Music Director Koti
-
కలలో బీట్ బాగుంది: సంగీతదర్శకుడు కోటి
‘‘కలలో... కలలో.. .’ పాట చాలా ఫ్రెష్గా ఉంది. ఈ పాట బీట్, లిరిక్స్, నటీనటుల వేషధారణ, నటన అన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రబృందానికి శుభాకాంక్షలు’’ అన్నారు సంగీతదర్శకుడు కోటి. నటుడు అలీ ఫ్యామిలీ నుంచి సదన్ హీరోగా పరిచయమవుతున్న ‘ప్రణయ గోదారి’ చిత్రంలోని ‘కలలో... కలలో...’ అంటూ సాగే పాటను కోటి రిలీజ్ చేశారు.పీఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో పారమళ్ల లింగయ్య నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంకా ప్రసాద్ హీరోయిన్. ‘‘ఫీల్ గుడ్ లవ్స్టోరీతో రూపోందించిన ఈ చిత్రంలోని ‘కలలో..’ అంటూ సాగే ప్రేమ పాటను సహజమైన లొకేషన్స్లో చిత్రీకరించాం. వీనుల విందుగా, కనువిందుగా ఉంటుంది. త్వరలో సినిమాని విడుదల చేస్తాం ’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మార్కండేయ, కెమెరా: ఈదర ప్రసాద్. -
ఆయనకు వచ్చినంత గుర్తింపు నాకు రాలేదు ఎందుకంటే..!
-
మేము విడిపోవడానికి బాధాకరమైన కారణం ఇదే
-
ఘంటసాల గారి పాటలన్నా ఆయనన్నా చాలా ఇష్టం నాకు
-
మా స్నేహం చాలా గొప్పది..
-
చరిత్ర సృష్టించబోతున్న సంగీత దర్శకుడు కోటి
తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సంగీత దర్శకుడికి పర దేశ (ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్) పార్లమెంట్లో గౌరవ జీవిత సాఫల్య పురస్కారం లభించబోతోంది. అది మరెవరికో కాదు, మూడున్నర దశాబ్దాల పాటు తెలుగు పాటల ప్రపంచాన్ని ఉర్రూతలూగించి, మన అభిమాన హీరోల సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించి, మన గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సాలూరి రాజేశ్వరరావు గారి అబ్బాయి కోటికి! కోటి తెలుగు సినిమా సంగీతానికి చేసిన సేవలకు గాను గుర్తింపుగా ఆస్ట్రేలియా ఇండియన్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించనుంది. అంతే కాకుండా కోటి అక్కడ ఉన్న మన తెలుగు గాయనితో ఒక పాట కూడా పాడించబోతున్నారు. ఆ గాయని మరెవరో కాదు, తన మొదటి పాటతోనే ఆసియా రికార్డు పుస్తకంలో స్థానం దక్కించుకున్న మన తెలుగింటి ఆడపడుచు సుస్మిత రాజేష్. హరుడే వరుడై, హర హర శంభో తర్వాత మరో వినూత్నమైన పాటతో, కొత్త కలయికతో మన ముందుకు వస్తున్నారు సుస్మిత. ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని AISECS అడ్వైజర్ రాజేష్ ఉప్పల మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత పెంపొందించడానికి దోహదపడతాయన్నారు. 4 వేల పాటల మైలురాయిని దాటిన కోటిని ఆస్ట్రేలియాలోని పార్లమెంట్లో గెస్ట్ ఆఫ్ హానర్గా పిలవడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. చదవండి: పెళ్లికి ముందు, నాకూ, నా భర్తకు వేరేవాళ్లతో ఎఫైర్లు: ప్రియాంక చోప్రా -
సినీ పరిశ్రమకు అండగా నిలిచిన సీఎం జగన్
సాక్షి, పాత గుంటూరు: తెలుగు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్.కోటి చెప్పారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గుంటూరు నగరం నడిబొడ్డున స్థానం కల్పించారని తెలిపారు. గుంటూరు నాజ్ సెంటర్లోని ఐలాండ్లో కళాదర్బార్ సంస్థ వ్యవస్థాపకుడు పొత్తూరి రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగీత దర్శకులు కోటి... ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్రావు, నగర మేయర్ కావటి మనోహర్నాయుడుతో కలిసి బాలు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోటి మాట్లాడుతూ బాలు తన మొదటిపాట నుంచి అన్ని పాటలు పాడి తనను ఆశీర్వదించారని అన్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కల్పించిన రంగారావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బాలు పాడిన పాటలను కోటి ఆలపించి అభిమానులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో విగ్రహ శిల్పి రాజ్కుమార్ వడయార్, కార్పొరేటర్లు, విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్: కోటి
‘‘నేను ఈ రోజు ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి కారణమైన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అని సంగీత దర్శకుడు, నటుడు కోటి అన్నారు. అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య జంటగా రవి శ్రీ దుర్గా ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పగ పగ పగ’. సుంకర బ్రదర్స్ సమర్పణలో సత్యనారాయణ సుంకర నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. శుక్రవారం జరిగిన సక్సెస్ మీట్లో కోటి మాట్లా డుతూ– ‘‘పగ పగ పగ’ సినిమాకు మ్యూజిక్ చేద్దామని వెళ్లాను.. అయితే దాంతోపాటు నాతో యాక్టింగ్ కూడా చేయించారు. మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.. ఇంకా పెద్ద హిట్ చేయాలి’’ అన్నారు. ‘‘మా సినిమాని చూడనివారు చూసి, మమ్మల్ని ఆశీర్వదించాలి’’ అన్నారు రవి శ్రీ దుర్గా ప్రసాద్. నిర్మాతలు సత్య నారాయణ సుంకర, ఫైట్ మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ.. ‘మా స్టంట్ మాస్టర్ యూనియన్ సపోర్ట్ వల్లే ఈ సినిమా తీశాం. ప్రేక్షకుల స్పందన చూసి, మా కష్టం మరచిపోయాం. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రం తీయడం జరిగింది. కోటి గారితో వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీ గా ఉంది. మా తమ్ముడు హీరోగా అద్భుతంగా నటించాడు. సీనియర్ నటుల సపోర్ట్ మరవలేనిది’అన్నారు. చిత్ర హీరో అభిలాష్ సుంకర మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఫైటర్ గా నేను 320 సినిమాలకు వర్క్ చేశాను. మా అన్నలు నన్ను నమ్మి నాపై ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు. వారికి నా పాదాభివందనాలు, దర్శకులు రవి గారు మంచి కథ ఇచ్చి మమ్మల్ని బాగా డైరెక్ట్ చేశారు. కోటి గారి మ్యూజిక్ వింటూ పెరిగిన నేను తనతో కలసి నటించడంతో పాటు, మ్యూజిక్ కూడా తనే ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది’ అన్నాడు. -
‘పగ పగ పగ’ మూవీ రివ్యూ
టైటిల్: పగపగపగ నటీనటులు: కోటి, అభిలాస్ సుంకర, దీపిక ఆరాధ్య, బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు తదితరులు నిర్మాత : సత్య నారాయణ సుంకర దర్శకత్వం : రవి శ్రీ దుర్గా ప్రసాద్ సంగీతం : కోటి సినిమాటోగ్రఫీ : నవీన్ కుమార్ చల్లా ఎడిటర్ : పాపారావు విడుదల తేది: సెప్టెంబర్ 22,2022 ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మొదటి సారిగా విలన్ పాత్రలో కనిపిస్తోన్న చిత్రం ‘ పగ పగ పగ’.అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్, మూవీ మోషన్ పోస్టర్, కోటి నటించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్కు మంచి స్పందన వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 22)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ చిత్రం కథంతా 1985,90,2006వ సంవత్సరంలో సాగుతుంది. బెజవాడలోని బెజ్జోనిపేటకు చెందిన జగ్గుభాయ్(కోటి), కృష్ణ(బెనర్జీ) కాంట్రాక్ట్ కిల్లర్స్. ఒక్కసారి డీల్ కుదుర్చుకుంటే.. ప్రాణాలు పోయినా సరే డీల్ పూర్తి చేస్తారు. ఒక పోలీసు హత్య కేసులో కృష్ణ అరెస్ట్ అవుతాడు. ఆ సమయంలో జగ్గూభాయ్కి కూతురు సిరి(దీపిక ఆరాధ్య) పుడుతుంది. కృష్ణ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతానని మాట ఇచ్చిన జగ్గు.. అతను జైలుకు వెళ్లగానే ఆ ఊరి నుంచి పారిపోతాడు. తర్వాత హత్యలను చేయడం మానేసి జగదీష్ ప్రసాద్గా పేరు మార్చుకొని పెద్ద వ్యాపారవేత్త అవుతాడు. కృష్ణ ఫ్యామిలీ మాత్రం కష్టాలు పడుతూనే ఉంటుంది. కానీ అతని కొడుకు అభి(అభిలాష్)ని మాత్రం చదువులో రాణిస్తాడు. అభి చదువుకునే కాలేజీలోనే సిరి చేరుతుంది. ఇద్దరు ప్రేమించుకుంటారు. జగదీష్ మాత్రం వీరి పెళ్లికి నిరాకరిస్తాడు. దీంతో ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుంటారు. తను గారాబంగా పెంచుకున్న కూతురిని తీసుకెళ్లిన అభిపై జగదీష్ పగ పెంచుకుంటాడు. అల్లుడిని చంపడానికి ఓ ముఠాతో డీల్ కుదుర్చుకుంటాడు. కానీ కూతురు ప్రెగ్నెన్సీ అని తెలిసి ఆ డీల్ని వద్దనుకుంటాడు. కానీ ఇంతలోపే ఆ డీల్ చేతులు మారి చివరకు బెజ్జోనిపేటకు చెందిన ఓ వ్యక్తికి చేరుతుంది. అసలు ఆ డీల్ తీసుకుంది ఎవరు? తన అల్లుడిని కాపాడుకోవడానికి జగదీష్ చేసిన ప్రయత్నం ఏంటి? అభి తండ్రి కృష్ణ చివరకు ఏం చేశాడు? అభి ప్రాణాలను ఎవరు రక్షించారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ప్రస్తుతం ఆడియెన్స్ను ఆకట్టుకోవడం, థియేటర్లకు రప్పించడం చాలా కష్టంగా మారింది. డిఫరెంట్ కంటెంట్ ఉంటే తప్పా ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దర్శకుడు రవి శ్రీ దుర్గా ప్రసాద్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నా.. దానిని తెరపై చూపించడంలో, ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్లో కథ అంతగా రక్తి కట్టించదు. కాలేజీ ఎపిసోడ్ సరదాగాసాగుతుంది. అభి, సిరిల మధ్య కెమిస్ట్రీ బాగుంది. జగ్గూభాయ్ కాస్త జగదీష్ ప్రసాద్గా మారడం.. వ్యాపారంలో రాణించడం.. అదేసమయంలో కృష్ణ కష్టాలతో బాధపడడం, సిరి, అభిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. అసలు కథ అంతా సెకండాఫ్లో ఉంటుంది. కాంట్రాక్ట్ కిల్లర్ని పట్టుకునేందుకు జగ్గుభాయ్ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతాయి. ఈ కథకి పోకిరి సినిమాలోని ఓ సన్నివేశాన్ని లింక్ చేయడం బాగుంది. క్లైమాక్స్ మాత్రం ఉహకు భిన్నంగా, టైటిల్కి తగ్గట్టుగా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కెరీర్లో మొదటి సారి విలన్ పాత్ర పోషించాడు సంగీత దర్శకుడు కోటి. జగ్గూ అలియాస్ జగదీష్ ప్రసాద్ పాత్రకు న్యాయం చేశాడు. విలన్గా, కూతురికి మంచి నాన్నగా అదరగొట్టేశాడు. హీరో అభిలాష్కి ఇది తొలి సినిమా. అయినప్పటికీ చాలా చక్కగా నటించాడు.సీరియస్, కామెడీ సీన్స్తో పాటు యాక్షన్ ఎడిసోడ్స్లోనూ అదరగొట్టేశాడు. హీరోయిన్గా సిరి పాత్రలో దీపిక మెప్పించింది. బెనర్జీ, కరాటే కళ్యాణి, జీవాతో పాటు మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. కోటీ సంగీతం ఈ సినిమాకు ప్లస్ అయింది. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. నవీన్ కుమార్ చల్లా సినిమాటోగ్రఫీ, పాపారావు ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
