breaking news
nirmalamma
-
పన్ను విధానాల్లో కేంద్రం కీలక మార్పులు ప్రతిపాదించే అవకాశం
-
ప్రేక్షకులను ఉర్రూతలూగించిన తెలుగింటి బామ్మ.. నిర్మలమ్మ అరుదైన చిత్రాలు
-
'స్వాతిముత్యం'లో అమ్మ పోయిన సీన్ చూస్తే కన్నీళ్లాగవు
‘అది మా పుట్టింటివాళ్లు ఇచ్చిన మరచెంబురా, బుజ్జిముండకి ఎన్ని సొట్టలు పడ్డాయో ఏంటో... అంటూ మనింటి బామ్మగా తెలుగువారికి చేరువయ్యారు. వేసేయండ్రా తలుపులు అంటూ... రాయలసీమ ఫ్యాక్షన్ లీడర్గా విలనిజమూ చేశారు.. తల్లి లేని పిల్లలకు బామ్మగా నటిస్తూ, మనవలకు చేరికయ్యారు... సినిమాలలో ఎంత సింపుల్గా ఉంటారో, నిజ జీవితంలోనూ అంతే సింపుల్గా ఉంటుంది అమ్మ అంటున్నారు జి. నిర్మలమ్మ (రాజమణి) ఏకైక కుమార్తె కవిత. 1927, నవంబరు నెల, దీపావళి వెళ్లిన ఏడో రోజున అంటే సప్తమి తిథి నాడు తొమ్మిదో సంతానంగా బందరులో పుట్టింది అమ్మ. తాతయ్య కోటయ్య, అమ్మమ్మ గంగమ్మ. అమ్మను వాళ్ల పెద్దక్కయ్యే పెంచి పెద్ద చేశారు. అమ్మ మూడో తరగతి వరకే చదువుకుంది. చిన్నప్పటి నుంచి ఆటపాటలలో చాలా చలాకీగా ఉండేదట. అమ్మకి డాన్స్, నాటకాలంటే ప్రాణమని చెప్పేది. వేదాంతం రాఘవయ్య గారితో కలిసి డాన్స్ చేసిందట అమ్మ. అమ్మకి ఏడు సంవత్సరాల వయసులో ‘మార్కండేయ’ సినిమాలో, చిత్రపురి నారాయణమూర్తి గారి ద్వారా నాటకాలలో నటించడానికి అవకాశం వచ్చింది. నాటకాలలో నటిస్తూ, మంచి నటన నేర్చుకోవచ్చనుకుంది అమ్మ. తన పద్నాలుగో ఏట ‘భక్త ప్రహ్లాద’ నాటకంలో ప్రహ్లాదుడిగా నటించింది. మంచి తెలుగు వచ్చు కాబట్టి, పద్యాలు చాలా చక్కగా చదవగలిగానని అమ్మ చెప్పేది. ‘సక్కుబాయి’ నాటకం చూసి బాగుందని మెచ్చుకున్నారట కానీ, ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదట. చిన్నగా, సన్నగా ఉన్నావు. కొంచెం ఒళ్లు రావాలి, అలాగే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అన్నారట. పద్యాలు, పాటలు సాధన చేస్తూ, సినిమా అవకాశాల కోసం ఎదురుచూసిందట అమ్మ. ఘంటసాల బలరామయ్యగారు అమ్మ ఫొటోలు చూసి ‘గరుడ గర్వభంగం’ చిత్రంలో సత్యభామ చెలికత్తె వేషం ఇచ్చారట. క్రమేపీ పుల్లయ్య గారు, గూడవల్లి రామబ్రహ్మం గారు, బి. ఎన్. రెడ్డిగారు... వీరందరి పరిచయాలతో అమ్మకు సినిమాలలో మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఎత్తుకు పై ఎత్తు, మనుషులు మారాలి... వరసగా 900 కు పైగా చిత్రాలలో నటించింది. ఒక సంవత్సరంలో 19 సినిమాలు చేసిన రికార్డు అమ్మది. 