breaking news
Polavaram Assembly Constituency
-
అక్కడ గాజు గ్లాస్ ముందే పగిలిందా..?
ఎన్నికల ఫలితాల డేట్ దగ్గరపడేకొద్దీ పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 స్థానాల్లో పోటీ చేసిన గ్లాస్ పార్టీ ఏజెన్సీలోని పోలవరంలో కూడా బరిలో దిగింది. టిక్కెట్ ఆశించిన టీడీపీ నేతలు గ్లాస్ను పగలగొట్టాలని ముందు డిసైడ్ అయిపోయారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఈసారి కూడా గెలుపు తమదే అనే ధీమాతో ఉన్నారు. పెరిగిన ఓటు శాతం కూడా తమకే అనుకూలమని వైఎస్ఆర్సీపీ అంటోంది. గ్లాస్ పార్టీ గల్లంతు ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పోలవరంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం.ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పోలవరం నియోజకవర్గానికి ఒక సెంటిమెంట్ బలంగా ఉంది. పోలవరంలో పాగా వేసిన పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఇక్కడ బాగా ఉంది. గతంలో కాంగ్రెస్, టీడీపీ మధ్య...వైఎస్ఆర్సీపీ ఏర్పడ్డాక...టీడీపీ, వైఎస్ఆర్సీపీ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. అయితే ఈసారి పోలింగ్కు ముందే కూటమి చేతులెత్తేసినట్లయింది. కూటమి తరపున జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు బరిలో నిలిచారు. జనసేనకు ఇవ్వడాన్ని టీడీపీ ముఖ్య నేతలు అనేకమంది తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ నాయకులు ప్రచారంలో కూడా పెద్దగా పాల్గొనలేదు. టీడీపీ బరిలో ఉంటే..వైఎస్ఆర్సీపీకి కనీసం పోటీ అయినా ఇవ్వగలిగేదని..జనసేన కావడంతో ఓటమి ముందే ఖరారైందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి విజయం లాంఛనమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు.పోలవరం నియోజకవర్గంలో 85.98 శాతం పోలింగ్ నమోదైంది. అయితే విజయంలో మహిళల తీర్పే కీలకం కానుంది. ఓటు వేసినవారిలో పురుషుల కంటే సుమారు 6,208 మంది మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు. పోలింగ్ సమయంలో ప్రతీ గ్రామంలోనూ అత్యధికంగా మహిళా ఓటర్లే క్యూలో కనిపించారు. గంటలకొద్దీ క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఇక వృద్ధులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటింగ్ శాతంతో పోటీలో నిలిచిన వారు ఎవరికివారు గెలుపు తమదే అంటూ తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన పథకాల పట్ల ఆయన నాయకత్వం పట్ల ప్రజలకు సంపూర్ణంగా విశ్వాసం కలిగిందని.. ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబోతున్నారని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. ఒకప్పుడు అన్ని రంగాల్లో వెనుక బడిన పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోంది. గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన ఆ ప్రాంతం నేడు మారిన రూపురేఖలతో అబ్బురపరుస్తోంది. గతంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలు సీఎం జగన్మోహన్రెడ్డి పాలనలో రూపం మారి కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్పగా అలలారుతున్నాయి. నాడు కనీస సౌకర్యాలు లేని ప్రభుత్వాస్పత్రులు నేడు ఆధునిక సౌకరర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నాయి. గ్రామాల్లో నూతన సచివాలయ భవనాలు, విలేజ్ క్లీనిక్స్, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలతో కళకళలాడుతున్నాయి.పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకూ సుమారు రూ. 665.77 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఏనాడూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రయత్నించలేదు. అసలు గిరిజనుల ఆవాసాలను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయని గిరిజనులు భావిస్తున్నారు. జగన్ నాయకత్వం మీద ఉన్న విశ్వాసంతో ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్ కే ఓటేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు. -
కూటమిలో కత్తులు
సాక్షి నెట్వర్క్ : ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకుంటామని ఇన్నాళ్లూ చెబుతూ వచి్చన టీడీపీ, జనసేన మధ్య ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి. ఇక్కడ జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజును మార్చాలని టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయమై రెండురోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబు క్యాంప్ వద్దకు వెళ్లి మరీ బొరగం వర్గీయులు ధర్నా చేశారు. పేరుకే రిజర్వుడు నియోజకవర్గమైనా ఇక్కడ పెత్తనమంతా బాబు, పవన్ సామాజికవర్గాలదే. దీంతో బాబు వర్గం బొరగం వర్గీయుల్లో అసమ్మతిని రాజేసింది. ప్రతిపనికీ పవన్ సామాజిక వర్గం వద్దకు వెళ్లి అడగలేమని, ఇక్కడ అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలని బాబు సామాజికవర్గం డిమాండ్ చేస్తోంది. ముందు సీటు ఎవరికి ఇచ్చినా ఓకే అన్న బొరగం భీమవరంలో అంజిబాబు తరహాలో తనను జనసేనలో చేర్చుకుని టికెట్ ఇస్తారని ఆశించారు. అయితే అనూహ్యంగా జనసేన నేతకు ఇవ్వడంతో బొరగంతోపాటు బాబు సామాజికవర్గ నేతలు కంగుతిన్నారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పుణ్యమా అని పలువురు సీనియర్ నాయకులు రాజకీయ నైరాశ్యంలో మునిగిపోయారు. టికెట్ ఆశ చూపి చివరకు రూ.