అల్లరి 59 షురూ
ఓ వైపు వినోదం.. మరోవైపు వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ‘అల్లరి’ నరేశ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షురూ అయింది. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, బాలు మున్నంగి క్లాప్ ఇచ్చారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘నరేశ్ నటిస్తున్న 59వ చిత్రమిది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వెన్నెల’ కిశోర్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రామ్ రెడ్డి, సంగీతం: శ్రీ చరణ్ పాకాల, సహనిర్మాత: బాలాజీ గుత్త. -
పోలీసాధికారిగా కోటి
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పవర్ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో ఓ సినిమా రూపొందనుంది. నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.యన్.ఆర్. చౌదరి నిర్మించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా నర్రా శివనాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘కరోనా విపత్కర పరిస్థితుల్లో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివి. దేశాన్ని రక్షణ వలయంలో ఉంచి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న మానవ రూపంలోని దేవతలు వాళ్లు. వాళ్లే మనకి శివుడు, అల్లా, జీసస్. ఎన్నో ప్రతిఘటనలను, మరెన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్య సాహసాలతో, నీతి నిజాయతీలతో తమ విధులను నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా తెరకెక్కించనున్నా. పోలీసుల సేవలను వెలుగులోకి తేవడం కోసం ఒక సిన్సియర్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడు? అనే కథతో మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. -
‘ఓ పోలీసు.. మీ వల్లే మేము పదిలం’
కరోనా నియంత్రణలో భాగంగా విశేష సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీసు, పారిశుధ్య కార్మికులకు యావత్ దేశం ప్రత్యేక కృజ్ఞతలు తెలుపుతుంది. ఇప్పటికే సెలబ్రిటీలు వారి సేవలను కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. ఇక గాయకులు, సంగీత దర్శకులు మరో ముందడుగేసి వారిపై తమకున్న గౌరవంతో పాటలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పోలీసులను కీర్తిస్తూ రఘు కుంచె ‘సలాం నీకు పోలీసన్నా’పేరిట ఓ పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగానే ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి ‘జయహో పోలీస్’ అనే మరో పాటను విడుదల చేశారు. శ్రీనివాస మౌళి లిరిక్స్ అందించగా ట్యూన్ కట్టి, స్యయంగా పాడారు కోటి. కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు, భయాన్ని పారద్రోలేందుకు సంగీత దర్శకుడు కోటి ఇదివరకే ఓ పాటను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: సలాం నీకు పోలీసన్నా.. నా రామ్చరణ్ తెలుసా?: కేటీఆర్ -
ప్రజల కోసం చేసిన పాట ఇది