70 సంవత్సరాలు వచ్చాక కూడా చేసింది. హిందీ, తమిళ చిత్రాలకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. సినీ పరిశ్రమలో అమ్మని అందరూ సొంత తల్లిలా భావించేవారు. అమ్మనాన్నలను అక్క – బావ అని పిలిచేవారు. ప్రోత్సహిస్తేనే వివాహం.. అమ్మకు 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి వివాహం చేసుకోమని అమ్మమ్మ అడిగిందట. అందుకు అమ్మ, ‘నన్ను కళాకారిణిగా ప్రోత్సహించేవారినే చేసుకుంటాను’ అని నిక్కచ్చిగా చెప్పిందట. కళల పట్ల ఆసక్తి ఉన్న జి. వి. కృష్ణారావు గారితో అమ్మ వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచి ఇద్దరిదీ ఒకే మాట, ఒకటే బాట. ఉదయిని థియేటర్ స్థాపించి, ఎన్నో నాటకాలు ప్రదర్శించారు. ఏ పోటీకి వెళ్లినా అమ్మకు బహుమతి తప్పనిసరి. ఆంధ్రకళాపరిషత్తులో మూడు సార్లు వరసగా బహుమతులు రావటంతో, నిర్వాహకులు ‘అమ్మా! ఇక నుంచి మీరు బహుమతులకు దూరంగా ఉండండి’ అన్నారట. ఆ విషయం అమ్మ ఎంతో సంబరంగా చెప్పేది. పెద్దల ప్రశంసలు... అమ్మ ఒకసారి ‘కరవు రోజులు’ నాటకం ప్రదర్శిస్తున్నప్పుడు ఆ నాటకానికి ప్రముఖ హిందీ చలనచిత్ర నటుడు పృ«థ్విరాజ్ కపూర్ హాజరయ్యారట. ఆ నాటకంలో అమ్మ స్టేజ్ మీద పావుగంట సేపు శవంలా ఉంటుంది. నాటకం పూర్తయ్యాక ఆయన, ‘శవం బాగా నటించింది’ అని చమత్కరిస్తూ అమ్మను అభినందించారని అమ్మ ఎంతో సంతోషంగా చెప్పేది. అలాగే ‘ఎంతో ప్రావీణ్యం ఉంటేనే కానీ రేడియో నాటకాలలో నటించలేం. నాలుగు గోడల మధ్య మైకు ముందర నిలబడి, అందరికీ కళ్ల ముందు కనిపిస్తున్నట్లు నటించాలి. నాకు రేడియో నాటకాలంటే మక్కువ’ అనేది. విశ్వనాథ సత్యనారాయణగారు రచించిన వేయిపడగలు, ఏకవీర నాటకాలలో నటించింది. ‘వేయిపడగలు’ లో గిరిక పాత్ర విని, ఆయన స్వయంగా ‘పిచ్చి తల్లీ! నిన్ను తక్కువ అంచనా వేశాను. ఎంత బాగా నటించావో’ అని ఆశీర్వదించారుట. అన్నీ పద్ధతిగా ఉండాలి... అన్ని పనులు చాలా చురుగ్గా చేసుకునేది. తాను సెలబ్రిటీని అనే భావన ఏ కోశానా ఉండేది కాదు. వంట స్వయంగా చేసుకుంటేనే ఇష్టం అమ్మకు. వంటవాళ్లతో చేయించుకోవటం ఇష్టం లేదు. ఉలవచారు, చేపల పులుసు.. అన్నీ చాలా శ్రద్ధగా చేసేది. ముక్కలు తరిగితే... ఒక ముక్క పెద్దది, ఒక ముక్క చిన్నది అయితే ఒప్పుకునేది కాదు. ఆవకాయ ముక్కలు సైతం పెద్ద కత్తి పీట మీద తరిగేది. బయట వాళ్లు రకరకాల సైజుల్లో కట్చేస్తారని అమ్మకు నచ్చేది కాదు. గోంగూర ఆరబెట్టి, శుభ్రం చేసి పచ్చడి తయారుచేసేది. పెసరపప్పు అప్పడాలు బాగా ఒత్తేది. అడిగిన వారికే కాదు, అడగని వారికి కూడా సీసాలలో పచ్చళ్లు ఇచ్చేది. నలుగురికీ పెట్టడమంటే అమ్మకి చాలా ఇష్టం. అమ్మ వంట చేసి షూటింగ్కి క్యారియర్ తీసుకువెళ్లేది. ఔట్డోర్ షూటింగ్కి వెళ్లినప్పుడు అక్కడ సొంతంగా వంట చేసేది. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేసి వెళ్లమనేది. పూల జడ వేసేది... నా చిన్నప్పుడు అమ్మ చెన్నై నుంచి హైదరాబాద్ సారథి స్టూడియోకి షూటింగ్స్ కోసం వచ్చేది. షావుకారు జానకి, అమ్మ మంచి స్నేహితులు. షూటింగ్ అయిపోయాక, అమ్మవాళ్లు షాపింగ్ చేసేవారు. లక్క పిడతలు, బట్టలు, గాజులు తీసుకువచ్చేది. వేసవి కాలంలో మల్లె పూలను, ఎంతో పొందికగా గుచ్చి చాలా అందంగా వంకీల జడ కుట్టేది. నా పుట్టినరోజు వస్తే ఇంట్లో పండగే. నాన్న హైదరాబాద్ నుంచి ఫ్రాక్స్ తెచ్చేవారు. ఆడపిల్లను చక్కగా అలంకరించి, అందంగా చూసుకోవటం నాన్నకు చాలా ఇష్టం. అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసేవారు. బొమ్మల కొలువు పెట్టించేది. అట్ల తద్ది నోము, ఉపవాసాలు చేయించేది. పెళ్లయ్యాక వరలక్ష్మీవ్రతం చేయించింది. మా పిల్లలకు నలుగు పిండి కోసం బావంచాలు, కచ్చూరాలు తెప్పించి మర పట్టించేది. వాళ్లకి నలుగు పెట్టి స్నానం చేయించి, ఆ తరవాత అమ్మ సాన్నం చేసి, షూటింగ్కి రెడీ అయ్యేది. షూటింగ్ నుంచి రాగానే శుభ్రంగా స్నానం చేసి, మళ్లీ పిల్లల దగ్గరకు వచ్చి వారిని, మురిపెంగా చూసుకునేది. వాళ్లు కొంచెం పెద్దవాళ్లయ్యాక హైదరాబాద్ నుంచి ద్రాక్షపళ్లు, మామిడి పండ్లు తెచ్చేది. ఇబ్బంది పెట్టేది కాదు... షూటింగ్కి వెళ్లాలంటే తెల్లవారుజామునే లేచి, కాఫీ తాగి, అన్ని పనులు ముగించుకుని, సిద్ధంగా ఉండేది. ఒక్క రూపాయి కూడా ఎవ్వరిదీ తీసుకోలేదు. దర్శకులంటే చాలా గౌరవం. వాళ్లు చెప్పింది చేసేది. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టేది కాదు. డబ్బింగ్ కూడా కాల్షీట్ ప్రకారం వెళ్లి చెప్పేది. అమ్మ అప్పట్లో చాలా బిజీగా ఉండేది. అమ్మనాన్న ఇద్దరూ రాత్రి షూటింగ్స్కి వెళ్తుంటే బాగా ఏడ్చేసేదాన్ని. నన్ను మా పెద్దమ్మ కూతురు సుబ్బులక్క దగ్గరకు తీసుకుని ఓదార్చేది. తనే నన్ను తల్లిలా పెంచింది. నాకు జ్వరం వస్తే మాత్రం అమ్మ నా పక్క నుంచి కదిలేది కాదు. చాలా సాధారణంగా... అమ్మ ఎక్కువగా తెలుపు రంగు వస్త్రాలే ధరించేది. రెండు చేతులకు చెరో గాజు, మెడలో ఒక గొలుసు, చెవులకు దుద్దులు... అంతే. సినిమాలలో కూడా ఇలాగే ఉండేది. మేకప్ వేసుకునేది కాదు. ఎండల్లో షూటింగ్ చేయటం వల్ల ముఖం మీద చిన్న మచ్చ వచ్చింది. ఆ మచ్చకు మాత్రం రంగు వేసేది. వేలి ముడి, సాదా సీదా చీరలు ఇష్టపడేది. ఎక్కువగా మల్మల్ చీరలు, ఆర్గండీ చీరలు కట్టుకునేది. తలకు ఎన్నడూ రంగు వేసుకోలేదు. అమ్మకి పూల మొక్కలు, చెట్లు, కూరగాయ మొక్కలంటే చాలా ఇష్టం. విరజాజి పూలు, ఉసిరి, నిమ్మ, సీతాఫలం, జామ, మామిడి చెట్లు, సపోటా, పనస అన్నీ కడియం నుంచి తెప్పించింది. మొక్కలకు స్వయంగా నీళ్లు పోసేది. కుక్కలంటే చాలా ఇష్టం. చాలా కుక్కల్ని పెంచింది. కాటుక ఇంట్లోనే చేసేది అమ్మ. పుస్తకాలు బాగా చదివేది. బ్రహ్మంగారి చరిత్ర, ఈశ్వరమ్మగారి చరిత్ర చదివి మాకు వినిపించేది. తెలుగు అంటే చాలా ఇష్టం. సాటి నటీనటులు ఒత్తులు పలక్కపోతే చాలా కోపం వచ్చేది. చెన్నైలో స్కూల్లో తెలుగు ఉండేది కాదు. అందువల్ల మా అబ్బాయికి తెలుగు అమ్మ నేర్పటమే కాకుండా, కాకరాల గారి దగ్గర కూడా నేర్పించింది. నాకు