breaking news
prasant Kumar
-
నితీష్ ప్రమాణం వేళ.. ‘పీకే’ మౌనవ్రతం
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ పదవసారి ప్రమాణ స్వీకారం చేసి, రికార్డు సృష్టించిన వేళ.. రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (పీకే) ఒక రోజుపాటు ‘మౌన వ్రతం’ పాటిస్తున్నారు. ఆయన ఈరోజు పశ్చిమ చంపారన్లోని భితిహర్వా గాంధీ ఆశ్రమంలో ఈ దీక్షను చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విఫలం కావడానికి తానే పూర్లి బాధ్యత వహిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.ఆయన ఈ మౌనవ్రతానికి ముందు పట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘బీహార్ ప్రజలు దేని ఆధారంగా ఓటు వేయాలి? కొత్త వ్యవస్థను ఎందుకు సృష్టించాలి? అనే దాని గురించి వారికి వివరించడంలో విఫలమయ్యాను. ఈ వైఫల్యానికి ప్రాయశ్చిత్తంగానే మౌనవ్రతం చేస్తున్నాను. ఎన్నికల రాజకీయాలలో తమ తొలి అరంగేట్రం నిరాశపరిచినప్పటికీ, బిహార్ను మెరుగుపరచాలనే తన సంకల్పాన్ని నెరవేర్చే వరకూ వెనక్కి తగ్గేది లేదని’ అన్నారు.ఈ ఎన్నికల్లో బీజేపీ 89 సీట్లతో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) 85 సీట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఈ భారీ విజయంతో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారోత్సవం పట్నాలోని చారిత్రాత్మక గాంధీ మైదానంలో అంగరంగ వైభవంగా జరిగింది. 2005, 2010, 2015లో కూడా నితీష్ ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు.ఇది కూడా చదవండి: బిహార్ సీఎంగా నితీష్.. మంత్రులుగా 26 మంది ప్రమాణం -
‘గౌతమి’ గుర్తుకొచ్చింది..
తాళ్లపూసపల్లి వద్ద హౌరా ఎక్స్ప్రెస్ చక్రాల నుంచి మంటలు బ్రేక్ పట్టేయడంతో ఘటన పొగతో ఆందోళన చెందిన ప్రయాణికులు రైలు దిగి దూరంగా పరుగులు కాజీపేట రూరల్ : 2008 జూలై 31.. అంటే ఆరేళ్ల క్రితం జిల్లాలోని కేసముద్రం-తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ల నడుమ సికింద్రాబాద్-కాకినా డ గౌతమి ఎక్స్ప్రెస్ అగ్నికి ఆహుతైంది. సరిగ్గా అదే ప్రాంతంలో హౌరా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్(18645)కు ఆదివా రం అలాంటి ప్రమాదమే త్రుటిలో తప్పింది. మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనకు సంబంధిం చిన వివరాలు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. మానుకోట నుంచి బయలుదేరిన పది నిమిషాలకే రాఖీ పండుగకు పుట్టింటికి వెళ్లి వస్తున్న మహిళ లు, అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుని తిరుగుముఖం పట్టిన వారితో ఆదివారం మధ్యాహ్నం హౌరా ఎక్స్ప్రెస్ కిక్కిరిసింది. ఈ రైలు మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.20 గంటలకు వరంగల్ వైపు అప్లైన్లో బయలుదేరింది. ఆ వెంటనే వేగం పుంజు కో గా.. తాళ్లపూసపల్లి స్టేషన్ నుంచి రైలు మొత్తం బయటకు వెళ్లకముందే ఎస్-4 బోగీ చక్రాల నుంచి పొగలు వెలువడ్డాయి. రైలులో ఉన్న ఖ మ్మం వాసి, సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కమ్యూనికేషన్ విభాగం ఉద్యోగి టి.ప్రశాంత్కుమార్ ఏం జరిగిందోనని రెండు బోగీల మధ్య ఉన్న ఖాళీ స్థలం నుంచి గమనించాడు. చక్రాన్ని పట్టే బ్రేక్ పట్టీ వద్ద నుంచి చిన్నగా మంటలు వస్తుండడాన్ని చూసి న ఆయన తోటి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. అప్పటికే పొగలు కమ్ముకుంటుం డగా, కొందరు చైన్ లాగడంతో తాళ్లపూసపల్లి స్టేషన్ చివరలో రైలు నిలిచిపోయింది. మంటలు వస్తున్నాయని చెప్పడం, పొగలు విపరీతంగా రావడంతో రైలులోని చంటి పిల్లలతో ఉన్న మహిళ లు, వృద్ధులు.. ఇలా అందరూ ఒక్కసారి కంగారుకు లోనై రైలు నుంచి కిందకు దూకారు. పక్క నే కంకర కుప్పలు ఉండడంతో కొందరు కింద పడ్డారు. ఇంతలోనే రైలులో ఉన్న తాళ్లపూసపల్లి గ్యాంగ్మన్ నాగరాజు, మరికొందరు బాటిళ్లతో నీరు చల్లి నిప్పు ఆర్పారు. మంటలు ఆరిపోయి నా పొగలు మాత్రం ఆగకపోగా ఇంకా దట్టం కావడంతో ప్రయాణికులు దూరంగా పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రైలు గార్డ్ కూ డా అక్కడకు చేరుకుని చక్రాన్ని బ్రేక్ పట్టివేయడంతో పొగలు వచ్చాయని తెలిపారు. అయినా పొగలు ఆగకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఆ తర్వాత పది నిమిషాలకు పొగలు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులందరూ కంగారుగానే రైలు ఎక్కారు. కిక్కిరిసిన జనరల్ బోగీలు రాఖీ పండుగకు వచ్చి తిరుగు ప్రయాణమైన వారితో హౌరా ఎక్స్ప్రెస్లోని రైలు జనరల్ బోగీలు కిక్కిరిసిపోగా చాలా మంది రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కారు. కానీ కొందరు ఎస్-4 లోకి కాకుండా వేరే బోగీల్లోకి ఎక్కారు. ఇందులోకి కొందరు రిజర్వేషన్ ఉన్న వారు కూడా ఆ బోగీ ఎక్కాలంటే భయపడ్డారు. ఈ సందర్భంగా ఆరేళ్ల క్రితం నాటి గౌతమి ఎక్స్ప్రెస్ ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఇప్పుడు హౌరా రైలు చక్రాల నుంచి నుంచి మంటలు రావడాన్ని పో ల్చుకుని ఆందోళన చెందారు. అలాగే, విష యం టీవీల్లో స్క్రోలింగ్ వస్తుండగా చూసిన ప్రయాణికుల బంధువులు ఫోన్ చేయడంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్ది చెప్పడం కనిపించింది.