‘‘కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రజల్ని చైతన్యపరిచేలా ఓ పాట చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. గిటార్ వాయిస్తూ ట్యూన్ చేయడం మొదలుపెట్టాను. ఆ ట్యూన్ని ఫోన్లో రికార్డు చేసి రచయిత శ్రీనివాస్ మౌళికి పంపించాను. మేమిద్దరం కలిసి ఓ సినిమాకి పనిచేశాం. కానీ, ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆ చిత్రంలోని పాటలన్నీ తనే రాశాడు. ఆ లిరిక్స్, అందులోని పదాలు నాకు బాగా నచ్చాయి. అందుకే నా ట్యూన్ని ఆయనకి పంపించి, కరోనా నేపథ్యంలో ప్రజల్ని బాగా చైతన్యపరిచేలా మంచి లిరిక్స్ రాయాలని చెప్పా.. అలా ‘లైటజ్ ఫైట్ కరోనా’ పాట చేశాం’’ అని చెప్పారు సంగీతదర్శకుడు కోటి. ఇంకా ఈ పాట గురించి ఆయన మరిన్ని విశేషాలు చెప్పారు. ► నా ట్యూన్ విని శ్రీనివాస్ చరణం రాసి పంపించాడు. అప్పటికి ఇంగ్లిష్ పదాల్లేవు. ఈ పాట గురించి చర్చిద్దామని ఇంటికి రమ్మన్నాను. అప్పుడు ఇంగ్లిష్ పదాలు వచ్చాయి. ట్యూన్ కూడా చక్కగా కుదిరింది. నేను, మా అబ్బాయి రోషన్ కలిసి రికార్డ్ చేశాం. సమర్థ్ అనే కీ బోర్డ్ ప్లేయర్ కూడా నాకు రికార్డింగ్లో సహాయం చేశాడు. ► గిటార్తోనే ఈ పాటని కంపోజ్ చేశాను. చాలా బాగా వచ్చింది. కానీ, కొంచెం పెద్దగా ఉండటంతో నేను, రోషన్ కూర్చుని షార్ట్ చేశాం. గిటార్, వయొలిన్.. ఇలాంటి వాటితో మిక్స్ చేసి ఫైనల్ రికార్డింగ్ కోసం కృష్ణానగర్లోని ఓ రికార్డింగ్ స్టూడియోకి మెయిల్లో పంపించాను. అతను మొత్తం రికార్డింగ్ చేసి, క్లీన్గా అన్ని లెవల్స్ చూసుకుని తర్వాత నాకు పంపించాడు. ► ఈ పాటని ముందు నా స్నేహితులకు పంపించాను.. అందరూ చాలా బాగుందని అభినందించారు. అదే రోజు రాత్రి చిరంజీవిగారికి కూడా పంపించాను. ఉదయాన్నే ఆయన ఫోన్ చేసి, ‘పాట చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఈ పాటకి వీడియో చేద్దాం’ అన్నారు. ‘మీరు మెగాస్టార్.. మీరు వీడియో చేస్తే ఇంకేం కావాలి.. అందరికీ బాగా చేరువవుతుంది’ అన్నాను. ► చిరంజీవిగారే నాగార్జునగారికి ఫోన్ చేశారు. అలాగే ఆయనే వరుణ్ తేజ్, సాయిధరమ్తో పాడమని చెప్పారు. నిజానికి వెంకటేశ్గారు, మహేశ్బాబు, రామ్చరణ్.. ఇలా చాలామంది చేయాల్సింది. కానీ కుదరలేదు. అందుకే చిరంజీవిగారు, నాగార్జునగారు, వరుణ్తేజ్, సాయిధరమ్లతో రికార్డ్ చేశాం. చిరంజీవిగారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ పాట ఇంత పాపులర్ అయింది. ► ఈ వెర్షన్ రిలీజ్ చేయకముందే నేను గిటారుతో చేసిన పాటను రిలీజ్ చేశాను. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగువారందరూ అభినందించారు. ఆ తర్వాత ఈ నలుగురితో చేసిన వీడియో యూట్యూబ్, వాట్సాప్ ఇలా.. సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అయింది. ► కమర్షియల్ సాంగ్స్ ఎన్నో చేశాను. కానీ మానవాళికి నా వంతు ప్రయత్నంగా ఈ పాట చేశాను. అందుకే చిరంజీవిగారు ‘మా వంతు సాయం చేయాలి కదా’ అన్నారు. ఆయన నాకు ఓ బ్రదర్లాగా అన్నమాట. మేము కలసి ఎన్నో సినిమాలు చేశాం.. అయితే అవి కమర్షియల్. కానీ, ఈ పాట ప్రజల కోసం. అందరి కోసం చేసిన ఈ పాటకి మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. ► మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు, కేసీఆర్గారు ప్రజల క్షేమం కోసం ఈ ‘లాక్డౌన్ని’ పక్కాగా అమలు చేస్తున్నారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. -
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సంగీత దర్శకుడు కోటి
ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. అందులో భాగంగా దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’. ఈ సినిమాలో నందమూరి తారకరత్న టైటిల్ రోల్ లో నటిస్తుండగా నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బెజవాడలో ఇద్దరు నాయకుల మధ్య స్నేహం, వైరంతో పాటు కుటుంబ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘దేవినేని’లో బెజవాడ లోని మరో సీనియర్ ప్రజా నాయకుడు వంగవీటి రాధ పాత్రలో నటుడు బెనర్జీ నటిస్తుండగా, వంగవీటి రంగ పాత్రలో సురేష్ కొండేటి నటిస్తున్నారు. చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కె ఎస్ వ్యాస్ గారి పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా.. దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావ్ మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రంలో చేసిన అందరు నటీనటులు చాలా బాగా నటించారు. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, నందమూరి తారక రత్న నిజమైన దేవినేని నెహ్రూలో పరకాయ ప్రవేశం చేసినట్లు నటిస్తున్నారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా మిమ్మల్ని అలరించనున్నాడు. అలాగే సురేంద్ర పాత్రలో ఏం ఎన్ ఆర్ చౌదరి నటిస్తున్నారు. దేవినేని మురళి గా తేజా రాథోడ్, దేవినేని గాంధీగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి మిగతా పాత్రలో బాక్సాఫీస్ రమేష్, రామ్ మోహన్, అన్నపూర్ణమ్మ, ధృవతారలు నటిస్తున్నారు. 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరీపేట హైవే లో భారీగా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ... ‘నా కెరీర్లో ఇది సెకండ్ పేజ్. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మీ ముందుకు రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నాకు చిన్నప్పుడు మా నాన్న గారు నన్ను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్గా చూడాలి అనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకున్నాను. 1983తో రాజ్ కోటిగా నా కెరీర్ అప్పుడే స్టార్ట్ అయింది. ఆ టైములో కె ఎస్ వ్యాస్ గారు విజయవాడ కి ఫస్ట్ పవర్ఫుల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ నేను చేయడం అనేది రేర్ ఇన్సిడెంట్. శివనాగు గారు వండర్ ఫుల్ డైరెక్టర్ . ఈ క్యారెక్టర్ని మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అన్నారు. -
సినీ మ్యుజిషియన్స్ స్వరసంగమం
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ సంగీత దర్శకుడు కోటి
-
ప్రేమ...అంత ఈజీ కాదు!
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, సిమ్మీదాస్ జంటగా తెరకెక్కిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్రేమంటే సులువు కాదురా’. చందా గోవిందరెడ్డిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఆర్పి ప్రొడక్షన్స్ పతాకంపై భవనాసి రాంప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘కుటుంబ భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తీసిన చిత్రమిది. మా చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు మంచి చిత్రమంటూ అభినందించి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చారు. వారి ప్రశంస ఈ చిత్రం విజయంపై మాకు మరింత నమ్మకం కలిగించింది. నందన్రాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చింది. ‘ప్రాణం’ కమలాకర్ రీ రికార్డింగ్ హైలెట్. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమేరా: సురేష్ రఘుట, సహ నిర్మాతలు: కొమారి సుధాకర్రెడ్డి- శ్రీపతి శ్రీరాములు. -
ఊహించని క్లైమాక్స్...