కడుపులో నొప్పిగా ఉంటే, పొట్టంతా నూనె రాసేది. ఆదివారం వస్తే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలని నేర్పింది. బట్టలు కూడా బాగా సర్దుకుంటేనే కానీ ఒప్పుకునేది కాదు. వస్తువు విలువ తెలియాలనేది. అమ్మకు కోపం చాలా ఎక్కువ. క్రమశిక్షణలో తేడా వస్తే కొట్టేది. నేను సౌమ్యంగా ఉంటూ, అమ్మ చెప్పినట్లు వినేదాన్ని. పెద్దవాళ్ల దగ్గర నుంచి అమ్మ నేర్చుకున్న పనులన్నీ నాకు నేర్పింది. డిగ్రీ వరకు చదివించింది. మాస్టర్ వేణుగారి దగ్గర సితార్ నేర్పించింది. అమ్మనాన్నలు బాగా బిజీగా ఉంటూ, అష్టకష్టాలు పడ్డారు. నేను అలా కష్టపడకూడదనే ఉద్దేశంతో నన్ను గృహిణిగానే ఉంచారు. అమ్మను మించిన దైవం లేదు, ఆవిడ వల్లే నేను ఈరోజు హాయిగా ఉన్నాను. చాలామంది కళాకారుల పిల్లల జీవితాలు ఎంత దుర్భరంగా మారాయో తెలిసిందే. నన్ను ఒక గృహిణిలా, భర్తకు భార్యగా, పిల్లలకు తల్లిగా పెంచారు. మా అమ్మాయికి లక్ష్మీ నిర్మల అని అమ్మ పేరు, అబ్బాయికి జయకృష్ణ అని నాన్న పేరు పెట్టాం. అల్లుడిని కొడుకులా చూసుకున్నారు. అమ్మానాన్నలకు మా వారే తలకొరివి పెట్టారు. స్వాతిముత్యం సినిమాలో అమ్మ పోయిన సీన్ చూస్తుంటే ఇప్పటికీ ఏడుపు వస్తుంది. అని భావోద్వేగానికి లోనైంది కవిత. సంభాషణ: వైజయంతి పురాణపండ -
పోకండ ఆపండి
కండ కరిగితే కష్టం. గుండె కరిగితే సాయం. ఈ అన్నదమ్ముల కండలు కొద్దికొద్దిగా కరిగిపోతున్నాయి. అవి ఇంకా ఇంకా కరగక ముందే.. మన గుండెలు కరగాలి. వరికి సాయం అందాలి. ‘‘చదువులో ప్రతిభావంతులు... ప్రత్యర్థులను మట్టి కరిపించే ఆట తీరు... మాటలతోనే మైమరిపించే వాగ్ధాటి... నిర్మలమ్మా! నిమ్మళంగా ఉండమ్మా. రామలక్ష్మణుల్లా ఇద్దరు కొడుకులు, లక్ష్మీదేవిలాంటి కూతురు పుట్టారు. నీ కొడుకులకు చదువులో, తెలివిలో సాటిలేరెవ్వరు’’ అని అంటుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఉప్పొంగి పోయేది. ఇరవై రెండేళ్ల మనోవేదన కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ అమ్మానాన్న ఓడిపోయారు. విద్యాకుసుమాలై విరిసి, జ్ఞాన సుగంధాన్ని విరజిమ్ముతున్న ఆ అన్నదమ్ములిద్దరినీ మొండి వ్యాధి తినేస్తోంది. పేగు తెంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలను మాయదారి రోగం కబళించబోతోందని తెలియగానే ఆ వృద్ధ దంపతుల హృదయాలు కకావికలమయ్యాయి. గుండెలు అవిసెలా ఏడ్చారు. తీరొక్క దేవునికి మొక్కారు. అయినా ఏ దేవుడూ కనికరించలేదు. బతుకు మార్గం చూపలేదు. ఇది ఇరవై రెండేళ్ల మనో వేదన. కష్టాల కన్నీటి కథ. ఆ సంతోషం నిలవలేదు! మెదక్ జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన కొండా నిర్మల, దుర్గయ్యలకు జగన్నాథం(35), మనోహర్(32), భగవతి(29) సంతానం. నిర్మల బీడీలు చుట్టేవారు. దుర్గయ్య చేనేత కార్మికుడు. పిల్లలను