాంతాల్లో 36.7 శాతం, పట్టణాల్లో 40.2 శాతం ఉన్నారు. చిన్నాచితకా పనులు చేస్తున్న వాళ్లు 54.7శాతం గ్రామాల్లో 27.3 శాతం పట్టణాల్లో ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు గ్రామాల్లో 1.1 శాతం, పట్టణాల్లో 3.3 శాతం ఉండగా, వేతనాలు పొందుతున్న వాళ్లు గ్రామాల్లో 7.1 శాతం, పట్టణాల్లో 28.1 శాతం ఉన్నారు. గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి భద్రత లేదని తెలుస్తున్నది. పట్టణాల్లో కూడా ఉపాధి, ఉద్యోగాలు ప్రధాన సమస్యగానే ఉన్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో్ల ఉద్యోగ, ఉపాధి పరిస్థితులు గమనిస్తే మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం కాగలదు. మొదటగా తెలంగాణలో చూస్తే, ప్రభుత్వం కానీ, ప్రైవేట్లో కానీ వేతనాలు పొందుతున్న వాళ్లు గ్రామీణ ప్రాంతాల్లో 8.9 శాతం మంది మాత్రమే. క్యాజువల్ లేబర్గా పనిచేస్తున్న వాళ్లు 42 శాతంగా ఉన్నట్టు ఆ నివేదిక పేర్కొన్నది. అంటే 42 శాతం మంది ఎటువంటి భద్రతలేని జీవితాలు గడుపుతున్నారు. పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచే స్తున్న వాళ్లు 45.5 శాతం. ఇక్కడ క్యాజువల్ లేబర్ 17.1 శాతం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల్లో వేతనజీవులు 8.5 శాతం మంది ఉంటే క్యాజువల్ లేబర్ 54.7 శాతం మంది ఉన్నారు. పట్టణాల్లో వేతనజీవులు 32.5 శాతం మంది. క్యాజువల్ లేబర్ 27.3 శాతం మంది ఉన్నారు. తెలంగాణతో పోలిస్తే పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్ క్యాజువల్ లేబర్ 10 శాతం ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య రెండు రాష్ట్రాల్లో చాలా ప్రమాదకర స్థాయిలో ఉన్నది. పట్టణాల్లో కూడా తక్కువేమీ కాదు. రెండు రాష్ట్రాల్లో స్వయం ఉపాధి మీద ఆధారపడిన వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. తెలంగాణలో గ్రామాల్లో 49 శాతం, పట్టణాల్లో 37.3 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో 36.7 శాతం, పట్టణ ప్రాంతాల్లో 40.2 శాతం ఉన్నారు. గ్రామాల్లో స్వయం ఉపాధి వ్యవసాయమనే చెప్పుకోవాలి. కానీ వ్యవసాయం సంక్షోభంలో ఉన్నది. పట్టణాల్లో చిన్న చిన్న వ్యాపారుల స్థితి కూడా అదే. పెరుగుతున్న భారీ మార్కెట్లు వారిని మింగుతున్నాయి. అంటే మొత్తంగా భద్రత కలిగిన వేతనాలు పొందుతున్న పది శాతం మినహా, మిగతా 90 శాతం అభద్రతలోనే జీవిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయి. నిపుణుల కొరతే సమస్య ఈ పరిస్థితికి ఒక ప్రధాన కారణం నేటి యువకులలో నైపుణ్యం కొరవడటమే. ఇటీవల వ్యాపార, పారిశ్రామిక సంఘం ‘ఫిక్కి’ నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. రెండు రాష్ట్రాల్లో 2012 – 17 సంవత్సరాల మధ్య 41.41 లక్షలమంది నిపుణుల అవసరం ఉండగా, కేవలం 2.85 లక్షల మంది అందుబాటులో ఉంటారని అంచనా. పరిమిత నైపుణ్యం కలిగిన వాళ్ళు 11.61 లక్షల మంది అవసరం ఉండగా, 2.25 లక్షల మంది మాత్రమే అందుబాటులో ఉంటారని కూడా ‘ఫిక్కి’ సర్వేలో వెల్లడైంది. అరకొర నైపుణ్యం కలిగిన వాళ్లకు సంబంధించి 9.75 లక్షల ఖాళీలుంటే, అందులో 32.87 శాతం మంది అర్హులే ఉంటారని భావిస్తు న్నారు. మిగతా లక్షలాది మంది నైపుణ్యం లేని యువతను సమాజం భరిం చాల్సి ఉంది. 