‘‘ప్రస్తుతం చిన్న చిత్రాల హవా వీస్తోంది. కొత్త తరహా చిత్రాలకు ఆదరణ పెరుగుతోంది. సాలూరి రాజేశ్వరరావు వారసుడిగా నన్నెలా ఆదరించారో, సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న మా అబ్బాయికి కూడా మీ ఆశీస్సులు ఉండాలి. ఎవరూ ఊహించని విధంగా ఉండే ఈ చిత్రం క్లైమాక్స్ కచ్చితంగా ప్లస్ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. సిద్ధాంశ్, అక్షర జంటగా జమ్మలమడుగు రవీంద్రనాథ్ నిర్మించిన చిత్రం ‘గాయకుడు’. కమల్.జి దర్శకుడు. ఈ శుక్రవారం చిత్రం విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ-‘‘మంచి టీమ్తో వర్క్ చేశానన్న సంతృప్తి ఉంది. రోషన్ ఇచ్చిన నాలుగు పాటలు చాలా బాగున్నాయి’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. పాటలకు మంచి స్పందన వస్తోంది’’ అని రోషన్ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘నిర్మాతగా నాకిది తొలి సినిమా అయినా ఎక్కడా రాజీపడలేదు. అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్తో పనిచేశాను. చాలా సంతృప్తిగా ఉంది’’ అన్నారు. -
శాస్త్రీయ సంగీతానికే ఉజ్వల భవిత
శాస్త్రీయ సంగీతానికే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కోటి అన్నారు. రత్నగిరిపై సత్యదేవుని శనివారం దర్శించిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. : అన్నవరం (తొండంగి) సాక్షి : ఇప్పటివరకూ ఎన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు? కోటి : 450 చిత్రాలకు పైగా. సాక్షి : ప్రత్యేకంగా గుర్తింపు పొందిన పాటలు ఎన్ని? కోటి : 2,500 వరకూ ఉన్నాయి. సాక్షి : ఏయే భాషా చిత్రాలకు సంగీతం అందించారు? కోటి : తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో చిత్రాలకు సంగీతం అందించాను. సాక్షి : సంగీతంలో పాశ్చాత్య ఒరవడి ఎక్కువగా ఉండటానికి కారణం? కోటి : ఈ కాలం కుర్రకారు ప్రసార మాధ్యమాల ప్రభావంతో పాశ్చాత్య సంగీతంపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. సాక్షి : రానున్న కాలంలో శాస్త్రీయ సంగీతం ప్రభావం ఎలా ఉంటుంది? కోటి : శాస్త్రీయ సంగీతానికి రానున్న కాలంలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. సంగీత ప్రపంచానికి మూలమే శాస్త్రీయ సంగీతం. కాబట్టి కర్నాటక, హిందుస్థానీ సంగీతం నేర్చుకున్న అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుంది. పాశ్చాత్య సంగీత ప్రభావం కొద్దికాలం మాత్రమే ఉంటుందని అభిప్రాయపడుతున్నా. ప్రస్తుతం యువత మళ్లీ శాస్త్రీయ సంగీతంపై ఆసక్తి పెంచుకుంటోంది. సాక్షి : ప్రస్తుతం ఏవైనా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహిస్తున్నారా? కోటి : లేదు. జెమినీలో వస్తున్న ‘బోల్ బేబీ బోల్’ కార్యక్రమం ఒక్కటే చేస్తున్నాను. సాక్షి : ఎటువంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తారు? కోటి : అరుంధతి చిత్రంలాంటి భారీ బడ్జెట్ చిత్రం కావాలి. అలాగే కథనుబట్టి కూడా నిర్ణయం తీసుకుంటాను. -
స్టార్ రిపోర్టర్@ కోటి
-
ప్రేక్షకులు మెచ్చిందే మంచి సంగీతం