కష్టపడి బాగా చదివిస్తున్నారు. క్లాస్లో ఎప్పుడూ ఫస్టే. ఆటల్లో మేటి. మాటల్లో వారికి వారే సాటి. వారి ప్రతిభాపాటవాల ముందు ఎవరూ సరితూగేవారు కాదు. పదవ తరగతి ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ సాధించి పాఠశాలకే వన్నె తెచ్చారు. అదంతా చూసి ఆ తల్లిదండ్రుల్లో ఆనందం... పట్టలేనంత సంతోషం. కానీ వారి సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. అన్నిటికీ అమ్మానాన్నే... 1994 నుంచి కండరాల క్షీణత వ్యాధితో కుమారుల కాళ్లు, చేతులు కదలలేని స్థితికొచ్చాయి. వారిని స్థానిక ఆసుపత్రిలో, హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపెట్టారు. ఇక్కడ లాభం లేదంటే నిర్మల తల్లిగారి ఊరైన ముంబాయికి తీసుకెళ్లి అక్కడ జె.జె.జస్లోక్ ఆసుపత్రిలో చూపెట్టారు. పిల్లలను పరీక్షించిన వైద్యులు వీరికి ‘కండరాల క్షీణత’ వ్యాధి అని నిర్ధారించారు. వ్యాధి నివారణకు మందులవాడకం తప్ప ఇతర చికిత్స లేనందున ఇద్దరినీ తిరిగి స్వగ్రామానికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇద్దరు కుమారుల సేవలోనే జీవితాన్ని గడుపుతున్నారు నిర్మల, దుర్గయ్య. కాలకృత్యాల నుంచి రాత్రి పడుకునే వరకు... అన్ని పనులూ చేయాల్సిందే. వారికి స్నానం చేయాలన్నా... బట్టలు వేసుకోవాలన్నా... అన్నం తినాలన్నా... అన్నీ ఒకరు చేయాల్సిందే. బిడ్డల మీద ప్రేమతో చేస్తున్నారు. అయితే వృద్ధాప్యం మీద పడడంతో నీరసించిపోతున్నారు. ఉపాధి రెక్కలు విరిగాయి నిర్మల బీడీలు చుట్టగా వచ్చిన డబ్బులతో కలో గంజో పెట్టేది. బీడీ కట్టలపై 85 శాతం పుర్రె బొమ్మ వేయాలన్న కేంద్రప్రభుత్వ నిబంధన ఆమెకు చేతనైన ఆ ఒక్క ఉపాధినీ లాక్కెళ్లింది. సరళీకృత ఆర్థిక విధానాలు, సాలెల మగ్గం సడుగులిరగడంతో దుర్గయ్య చేసే చేనేత వృత్తిపైనా తీవ్ర ప్రభావం పడింది. దీంతో చేనేతను వదిలేశారాయన. పిల్లల వైద్యం కోసం వేలకు వేలు వెచ్చించడం భారంగా మారడంతో ఇంట్లోనే చిన్నపాటి కిరాణ కొట్టు పెట్టుకుని, పిల్లలకు వచ్చే వికలాంగుల పెన్షన్తో రోజులు వెళ్లదీస్తున్నారు. అయితే వికలాంగుల పెన్షన్ ఇస్తున్నాం కదా అని ప్రభుత్వం బీడీ కార్మికుల జీవన భృతిని రద్దు చేసింది. అచేతన, నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ కుటుంబానికి ప్రభుత్వం ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది. - డి.నర్సయ్య, సాక్షి, దుబ్బాక చావాలన్నా చావలేం! ‘కదలలేం. మెదలలేం. 