2017–22 మధ్య 23.75 మంది నిపుణులు అవసరమవు తుండగా 1.25 లక్షల మంది మాత్రమే లభ్యం అవుతున్నారు. 13.80 లక్షల మంది పరిమిత నైపుణ్యం కలిగిన వాళ్ల అవసరం ఉండగా కేవలం 3.82 లక్షల మంది లభ్యమవుతున్నారని అంచనా. 10.03 లక్షల మంది అరకొర నైపుణ్యం కలిగిన వాళ్లు అవసరముంటే, 3.67 లక్షల మంది మాత్రమే అందుబాటులో ఉంటారు. ఎలాంటి నైపుణ్యంలేని లక్షల మంది నిరుద్యోగ సేనలో భాగం కాబోతున్నారు. భవిష్యత్లో ప్రభుత్వ రంగం, భారీ ప్రైవేట్ పరిశ్రమల్లో మాత్రమే కాక, చిన్న చిన్న యూనిట్లలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయి. ఇందులో నైపుణ్యం ఉన్నవాళ్ళకే అవకాశం ఉంది. ఒకవైపు లక్షల సంఖ్యలో నిరుద్యోగులు, రెండోవైపు నైపుణ్యం కలిగిన యువత కొరత. ఈ వైరుధ్యం ప్రస్తుతం దేశాన్ని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను నిలువునా కుంగదీస్తున్నది. కొత్తగా ఏర్పడిన ఈ రెండు రాష్ట్రాలు యువత ఉపాధి, ఉద్యోగాల పట్ల తీవ్రంగా ఆలోచించాల్సి ఉంది. రెండు రాష్ట్రాలూ జూన్ రెండవ తేదీని ముఖ్యమైన సందర్భంగానే భావిస్తున్నాయి. మిగతా అన్ని ప్రధాన విషయాలతో పాటు, యువత ఉపాధి, ఉద్యోగాలను తమ భవిష్యత్ ప్రాధాన్యతాంశంగా పరిగణించాలి. ఇందుకుగాను తక్షణ కార్యక్రమం, దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరం. పేరుకు కొన్ని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి లెక్కల్లో చూపించి చేతులు దులుపుకుంటే సమస్య పరిష్కారం కాదు. ప్రతియువకుడు ఏదో ఒక నైపుణ్యాన్ని సాధించి దేశ ఆర్థికాభివృద్ధిలో భాగమయ్యేట్టుగా ప్రభుత్వాలు పట్టుదలతో కృషి చేయాలి. విద్యావిధానాన్ని సైతం పూర్తిగా సంస్కరించాలి. నిజానికి విప్లవా త్మక మార్పులు చేపట్టాలి. నేటి విద్యావ్యవస్థ నైపుణ్యంలేని యువతను ఉత్పత్తి చేస్తున్న కర్మాగారంలా తయారయింది. ఈ పరిస్థితి భవిష్యత్లో కొనసాగకుండా ఉండాలంటే జూన్ 2వ తేదీన రెండు ప్రభుత్వాలు విద్యా, ఉపాధి రంగాల విషయంలో కఠోర నిర్ణయాలు చేపట్టాలి. వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మల్లెపల్లి లక్ష్మయ్య ‘ మొబైల్: 97055 66213 -
చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్యే ఫైర్
► బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. ఏవీ ►ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు ►భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదు ►ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య హెచ్చరిక హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య (ఎల్బీనగర్ నియోజకవర్గం) నిప్పులు చెరిగారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన చంద్రబాబు... ఏపీలో ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఏపీలో లక్షా 40 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటికి సంబంధించి గ్రూప్1, 2,3, ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భర్తీ చేయకపోతే ప్రభుత్వంపై పోరాటం తప్పదని హెచ్చరించారు. బాబు వస్తే ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు. ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్లో తొలగించిన 125 మంది కాంట్రక్ట్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.