breaking news
raja sadaram
-
'కొడుకుల కోసమే ఆస్ట్రేలియా వెళ్లారు'
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి రూ.10 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆరోపించారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఇద్దరు కుమారులను కలిసేందుకే సదారాం అక్కడికి వెళ్లారని అన్నారు. కామన్వెల్త్, పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశాలను అసెంబ్లీ కార్యదర్శి వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు. శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ను తప్పుదోవ పట్టించి ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం లేకపోయినా తామే వస్తామంటూ లేఖ రాశారని వెల్లడించారు. అసెంబ్లీ కార్యదర్శిగా మరో దఫా ఆయనను కొనసాగించగడం సరికాదన్నారు. సమర్థులైన అసెంబ్లీ అధికారులు చాలా మంది ఉన్నారని, కావాలంటే సదారాంను ఓఎస్డీగా పెట్టుకోవాలని సూచించారు. -
సదారాంను తొలగించాలి
సీఈవోకు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ వినతి సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి అనుకూలంగా, పక్షపాత వైఖరితో పనిచేస్తున్న అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతల నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్లాల్కు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ విజ్ఞప్తి చేసింది. సదారాం స్థానంలో మరో అధికారిని నియమించి ఎన్నికలను నిర్వహించాలని కోరింది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో భన్వర్లాల్కు వైఎస్సార్సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, హెచ్ఏ రెహమాన్ వినతిపత్రాన్ని సమర్పించారు. అభ్యంతరాలుంటే తెలపండి: భన్వర్లాల్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఇద్దరు పరిశీలకులను నియమించామని, అభ్యంతరాలుంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని భన్వర్లాల్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు రూపొందించిన ఎమ్మెల్యేల ఓటర్ల జాబితాలో ఏయే పార్టీలకు వారు ప్రాతి నిధ్యం వహిస్తున్నారనే వివరాలు లేకుండానే సదారాం ప్రచురించారని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నామినేషన్ల ముగింపునకు ముందు జాబితాలో పార్టీల పేర్లను పొందుపరిచారని వారు సీఈవోకి తెలిపారు. ఇది కావాలనే చేశారని, పార్టీ ఫిరాయింపు చట్టం కింద అనర్హతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఈ జాబితా ద్వారా అర్హులైన ఓట ర్లుగా చేసే ప్రయత్నం జరిగిందని వారు వివరించా రు. అనంతరం కె.శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారపార్టీ ఏజెంట్గా వ్యవహరిస్తున్న సదారాంను ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ విధుల నుంచి తొలగించాలని సీఈవోను కోరినట్లు తెలిపారు. టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై చర్య తీసుకోవాలని తాము కోర్టునూ ఆశ్రయించామన్నారు. వీరికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించవద్దని కోరామన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి పదవీ కాలం పొడగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం పదవీ కాలాన్ని మరో ఏడాది పొడగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుండగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు సోమవారం హైదరాబాద్ లో పర్యటించారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఆహ్వానం మేరకు కేసీఆర్ పలు ప్రాంతాలను సందర్శించారు.