breaking news
punishm ent
-
టీచర్ దారుణం.. స్నాక్స్ ఉన్నాయని 300 గుంజిళ్లు... చివరకు..
స్కూళ్లకు వెళ్లే పిల్లలు బుద్ధిగా ఓ చోట కూర్చోమంటే ఎందుకు ఉంటారండి! చిరుతిళ్లు తింటూ టీచర్కి దొరికి పోవడమో, పెన్సిల్ దొంగతనం చేయడమో, క్లాస్ ఎగ్గొట్టడమో, పరీక్షలు బాగా రాయకపోవడమో.. ఒకటేమిటి అన్నీ చేస్తారు! ఆనక టీచర్ ఇచ్చే పనిష్మెంట్లు తీసుకోవడం.. ఇంట్లో టీచర్పై పిర్యాదులు చేయడం ఇది మామూలే! ప్రతి స్కూల్లో జరిగేదే. ఐతే చైనాలో ఒక టీచర్ ఇచ్చిన పనిష్మెంట్కు ఓ విద్యార్ధిని శాశ్వతంగా అంగవైకల్యురాలైంది. అసలేంజరిగిందంటే.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్కు చెందిన హై స్కూళ్లో చదివే 14 యేళ్ల విద్యార్ధిని వసతి గృహంలో తన బెడ్ పక్కన ఉన్న స్నాక్స్ గురించి టీచర్ ప్రశ్నించిందట. ఐతే బాలిక తనవి కావని బుకాయించిందట. దీంతో ఆగ్రహించిన టీచర్ 300 గుంజిళ్లు తీయమని పనిష్మెంట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన టీచర్కి బాలిక సక్రమంగా గుంజిళ్లు తీస్తుందో లేదో పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఐతే గతంలొనే బాలిక కాలి గాయంతో బాధపడుతుందన్న విషయం తెలిసినా ఎవ్వరూ శిక్షను రద్దు చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో 150 గుంజిళ్లు తీశాక, బాలిక పరిస్థితి విషమించడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు ఇక మీదట మామూలుగా నడవలేదని, ఊత కర్రల సాయంతోనే నడవవల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో తీవ్ర షాక్కు గురైన బాలిక డిప్రెషన్లోకి వెళ్లింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ సంఘటన గురించి తెలిసిన స్కూల్ యాజమాన్యం సదరు టీచర్ను విధుల నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాకుండా బాలికకు రూ. 13 లక్షలు నష్టపరిషారం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. ఐతే బాలిక తల్లిదండ్రులు దానిని నిరాకరించారట. ఇది గత యేడాది జూన్ 10న జరిగినట్లు బాలిక తల్లి జోవూ స్థానిక మీడియాకు తెల్పింది. తాజాగా వెలుగులోకొచ్చింది. చదవండి: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు.. -
బడిత పూజకి పరిహారం!
విశ్లేషణ పాఠశాలల్లో పిల్లలను ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు క్రమశిక్షణ పేరుతో కొడుతుంటారు. తిడుతుంటారు. దీని పర్య వసానం ఏ విధంగా ఉంటుందో ఆలోచించు కోవాలి. పిల్లలపైన ఎవరు దౌర్జన్యం చేసినా నేరమవు తుంది. నష్ట పరిహారం చెల్లించవలసిన తప్పిదం అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో శారీరక హింసకు తావుండకూడదు. ప్రయివేటు పాఠశాలలు ఇష్టం వచ్చినట్టు నడుపుకునే స్వేచ్ఛ ఉన్నా, చట్టాలకు వ్యతిరేక కార్యక్రమాలను జరపడాన్ని ప్రభుత్వం సహించడానికి వీల్లేదు. పిల్లలను కొడితే చదువు వస్తుంది లేకపోతే రాదా? అది నిజమైతే కాలేజీ చదువుల విద్యార్థులకు ఈ నియమం ఎందుకు వర్తించదు? కేంద్రీయ విద్యాలయ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు విద్యావసరాలు తీర్చే పెద్ద వ్యవస్థ. అక్కడ శారీరక హింస లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు. అయినా ఎవరైనా కొడితే అనుసరించే విధానం ఏమిటి? బడిహింసను పూర్తిగా నిరోధించారా, లేక నిషేధించి ఊరు కున్నారా? అనేక నివారణ చర్యలు తీసుకోవాలని జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ వివరమైన మార్గదర్శకాలను రూపొందించింది. కేవీఎస్లో ఒక ఉపాధ్యాయుడు విద్యార్థిని శారీరకంగా గాయపరిచి నందుకు ఏ విచారణ జరిపారు? ఏ శిక్ష వేసారు? వివరాలు ఇవ్వండి అని సహచట్టం కింద ఒక సవాలు వచ్చింది. ఇది ప్రయివేటు