కోట్లకు పడగలెత్తిన అభ్యర్థులకు పెద్దపీట వేయడంతో దశాబ్దాల తరబడి పార్టీ కోసం రెక్కలుముక్కలు చేసుకున్న నేతలు లబోదిబోమంటున్నారు. కళ్యాణదుర్గంలో ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వరనాయుడికి బాబు మొండిచేయి చూపారు.ఉమామహేశ్వరనాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. హనుమంతరాయచౌదరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు టికెట్ ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ కోలుకోలేని దెబ్బతిన్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ నేత ప్రభాకర్ చౌదరికి రాజకీయ సన్యాసం తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎంపీగా చేసిన బీసీ నేత నిమ్మల కిష్టప్పనూ బాబు నట్టేటముంచారు. ► అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చకుంటే ఘోర పరాజయం తప్పదని మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఆదివారం కలికిరిలోని పార్టీ కార్యాలయంలో శంకర్ వర్గీయులు కిరణ్తో సమావేశమయ్యారు. శంకర్కి టికెట్ ఇవ్వకుంటే సహకరించబోమని స్పష్టం చేశారు. ► తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం పశి్చమగోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార విభాగం చైర్మన్, సినీ నిర్మాత బన్నీ వాసుకు ఘోర అవమానం జరిగింది. వేదిక ఎక్కుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. జనసేన ఇన్చార్జి అని చెప్పినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న టీడీపీ నాయకులూ దీనిని పట్టించుకోలేదు. అవమానంగా భావించిన బన్నీ వాసు అక్కడి నుంచి ని్రష్కమించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బన్నీ వాసుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోవడంతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు (మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బావమరిది)ని రాజీకి పంపారు. ఆయన వాసు దగ్గరకు వెళ్లి బుజ్జగించి చంద్రబాబు వద్దకు తీసుకెళ్లారు. వాసుకు జరిగిన అవమానంపై జనసైనికులు మండిపడుతున్నారు. ► ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అశోక్రెడ్డికి సీటు కేటాయించడంపై జనసేన నేత ఆమంచి స్వాములు కారాలుమిరియాలు నూరుతున్నారు. తాను ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. గిద్దలూరు జనసేన ఇన్చార్జ్ బెల్లంకొండ సాయిబాబుతోనూ ఆయనకు పొసగడం లేదు. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న స్వాములు వెంటే ఆ సామాజికవర్గం ఉండడంతో టీడీపీ అభ్యర్థి అశోక్రెడ్డి ఆందోళన చేస్తున్నారు. ► కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమి అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న డాక్టర్ పార్థసారథికి సహకరించేది లేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత ప్రకా‹Ùజైన్ తేలి్చచెప్పారు. కూటమిలో ఆ ఆరు ఓసీలకే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సామాజిక న్యాయానికి పాతరేసింది. విజయవాడ తూర్పు, సెంట్రల్, వెస్ట్, మైలవరం, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓసీలకే సీట్లు కేటాయించింది. ఈ ఆరు నియోజకవర్గాల్లో ఐదు టీడీపీ అధినేత సొంత సామాజికవర్గానికే కేటాయించారు. ఒకటి పవన్ కళ్యాణ్ సామాజికవర్గానికి ఇచ్చారు. దీంతో బలహీనవర్గాల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. వాస్తవానికి విజయవాడ పశి్చమ నియోజకవర్గంలో మైనార్టీలు ఎక్కువ. చంద్రబాబు తొలుత మైనార్టీలకు సీటు ఇస్తామని చెప్పి, పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. ఆ పార్టీ తన సామాజికవర్గానికి చెందిన సుజనా చౌదరికే టిక్కెట్టు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఈ సీటు తొలుత జనసేనకు కేటాయించారు. ఇక్కడ పదేళ్లుగా బీసీ అయిన పోతిన మహేష్ డబ్బులు ఖర్చుపెట్టి పార్టీ జెండా మోశారు. తీరా చివరకు బీజేపీకి సీటు ఇవ్వడంతో పోతిన నైరాశ్యంలో కూరుకుపోయారు. సామాజిక న్యాయం పాటించిన వైఎస్సార్ సీపీ సామాజిక న్యాయం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి టికెట్ల కేటాయింపులో చేసి చూపారు. విజయవాడ తూర్పులో దేవినేని అవినాష్ (కమ్మ), సెంట్రల్లో వెలంపల్లి శ్రీనివాస్ (వైశ్య), విజయవాడ వెస్ట్లో షేక్ ఆసిఫ్ (ముస్లిం మైనార్టీ), పెనమలూరులో జోగి రమేష్ (గౌడ–బీసీ), మైలవరంలో సర్నాల తిరుపతిరావు (యాదవ బీసీ), గన్నవరంలో వల్లభనేని వంశీ (కమ్మ)కి టికెట్లు ఇచ్చారు. దీంతో క్షేత్రస్థాయిలో వైఎస్ జగన్కు విశేష ఆదరణ లభిస్తోంది. పిఠాపురంలో జనసేనానికి అసమ్మతిసెగ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీలో అసమ్మతి సెగ రేగింది. స్థానికేతరులు పిఠాపురంలో పెత్తనం చెలాయిస్తున్నారంటూ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీ గొల్లప్రోలు మండల నేత అరవ వెంకటాద్రి నాయుడు (భారతీయుడు) ఆదివారం లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ఇక్కడి నుంచి పోటీకి దిగిన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్థానికేతరుడే కావడంతో లేఖ పార్టీలో కలకలం రేపింది.