breaking news
Odisha Cabinet reshuffle
-
Odisha Cabinet Reshuffle: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా
భువనేశ్వర్: ఒడిశాలో మంత్రి వర్గం రాజీనామా చేసింది. సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలతో మంత్రులంతా రాజీనామా లేఖలు సమర్పించారు. స్పీకర్ సూర్యనారాయణ పాత్రో కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వానికి ఇటీవలే మూడేళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని ఆదేశించారు. రేపు(ఆదివారం) రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణా స్వీకారం జరగనుందని సంబంధింత వర్గాలు వెల్లడించాయి. చదవండి: ‘మీ సీనియర్ నాయకుడి అవినీతిని బట్టబయలు చేస్తాం’ -
10 మంది మంత్రులకు ఉద్వాసన
భువనేశ్వర్: అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన మంత్రివర్గంలో భారీ మార్పులు చేశారు. కేబినెట్ను పునర్వ్యవస్థీకరించి కొత్తగా 10 మందికి చోటు కల్పించారు. 10 మందికి ఉద్వాసన పలికారు. రాజ్భవన్లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఎస్ సీ జమీర్ 12 మందితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో ఆరుగురు మంత్రులుగా, నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇద్దరు సిట్టింగ్ సహాయక మంత్రులు ప్రపుల్ల మాలిక్, రమేశ్ చంద్రలకు కేబినెట్ మినిస్టర్లుగా పదోన్నతి కల్పించారు. సూర్యనారాయణ్ పాత్రో, నిరంజన్ పూజారి, ప్రఫుల్ల సామాల్, మహేశ్వర్ మొహంతి, శశిభూషణ్ బెహెరా, ప్రతాప్ జెనా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నృసింగ చరణ్సాహు, అనంత దాస్, సుశాంత్ సింగ్, చంద్రసారధి బెహెరా సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాలుగేళ్ల తర్వాత తొలిసారిగా నవీన్ పట్నాయక్ తన కేబినెట్ను పునర్వ్యవస్థీకరించారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందించేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టామని ఆయన తెలిపారు. సహకరించిన మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.