వ్యవహారమని, అది వ్యక్తిగత సమాచారమని తిరస్కరించారు. ఉపా ధ్యాయుడిని సంప్రదిస్తే అతను అభ్యంతర పెట్టా డని కనుక ఇవ్వలేమని మొదటి అప్పీలులో తీర్పు చెప్పారు. విచారణలో తప్పు రుజువైందని, ఉపా ధ్యాయుడికి రెండు ఇంక్రిమెంట్ల కోత విధించి బదిలీ చేశామని కేవీఎస్ అధికారి విన్నవించారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(డి) ప్రకారం ప్రభుత్వ సంస్థ పాలనాపరంగా, అర్థన్యా యపరంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు, (సి) ప్రకారం కీలక విధానాలు రూపొందించినప్పుడు, లేదా ప్రజలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసు కున్నప్పుడు వాటి కారణాలు, సంబంధిత వివరాలు తమంత తామే తెలియజేయాలని చాలా స్పష్టంగా నిర్దేశిస్తున్నది.విద్యార్థిని కొట్టిన తప్పిదానికి క్రమశిక్షణా చర్య తీసుకోవడం వ్యక్తిగత సమాచారం కాదు. అది ప్రజ లకు సంబంధించిన విషయం కాకుండా పోదు. ఈ విధంగా కొట్టడానికి వీల్లేదని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఇతర ఉపాధ్యాయులకు, పాఠశాల యాజమాన్యాలకు కూడా అర్థం కావాలంటే ఇటు వంటి చర్యలకు సంబంధించిన సమాచారం అంద రికీ అందుబాటులో ఉండాల్సిందే. ఐక్యరాజ్యసమితి పిల్లల హక్కుల కమిటీ శారీరకంగా మానసికంగా పిల్లలను హింసించడం తప్పనీ, చెంపదెబ్బలు, మొట్టికాయలు, బెల్టు, బెత్తం, చెప్పు, చేయితో కొట్టడం, తన్నడం, ఊపేయడం, గిల్లడం, చెవ్వు మెలేయడం, జుట్టు పట్టి లాగడం, చెవులమీద కొట్టడం, కొరకడం, ఎండలో, క్లాసులో నిలబెట్టడం, బెంచీమీద నిల బెట్టడం లేదా అవమానించడం కూడదని వివ రించింది. యుఎన్ సీఆర్సీ ఆర్టికల్ 28(2) ప్రభు త్వాలు పిల్లల మానసిక శారీరక రక్షణ కల్పించ వలసి ఉంటుంది. విద్యా బోధన సమయంలో పిల్లల మానవ హక్కులను పాటించే చర్యలు తీసు కోవాలి. 37(సి) ప్రకారం పిల్లల పట్ల క్రౌర్యం అమా నవీయ ప్రవర్తన, అవమా నకర చర్యలు విడ నాడాలి. తల్లిదండ్రులు, సంరక్ష కులు లేదా మరెవరి సంరక్షణలో ఉన్నా సరే పిల్లలను హింస, దోపిడీ, లైంగిక వేధింపులకు గురిచేయ కుండా చట్టాలు కాపాడాలి. ఇండియన్ పీనల్ కోడ్ కింద పిల్లలను కొట్టడం నేరం. శిక్షలు కూడా నిర్ధారించారు. ఉపాధ్యాయులకు పిల్లలను కొట్టే అధికారాన్ని లేదా మినహాయింపును ఇవ్వలేదు. ఒకవేళ అటు వంటి సంఘటనలు జరిగితే అది నేరంగా పరిగణిం చేంత తీవ్రంగా ఉందా అని పరిశీలించాలి. తీవ్ర నేరంగా కనిపిస్తే వెంటనే పోలీసు స్టేషన్లో సంబంధిత ఉపాధ్యాయుడిపైనఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. తల్లిదండ్రులకు, పిల్లలకు నష్టపరిహారం చెల్లించే విధానం ఉండాలి. కేవీఎస్ వంటి కీలకమైన విద్యాసంస్థ ఇటువంటి నేరాలను అరికట్టడంలో తగిన చర్యలు తీసుకోవడం సంస్థాగతమైన విధా నాలు రూపొందించడం, ఎస్సీపీసీఆర్ నిర్ధారించిన మార్గదర్శక సూత్రాలను అనుసరించి ఇతర ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలకు ఆదర్శంగా నిలవాలి. ప్రతి సంవత్సరం మొదటి 3నెలల లోపున గత సంవత్సరం ఎన్ని కేసులు జరిగాయి? ఎంత పరి హారం చెల్లింపజేసారు? ఎంత మందిపైన చర్యలు తీసుకున్నారనే నివేదిక విధిగా ఇవ్వాలని ఎస్సీపీ సీఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. కేవీఎస్ ప్రతి ఏడాది ఒక నివేదిక ఇవ్వాలని, బాధితులైన విద్యార్థులకు పరిహారం చెల్లించే విధానాన్ని ప్రవేశ పెట్టి మిగతా విద్యా సంస్థలకు ఆదర్శంగా ఉండా లని, విద్యార్థికి చెల్లించిన పరిహారాన్ని బాధించిన టీచర్ జీతం నుంచి మినహాయించాలని కేంద్ర సమాచార కమిషన్ సూచించింది. (బ్రహ్మానంద్ మిశ్రా, కేసు సీఐసీ/సీసీ/ఏ / 2014/002226, 22.7.2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార కమిషనర్ ఈమెయిల్: professorsridhar@gmail.com)