breaking news
punjab former dgp
-
ఎన్ఐఏ చీఫ్గా దినకర్ గుప్తా
న్యూఢిల్లీ: సీనియర్ ఐపీఎస్ అధికారి, పంజాబ్ మాజీ డీజీపీ దినకర్ గుప్తాను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్రం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గుప్తా నియామకానికి కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్ఐఏ చీఫ్గా ఆయన 2024 మార్చి 31 దాకా కొనసాగుతారు. సంస్థకు ఏడాది తర్వాత రెగ్యులర్ చీఫ్ నియామకం జరిగింది. గతేడాది మేలో వై.సీ.మోదీ రిటైరయ్యాక సీఆర్పీఎఫ్ డీజీ కులదీప్ సింగ్కు అదనపు బాధ్యతలిచ్చారు. -
మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ కన్నుమూత
-
మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ కన్నుమూత
పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ (82) మరణించారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన పలు రకాల వ్యాధులతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. రెండుసార్లు పంజాబ్ డీజీపీగా పనిచేసిన ఆయన.. అక్కడ ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించి వేశారని పేరుపొందారు. 1995లో ఆయన ఐపీఎస్ నుంచి రిటైరయ్యారు. సివిల్ సర్వీసెస్లో ఆయన చేసిన సేవలకు గాను 1989లో ఆయనను ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ప్రెసిడెంటుగా చేసిన గిల్, ఆ తర్వాత ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కార్డియాక్ ఆరిత్మియా కారణంగా సంభవించిన కార్డియాక్ అరెస్టుతో ఆయన మరణించారని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొంత కాలంగా ఆయన తీవ్రమైన ఇషెమిక్ హార్ట్ డిసీజ్తోను, కిడ్నీ వ్యాధితోను బాధపడుతున్నారు. వాటితో పాటు ఉదరానికి సంబంధించిన ఒక సమస్యతో కూడా బాధపడి, దాన్నుంచి కోలుకుంటున్నారు. చివరకు కార్డియాక్ అరెస్టుతో మరణించారు.