పేక్షకులు మెచ్చిందే మంచి సంగీతం, ఆమోదించిందే ఉత్తమ సాహిత్యమని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తనయుడు కోటేశ్వరరావు (కోటి) అన్నారు. ఆర్డీ బర్మన్ పురస్కారం అందుకోవడానికి ఆదివారం నగరానికి వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. ప్రతి పదేళ్లకు ప్రేక్షకుల్లో మార్పు వస్తోంది. నాటి సినిమాల్లో నిర్మాతలు సాహిత్యానికి పెద్ద పీట వేసేవారని, నేడు వాయిద్యాల హోరు పాటను మింగేస్తుందనడం సరికాదన్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పు వల్ల ఈ పరిణామం అనివార్యమైందని ఆయన వివరించారు. ‘ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో’ పాట నాటి ప్రేక్షకులను అలరిస్తే, ఇప్పటి ప్రేక్షకులను ‘రింగా రింగా’ ఆకట్టుకుందని కోటి అన్నారు. వివిధ అంశాలపై ఆయన స్పందన ఆయన మాటల్లోనే... నాన్నగారి ప్రభావం... మెలోడిలో నాన్న గారి ప్రభావం, రిథమ్లో సినీసంగీత దర్శకుడు చక్రవర్తి ప్రభావం నాపై ఉంది. నాన్నగారిది చాలా సున్నితమైన మనస్తత్వం. ఆయన ఒప్పుకున్న సినిమాలు కన్నా, వదిలేసినవే ఎక్కువ. తొలి సినిమా... రాజ్-కోటి సంయుక్త సంగీత దర్శకత్వంలో 1983లో భలే బుల్లోడు సినిమాకు పనిచేశాను. రాజ్తో కలసి 200 సినిమాలు చేశాను. ఒక్కడినే సుమారు 275 సినిమాల వరకు చేశాను. వీటిలో హిందీ, తెలుగు, తమిళం, కన్నడ ఉన్నాయి. అరుంధతి నా అనుభవానికి తగ్గ సినిమా. హలో బ్రదర్, గోవిందా గోవిందా, మల్లీశ్వరి, నువ్వే కావాలి, పెదరాయుడు నాకు పేరు తెచ్చిన సినిమాలు. అన్నీ వ్యాపారపరంగా విజయం సాధించినవే... అవార్డులు-రివార్డులు నేను అవార్డులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం లేదు. వ్యాపారాత్మక సంగీతాన్ని అందించడమే నా పని...హలో బ్రదర్కు నంది అవార్డు వచ్చింది. నువ్వే కావాలి సినిమాకు కూడా కొన్ని అవార్డులు వచ్చాయి. నేటి తరానికి సలహా.. ఇప్పుడు సంగీతం చాలా తేలికైపోయింది. 1974లో గిటారిస్టుగా నా కెరీర్ ప్రారంభమైంది. పెండ్యాల, సుసర్ల దక్షిణామూర్తి, రమేష్ నాయుడు, రాజన్-నాగేంద్ర, జి.కె.వెంకటేష్, ఇళయరాజా, చక్రవర్తి, నాన్నగారు ఇలా ఎందరో ప్రముఖుల వద్ద గిటార్ మెళకువలు నేర్చుకున్నాను. 1975-83 మధ్య కాలంలో చక్రవర్తి వద్ద గిటారిస్ట్గా పని చేశాను. నేటి తరం సంగీత దర్శకులు ఏ వాయిద్యంతో ఏ స్వరం పలికించవచ్చునో ముందుగా తెలుసుకోవాలి. కష్టపడిన పాట, అభిమాన గేయ రచయిత ముఠామేస్త్రిలో ‘ఈ పేటకు నేనే మేస్త్రి’ కంపోజింగ్కు ప్రసవ వేదన పడ్డాను. లంకేశ్వరుడు సినిమాలో కూడా కొన్ని పాటలకు చాలా కష్టపడవలసి వచ్చింది. వేటూరి సుందర రామ్మూర్తి నా అభిమాన గేయ రచయిత. క్లాస్, మాస్ రెంటినీ ఒప్పించగల సమర్థుడు ఆయన. గోదావరి తీరమంటే అభిమానం... బంగారు బుల్లోడు సినిమాకు పాటలన్నీ మహాలక్ష్మి హోటల్లో కంపోజ్ చేశాం. గోదావరీ తీరమంటే నాకు అభిమానం. ఆర్డీ బర్మన్ పేరిట అవార్డు అందుకోవడం నా పూర్వజన్మ సుకృతం.. మహాన్ అనే సినిమాకు ఆయనతో కలసి 40 రోజులు పనిచేశాను. భవిష్యత్ ప్రణాళికలు నాన్నగారి పేరిట ఓ ట్రస్టును స్థాపించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తా.