30 ఏళ్లు దాటాయి. తల్లిదండ్రులను కూర్చోబెట్టి చూసుకోవాల్సిన వయస్సు. ఏ జన్మ పాపమో ఈ మాయదారి రోగం మా ఇద్దరినీ గృహ నిర్భందం చేసింది. మంచి, చెడూ అన్నీ అమ్మ చేయాల్సిందే. సిగ్గుతో కుంచించుకు పోతున్నాం. ఆ మహాతల్లి రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. పాపం నాన్నకూ నిరంతరం మాదే ఆలోచన. ఈ నిస్సహాయ జీవన యాత్ర ఎంత కాలం? మాది నిరాశ కాదు, నిస్పృహ కాదు. ఇది నిజం. కఠిన వాస్తవం. ‘మమ్మల్ని మరణించనివ్వండి. చావు కోసం మరొకరి తోడు కావాల్సిన దుస్థితిలో తల్లిదండ్రులు, చెల్లెలు పడుతున్న కష్టాలను చూడలేకపోతున్నాం. మమ్మల్ని కరుణించి మరణించనివ్వడి’ అని 2005లో మానవ హక్కుల కమిషన్కు దరఖాస్తు చేసుకున్నాం. మా విజ్ఞప్తిని కమిషన్ తిరస్కరించింది. మా నిర్ణయాన్ని అమ్మకు చెప్పాం. ఆమె గుండె పగిలేలా ఏడ్చింది. - జగన్నాథం, మనోహర్ ఈ కష్టం ఎవరికీ రాకూడదు నా బిడ్డలకొచ్చిన కష్టం ఎవరికీ రాకూడదు. నా బిడ్డల ఆరోగ్యం కోసం ఎక్కని గుడి మెట్లు లేవు. మొక్కని దేవుడూ లేడు. నేను, నా భర్త కష్టపడితే నెలకు రూ. 2 వేలు కూడా రావు. పిల్లల వైద్యానికి నెలకు రూ. 10 వేలు కావాలి. లక్షల అప్పు చేశాం. మా పరిస్థితి చూసినవాళ్లెవరూ మాకు అప్పు ఇవ్వడం లేదు. పిల్లలకు మందులు కొనలేకపోతున్నాం. మనసున్న మహారాజులు ఎవరైనా సాయం చేస్తే పిల్లల మందులకు ఉపయోగపడతాయి. - కొండా నిర్మల, బాధితుల తల్లి -
‘షకలక’ శంకర్
కష్టాలను మరచిపోయేందుకు నవ్వుతూ గడిపాడు. ప్రేక్షకులను నవ్విస్తూ తన పేదరికాన్ని ఎదిరించాడు. పకపకా నవ్వాలంటే అతడి కామెడీ చూడాల్సిందే అనే రేంజ్కు ఎదిగిపోయాడు. శ్రీకాకుళం యాస విప్పితే కిలకిలా నవ్వకుండా ఉండలేం.. రాంగోపాల్వర్మలా అనుకరిస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే! అతడే షకలక కామెడీ శంకర్. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శంకర్ ఆర్థిక స్తోమత లేక పదో తరగతికే ఫుల్స్టాప్ పెట్టేశాడు. అష్టకష్టాలు పడుతూ జీవితాన్ని నెట్టుకొచ్చే వాడు. ఒకరోజు మంజునాథ సినిమా షూటింగ్లో చిరంజీవిని చూసి ఫిదా అయిపోయాడు. ఎలాగైనా సినిమాల్లో నటించాలనుకుని 2002లో హైదరాబాద్ బస్సెక్కాడు. పెయింటింగ్ తప్ప ఇంకే పనీ రాదు. హైదరాబాద్లో మొదట స్నేహితుల వద్ద ఉంటూ నాలుగేళ్ల పాటు పెయింటింగ్ పనికి వెళ్లాడు. ఆ తర్వాత ప్రముఖ సినీనటి నిర్మలమ్మ వద్ద పనిచేశాడు. అప్పుడే సినీ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆఫీస్ బాయ్గా, ప్రొడక్షన్ బాయ్గా పని చేస్తూ సినిమాలు చూస్తూ గడిపేవాడు. రన్ రాజా రన్ దర్శకుడు అప్పట్లో తాను తీసిన షార్ట్ఫిలింలో ఒక అవకాశం ఇచ్చాడు. దానిని సద్వినియోగం చేసుకున్నాడు. క్లిక్ కావడంతో వెంటనే ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి జబర్దస్త్ కామెడీషోలో అవకాశం ఇవ్వడం.. ప్రేక్షకులు ఆదరించడంతో ఇక వెనుదిరిగి చూడలేదు. తర్వాత గీతాంజలి, రన్ రాజా రన్ సినిమాల్లో నటించాడు. అనేక సినిమాల్లో నటిస్తూ శంకర్ ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయ్యాడు. ఇదంతా షార్ట్ ఫిల్మ్ మహిమే అంటాడు శంకర్!